నాగచైతన్యతో మీనాక్షి చౌదరీ రొమాన్స్.. మిథికల్ థ్రిల్లర్ గా మూవీ.. టైటిల్ ఫిక్స్!-naga chaitanya upcoming movie titled as vrusha karma a mythical thriller meenakshi chaudhary in female lead ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  నాగచైతన్యతో మీనాక్షి చౌదరీ రొమాన్స్.. మిథికల్ థ్రిల్లర్ గా మూవీ.. టైటిల్ ఫిక్స్!

నాగచైతన్యతో మీనాక్షి చౌదరీ రొమాన్స్.. మిథికల్ థ్రిల్లర్ గా మూవీ.. టైటిల్ ఫిక్స్!

నాగ చైతన్య కొత్త మూవీ నుంచి ఓ క్రేజీ అప్‌డేట్‌ వచ్చింది. కార్తీక్ దండు డైరెక్షన్ లో చై నటిస్తున్న మూవీకి ఓ డిఫరెంట్ నేమ్ కన్ఫార్మ్ చేశారని తెలిసింది. విరూపాక్ష టైటిల్ తరహాలోనే చైతన్య మూవీకి కూడా అలాంటి పేరే పెట్టారనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ మూవీలో చైతన్యతో మీనాక్షి చౌదరి రొమాన్స్ చేయబోతోంది.

నాగ చైతన్య కొత్త సినిమాకు డిఫరెంట్ టైటిల్ (x/FilmyTwoodOffl)

నాగ చైతన్య కొత్త మూవీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమాకు డిఫరెంట్ టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. కానీ టైటిల్ మాత్రం కన్ఫార్మ్ అయినట్లు టాక్. నాగ చైతన్య నటిస్తున్న 24వ మూవీకి ‘వృష‌క‌ర్మ‌’ అనే టైటిల్ ను ఓకే చేసినట్లు తెలిసింది. అలాగే ఈ మూవీలో చై సరసన మీనాక్షి చౌదరి ఫీమేల్ లీడ్ రోల్ ప్లే చేయనుంది.

తండేల్ విజయం తర్వాత

ఇటీవల తండేల్ మూవీ విజయంతో నాగ చైతన్య జోష్ మీదున్నారు. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న చై తర్వాతి సినిమా కోసం సిద్ధమయ్యారు. కార్తీక్ వర్మ దండు డైరెక్షన్ లో మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కూడా ఇప్పటికే స్టార్ట్ అయింది. ఈ మైథలాజికల్ (మిథికల్) థ్రిల్లర్ కోసం చై తన లుక్ ఛేంజ్ చేశారు. ఈ మూవీకి ‘వృష‌క‌ర్మ‌’ అనే టైటిల్ పెట్టాలని మేకర్స్ ముందు నుంచే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఎన్‌సీ24కు అదే టైటిల్ ను ఫిక్స్ చేశారని ఎక్స్ లో సైమా అకౌంట్లో పోస్టు చేశారు.

విరూపాక్ష లాగే

విరూపాక్ష సినిమాతో డైరెక్టర్ గా కార్తీక్ దండు సెన్షేషన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు అదే తరహాలో చై సినిమాకు కూడా విభిన్నమైన టైటిల్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. అందుకే ‘వృష‌క‌ర్మ‌’ పేరును కన్ఫార్మ్ చేసినట్లు తెలిసింది. వృష‌క‌ర్మ‌ అంటే కార్యసాధకుడు, చేసే పనిపై శ్రద్ధ ఉన్నవాడు అని అర్థం. విరూపాక్షను డిఫరెంట్ జోనర్ లో చేసిన కార్తీక్ దండు.. చై సినిమా కోసం మరో విభిన్నమైన రూట్ లో వెళ్లబోతున్నారు. ఈ మూవీని మైథలాజికల్ థ్రిల్లర్ గా మునుపెన్నడూ చూడని స్టోరీతో తెరకెక్కించనున్నారు.

ఈ మూవీ కోసమే

విరూపక్ష తర్వాత వేరే ఆఫర్స్ వచ్చినా చైతన్య తో మూవీపైనే కార్తీక్ దండు వర్క్ చేశారని తెలిసింది. ఈ మూడీలో చైతో మీనాక్షి చౌదరి రొమాన్స్ చేయనుంది. ఆమె వరుసగా హిట్ సినిమాలను అందిస్తూ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా నిలుస్తోంది. మరోవైపు బాలీవుడ్ లో ‘లాపతా లేడీస్’తో గుర్తింపు తెచ్చుకున్న స్పర్ష్ శ్రీవాత్సవ్ విలన్ గా నటిస్తున్నారని టాక్. రూ.100 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ నిర్మిస్తున్నారు.

ఈ మూవీకి బి.అజనీశ్ లోక్ నాథ్ మ్యూజిక్ డైరెక్టర్. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (ఎస్వీసీసీ), సుకుమార్ రైటింగ్స్ కలిసి ఈ మూవీని జాయింట్ గా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. పుష్ఫ ఫ్రాంఛైజీ సినిమాలతో భారత చిత్ర రంగంలో సంచలనం క్రియేట్ చేసిన డైరెక్టర్ సుకుమార్.. ఈ మూవీకి ప్రోడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం