New Serial: నమ్మకద్రోహానికి బలైన ఇద్దరి వ్యక్తుల జీవితం- జీ తెలుగులో సరికొత్త సీరియల్- మారిన ఆ సీరియల్ టైమ్-new serial kalavaari kodalu kanakamahalakshmi on zee telugu from august 5 and suryakantham serial timings changed ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  New Serial: నమ్మకద్రోహానికి బలైన ఇద్దరి వ్యక్తుల జీవితం- జీ తెలుగులో సరికొత్త సీరియల్- మారిన ఆ సీరియల్ టైమ్

New Serial: నమ్మకద్రోహానికి బలైన ఇద్దరి వ్యక్తుల జీవితం- జీ తెలుగులో సరికొత్త సీరియల్- మారిన ఆ సీరియల్ టైమ్

Sanjiv Kumar HT Telugu
Jul 31, 2024 12:36 PM IST

Kalavaari Kodalu Kanakamahalakshmi Serial On Zee Telugu: జీ తెలుగు ఛానెల్‌లో సరికొత్త సీరియల్ కలవారి కోడలు కనకమహాలక్ష్మీ ప్రారంభం కానుంది. తండ్రీ కూతుళ్ల మధ్య అనురాగం, భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని చూపించే ఈ సీరియల్ ఏ రోజు నుంచి ప్రారంభం కానుందనే వివరాల్లోకి వెళితే..

నమ్మకద్రోహానికి బలైన ఇద్దరి వ్యక్తుల జీవితం- జీ తెలుగులో సరికొత్త సీరియల్- మారిన ఆ సీరియల్ టైమ్
నమ్మకద్రోహానికి బలైన ఇద్దరి వ్యక్తుల జీవితం- జీ తెలుగులో సరికొత్త సీరియల్- మారిన ఆ సీరియల్ టైమ్

New Serial Kalavaari Kodalu Kanakamahalakshmi: ఆసక్తికరమైన మలుపులు, అదిరిపోయే ట్విస్ట్​లతో సాగే సీరియల్స్​ను అందిస్తున్న జీ తెలుగు మరో ఆసక్తికరమైన అంశంతో సాగే సీరియల్​ను అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే జీ తెలుగులో నిండు నూరేళ్ల సావాసం, జగద్దాత్రి, మా అన్నయ్య, మేఘసందేశం వంటి సీరియల్స్​ ఆరంభం నుంచే అశేష ప్రేక్షకాదరణ పొందుతున్నాయి.

నమ్మకద్రోహానికి బలి

ఈ తరుణంలో మరో​ ఆసక్తికరమైన కథ, కథనంతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రముఖ బుల్లితెర ఛానెల్ జీ తెలుగు అందిస్తున్న సరికొత్త సీరియల్​ ‘కలవారి కోడలు కనకమహాలక్ష్మి’. నమ్మకద్రోహానికి బలైన ఇద్దరు వ్యక్తుల జీవితమే ఇతివృత్తంగా తెరకెక్కుతున్న ఈ సీరియల్​ ఆకట్టుకునే కుటుంబ కథగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఉద్వేగభరితంగా

తండ్రీకూతుళ్ల బంధం, భార్యాభర్తల అనుబంధం మధ్య ఉద్వేగభరితంగా సాగే సరికొత్త సీరియల్​ ‘కలవారి కోడలు కనకమహాలక్ష్మి’ ఆగస్టు 5న ప్రారంభం కానుంది. ఆగస్ట్ 5 నుంచి జీ తెలుగు ఛానెల్‌లో సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రసారం కానుంది ‘కలవారి కోడలు కనకమహాలక్ష్మి’ ధారావాహిక.

దుష్ట పన్నాగానికి

కూతురు భవిష్యత్తు కోసం ఆరాటపడే తండ్రి, ఆయన సంతోషం కోసం పాటుపడే కూతురు, తండ్రి కోరికను గౌరవించడం తప్ప మరో కల లేని కనకమహాలక్ష్మి కథే ఈ సీరియల్​. తండ్రి కోరిక మేరకు డిగ్రీ పూర్తి చేసిన కనకమహాలక్ష్మి ఓ దుష్ట పన్నాగానికి బలైపోతుంది. అదే ఆమె జీవితాన్ని తలకిందులు చేస్తుంది. మరోవైపు బాధ్యతాయుతమైన కొడుకుగా ఉన్న విష్ణు విహారి జీవితం నమ్మకద్రోహానికి బలవుతుంది.

విధిని ఎదిరించి

విష్ణు విహారిని కలుసుకున్న కనకమహాలక్ష్మి జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది. అనూహ్యంగా జరిగే వివాహంతో ఈ ఇద్దరి జీవితాలు ముడిపడతాయి. ప్రేమ, పెళ్లి, విధి నడుమ సాగే కథ ఉత్కంఠ రేపే మలుపులతో ఆకట్టుకుంటుంది ఈ సీరియల్. విధిని ఎదిరించి కనకం, విష్ణు వారి జీవన ప్రయాణంలోని అడ్డంకులను ఎలా ఎదుర్కొంటారు? అనేది తెలియాలంటే కలవారి కోడలు కనకమహాలక్ష్మి సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే అని మేకర్స్ చెబుతున్నారు.

పాపులర్​ నటి ప్రియ

ప్రతిభావంతులైన నటీనటులు, ఆకట్టుకునే కథతో తెరకెక్కిన కలవారి కోడలు కనకమహాలక్ష్మి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. పాపులర్​ నటి ప్రియ ఈ సీరియల్‌లో ఓ ముఖ్యపాత్ర పోషిస్తోంది. విష్ణు విహారి పాత్రలో నటిస్తున్న జై ధనుష్ తన నటనతో తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటాడని దర్శకనిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

యుక్తా మల్​నాడ్ మెయిన్ రోల్

‘వైదేహి పరిణయం’ సీరియల్‌లో వైదేహిగా తెలుగు ప్రేక్షకులను అలరించిన యుక్తా మల్​నాడ్ ఈ ‘కలవారి కోడలు కనకమహాలక్ష్మి’ సీరియల్‌లో కనకం పాత్రతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. కనకమహాలక్ష్మి తండ్రిగా విశ్వమోహన్​ నటిస్తున్నారు. మీరూ ఈ తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని ప్రతిరోజూ మిస్​ కాకుండా చూసేయండి అంటూ మేకర్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు.

ఆ సీరియల్ టైమ్ చేంజ్

కలవారి కోడలు కనకమహాలక్ష్మి సీరియల్​ ప్రారంభంతో సూర్యకాంతం సీరియల్​ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రసారమవుతుంది. ప్రేక్షకులు ఈ మార్పును గమనించగలరు అని జీ తెలుగు తెలిపింది.

Whats_app_banner