Naga Chaitanya Sobhita Dhulipala: నాగ చైతన్య, శోభితా ధూళిపాళ కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సోమవారం (అక్టోబర్ 28) సాయంత్రం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన ఏఎన్నాఆర్ నేషనల్ అవార్డు ప్రదాన కార్యక్రమంలో ఈ ఇద్దరూ కనిపించారు. ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్.. మెగాస్టార్ చిరంజీవికి అవార్డు అందజేశాడు.
నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల రెండున్నర నెలల కిందట నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలుసు కదా. ఆ ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి. ఆ తర్వాత వీళ్ల మళ్లీ ఎప్పుడూ అభిమానుల ముందుకు కలిసి రాలేదు. తాజాగా ఏఎన్నార్ నేషనల్ అవార్డు ప్రదానోత్సవంలో ఈ జంట కనువిందు చేసింది. ఇద్దరూ నవ్వుతూ కనిపించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ కార్యక్రమానికి శోభిత లైట్ గ్రీన్ కలర్ చీరలో వచ్చింది. అంతకుముందే అక్కడికి వచ్చిన చైతన్య.. తన కాబోయే భార్య రాగానే ఆమెకు వెల్కమ్ చెప్పి లోనికి తీసుకెళ్లాడు. బయట ఈ ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత లోపలికి వెళ్లారు. ఆగస్ట్ 8వ తేదీన వీళ్లు ఎంగేజ్మెంట్ చేసుకోగా.. త్వరలోనే వీళ్ల పెళ్లి జరగనుంది. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా రానుంది.
మెగాస్టార్ చిరంజీవి ఏఎన్నార్ నేషనల్ అవార్డు అందుకున్నాడు. అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రతి ఏటా ఆ దివంగత నటుడి పేరు మీద అవార్డులు అందజేస్తోంది. ఈసారి చిరుకి ఈ అవార్డు ఇవ్వనున్నట్లు కొన్నాళ్ల కిందట నాగార్జున అనౌన్స్ చేశాడు. మెగాస్టార్ కు ఈ అవార్డు ఇవ్వడానికి ముంబై నుంచి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హైదరాబాద్ కు వచ్చాడు.
ఈ ససందర్భంగా ఏఎన్నార్, నాగార్జున గురించి బిగ్ బీ మాట్లాడాడు. "నమస్కార్.. మనం ఏదైతే చూశామో, విన్నామో, గమనించామో.. దాని తర్వాత ఇక్కడి నిల్చొని మాట్లాడటం చాలా కష్టం. నన్ను ఇక్కడికి పిలిచి గౌరవించిన అక్కినేని నాగేశ్వర రావు ఫౌండేషన్ కు చాలా కృతజ్ఞతలు. వినోదం, సాంస్కృతిక రంగాలకు జీవం పోసిన ఘనత ఏఎన్నార్ కు దక్కుతుంది. నాన్న చూపిన ఘన వారసత్వాన్ని కొనసాగిస్తున్న నాగ్, అతని కుటుంబ సభ్యులకు నా అభినందనలు" అని అమితాబ్ అన్నాడు.