మెగాస్టార్ చిరంజీవి - డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందనున్న చిత్రం(Mega157)పై ఇప్పటి నుంచే మంచి హైప్ ఉంది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఈ ఏడాది అనిల్ భారీ బ్లాక్బస్టర్ కొట్టడంతో అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేయనున్నారనే టాక్తో మరింత క్రేజ్ ఉంది. ఈ సినిమా హీరోయిన్ పాత్ర కోసం స్టార్ నటి నయనతారను మేకర్స్ సంప్రదించారని సమాచారం.
ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్ను హీరోయిన్గా తీసుకోవాలని అనిల్ రావిపూడి అనుకుంటున్నారని రూమర్లు చక్కర్లు కొట్టాయి. అయితే, అది నిజం కాదని తేలిపోయింది. చిరంజీవి పక్కన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా అయితే బాగుంటారని అనిల్ భావించారు. దీంతో ఆమెను మేకర్స్ సంప్రదించినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది.
ఈ చిత్రంలో నటించేందుకు నయనతార ఏకంగా రూ.18కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారని ఓటీటీ ప్లే రిపోర్ట్ పేర్కొంది. ఆ విషయం ఈ మూవీ యూనిట్ వర్గాల ద్వారా తెలిసిందని వెల్లడించింది. నయనతార అడిగిన రెమ్యూనరేషన్ మొత్తంతో మేకర్స్ అవాక్కయ్యారని ఆ వర్గాలు చెప్పిన ఆ రిపోర్ట్ వెల్లడించింది.
ఈ మూవీ కోసం నయనతారకు అంత మొత్తం ఇచ్చేందుకు మేకర్స్ విముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై చర్చలు జరిగే అవకాశం ఉంది. అలాగే, హీరోయిన్ పాత్ర కోసం వేరే ఆప్షన్లను కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం బాలీవుడ్ నటి పరిణితి చోప్రా పేరు కూడా పరిశీలిస్తున్నట్టు గతంలో రూమర్ వచ్చింది. మరి ఈ సినిమాకు హీరోయిన్గా ఎవరు ఫిక్స్ అవుతారో చూడాలి.
మెగా157 మూవీకి ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరిగాయి. లాంఛనంగా ఈ చిత్రం లాంచ్ అయింది. ఈ ఏడాది జూన్లో షూటింగ్ మొదలుకానుంది. వచ్చే ఏడాది 2026 సంక్రాంతికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. ఈ మూవీని సాహు గారపాటితో పాటు చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మించనున్నారు. భీమ్స్ సెసిరోలియో మ్యూజిక్ ఇవ్వనున్నారు.
మూవీ టీమ్ను చిరంజీవికి పరిచయం చేస్తూ ఇటీవలే ఓ స్పెషల్ వీడియో చేశారు అనిల్ రావిపూడి. చిరూ పాత సినిమాల పాపులర్ డైలాగ్లతో, కటౌట్లతో ఉన్న ఈ వీడియో బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా ఫుల్ కామెడీతో ఉంటుందని చిరంజీవి కూడా ఓ సందర్భంగా చెప్పారు. దీంతో అభిమానుల్లో ఈ మూవీపై చాలా క్యూరియాసిటీ నెలకొంది.
చిరంజీవి నటించిన విశ్వంభర చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ కావాల్సింది. ఈ ఏడాది సంక్రాంతికే రావాల్సిన ఈ సోషియో ఫ్యాంటసీ మూవీ వాయిదా పడింది. జూలై నెలలో తీసుకొచ్చేందుకు మేకర్స్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేస్తోంది. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో వీఎఫ్ఎక్స్ భారీగా ఉండనుంది.
సంబంధిత కథనం