Waltair Veerayya Melody Song: "నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువ".. మెలోడీ సాంగ్‌కు మెగాస్టార్ క్యూట్ స్టెప్స్-neekemo andamekkuva song released from chiranjeevi waltair veerayya movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Neekemo Andamekkuva Song Released From Chiranjeevi Waltair Veerayya Movie

Waltair Veerayya Melody Song: "నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువ".. మెలోడీ సాంగ్‌కు మెగాస్టార్ క్యూట్ స్టెప్స్

Maragani Govardhan HT Telugu
Jan 11, 2023 12:35 PM IST

Waltair Veerayya Melody Song: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమా నుంచి చివరి మెలోడీ సాంగ్ విడుదలైంది. 'నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువ' అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది.

వాల్తేరు వీరయ్యలో నీకేమో అందమెక్కువ.. నాకెమో తొందరెక్కువ సాంగ్ విడుదల
వాల్తేరు వీరయ్యలో నీకేమో అందమెక్కువ.. నాకెమో తొందరెక్కువ సాంగ్ విడుదల

Waltair Veerayya Melody Song: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయికగా చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్‌లు ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో సరికొత్త అప్డేట్ వచ్చింది. వాల్తేరు వీరయ్యలోని చివరి సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

'నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువ' అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది. మెగాస్టార్, శృతిహాసన్ తమ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. ఎంతో వినసొంపుగా సాగే ఈ మెలోడీ సాంగ్‌కు చిరు తన క్యూట్ స్టెప్పులతో అదరగొట్టారు. ఈ వయస్సులోనూ తనదైన రిథమ్, ఫేసియల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో యువతను ఆకట్టుకుంటున్నారు మన మెగాస్టార్.

వాల్తేరు వీరయ్యలోని ఈ మెలోడీ సాంగ్‌ను మికా సింగ్, గీతా మాధురి, డీ వేల్‌మురుగన్ ఆలపించారు. సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రీ ఈ పాటను రాశారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. పాట ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ మెలోడీ సాంగ్ అభిమానులే కాకుండా శ్రోతలను కూడా విపరీతంగా అలరిస్తోంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను, సినీ ప్రియుల్నీ విపరీతంగా ఆకట్టుకుంది. మెగాస్టార్ వింటేజ్ లుక్‌లో మరోసారి అదరగొట్టారు.

బాబీ(కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మన మెగాస్టార్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా చేసింది. రవితేజ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

WhatsApp channel

సంబంధిత కథనం

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.