Samantha: నాని, సమంత హీరోహీరోయిన్లుగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఎటో వెళ్లిపోయింది మనసు మూవీ దాదాపు పన్నెండేళ్ల తర్వాత మరోసారి థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆగస్ట్ 2న ఈ ఎవర్గ్రీన్ లవ్స్టోరీ రీ రిలీజ్ అవుతోంది. ఎటో వెళ్లిపోయింది మనసు సినిమా రీ రిలీజ్ డేట్ను మేకర్స్ మంగళవారం ప్రకటించారు. లక్ష్మీ నరసింహా మూవీస్ బ్యానర్ మీద సుప్రియ, శ్రీనివాస్ రీ రిలీజ్ చేస్తున్నారు.
2012లో రిలీజైన ఈ ప్రేమకథా చిత్రం ఐదు నంది అవార్డులను అందుకున్నది. బెస్ట్ హీరోగా నాని, బెస్ట్ హీరోయిన్గా సమంత, ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్గా ఇళయరాజా, గేయరచయితగా అనంత్ శ్రీరామ్ ఈ మూవీకి గాను నంది అవార్డులను గెలుచుకున్నారు. వీరితో పాటు స్పెషల్ జ్యూరీ విభాగంలో గౌతమ్ మీనన్కు నంది అవార్డు దక్కింది.
ఏటో వెళ్లిపోయింది మనసు సినిమాలో నాని, సమంత నటనతో పాటు గౌతమ్ మీనన్ కథ, స్క్రీన్ప్లేకు ప్రశంసలు దక్కాయి. మెలోడీ ప్రధానంగా ఇళయరాజా అందించిన పాటలు మ్యూజిక్ లవర్స్ను ఆకట్టుకున్నాయి.
ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఒకేసారి రూపొందించాడు గౌతమ్ మీనన్, తమిళ వెర్షన్లో జీవా హీరోగా నటించాడు. తెలుగు, తమిళం రెండు భాషల్లో సమంత హీరోయిన్గా కనిపించింది. హిందీలోనూ ఆదిత్య రాయ్ కపూర్, సమంతతో సినిమాను చేయాలనిఅనుకున్నాడు గౌతమ్ మీనన్. కొంత భాగం షూటింగ్ పూర్తయిన తర్వాత బడ్జెట్, ప్రొడక్షన్ పరమైన సమస్యల కారణంగా సినిమా ఆగిపోయింది.
గత ఏడాది రిలీజైన ఖుషి తర్వాత సినిమాలకు దాదాపు పది నెలలకుపైనే గ్యాప్ తీసుకున్నది సమంత. ఇటీవలే ఆమె కొత్త సినిమా షూటింగ్ను మొదలుపెట్టినట్లు సమాచారం. తన బర్త్డే రోజు మా ఇంటి బంగారం పేరుతో ఫ్యామిలీ యాక్షన్ డ్రామా మూవీని అనౌన్స్చేసింది. మెడలో తాళిబొట్టుతో చేతిలో గన్ పట్టుకొని రిలీజ్ చేసిన పోస్టర్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్ పేరుతో ఓన్ ప్రొడక్షన్ హౌజ్ను నెలకొల్పిన సమంత ఈ బ్యానర్పై తొలి ప్రయత్నంగా మా ఇంటి బంగారం మూవీని నిర్మిస్తోంది.
సమంత లీడ్ రోల్లో నటిస్తోన్న బాలీవుడ్ యాక్షన్ వెబ్ సిరీస్ ది సిటాడెల్ త్వరలో ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఆమెజాన్ ప్రైమ్లో ఈ వెబ్సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. తుంబాద్ దర్శకుడితో సమంత నెట్ఫ్లిక్స్ కోసం మరో హారర్ థ్రిల్లర్వెబ్ సిరీస్ చేయబోతున్నట్లు సమాచారం.