Mrs Chatterjee vs Norway trailer: పిల్లల కోసం ఓ దేశంపైనే తల్లి చేసే పోరాటం.. కంటతడి పెట్టిస్తున్న ట్రైలర్-mrs chatterjee vs norway trailer out as the bollywood celebs all praise for the movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Mrs Chatterjee Vs Norway Trailer Out As The Bollywood Celebs All Praise For The Movie

Mrs Chatterjee vs Norway trailer: పిల్లల కోసం ఓ దేశంపైనే తల్లి చేసే పోరాటం.. కంటతడి పెట్టిస్తున్న ట్రైలర్

Hari Prasad S HT Telugu
Feb 23, 2023 04:26 PM IST

Mrs Chatterjee vs Norway trailer: పిల్లల కోసం ఓ దేశంపైనే తల్లి చేసే పోరాటంతో కంటతడి పెట్టిస్తోంది మిసెస్ ఛటర్జీ vs నార్వే మూవీ ట్రైలర్. నిజ జీవితంలో జరిగిన ఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ తన నటనతో అదరగొట్టింది.

మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే సినిమాలో రాణీ ముఖర్జీ
మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే సినిమాలో రాణీ ముఖర్జీ

Mrs Chatterjee vs Norway trailer: మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే.. బాలీవుడ్ లో రాబోతున్న కొత్త సినిమా ఇది. రాణీ ముఖర్జీ నటించిన ఈ సినిమా ట్రైలర్ గురువారం (ఫిబ్రవరి 23) రిలీజైంది. నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ ఆలియా భట్ ను కంటతడి పెట్టించింది. అర్జున్ కపూర్ ను కూడా భావోద్వేగానికి గురి చేసింది.

పిల్లల బాగోగులను సరిగా చూడటం లేదంటూ ఓ బెంగాలీ తల్లి నుంచి నార్వే ప్రభుత్వం వాళ్లను వేరు చేసి ఫోస్టర్ కేర్ లో ఉంచుతుంది. తనకు దూరమైన తన పిల్లలను తిరిగి పొందడానికి ఆ తల్లి ఎలాంటి పోరాటం చేస్తుందో ఇందులో చూపించారు. ఆ తల్లి పాత్రలో రాణి ముఖర్జీ కనిపించింది. ఈ ట్రైలర్ ను చూసిన తర్వాత తాను కంటతడి పెట్టినట్లు ఆలియా చెప్పగా.. రాణి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇది అని డైరెక్టర్ కరణ్ జోహార్ అన్నాడు.

ఈ ట్రైలర్ ను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. "ఏడిపించేసింది. కదిలించే ట్రైలర్" అని ఆలియా చెప్పంది. అటు అభిషేక్ బచ్చన్ కూడా దీనిపై స్పందిస్తూ.. చాలా పవర్‌ఫుల్ గా కనిపిస్తోంది.. ఆల్ ద బెస్ట్ అని అన్నాడు. ఈ సినిమా చూసి ప్రభావితం కాని తల్లిదండ్రులు ఉండరు అంటూ డైరెక్టర్ కరణ్ జోహార్ ఈ ట్రైలర్ ను షేర్ చేసుకున్నాడు. రాణి ముఖర్జీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇది అని అన్నాడు.

ఆషిమా చిబ్బర్ డైరెక్ట్ చేసిన ఈ మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే మూవీ మార్చి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. పిల్లలకు స్పూన్ తో కాకుండా చేత్తో తినిపిస్తోందని, వాళ్ల బాగోగులు కూడా సరిగా చూడటం లేదని ఓ భారతీయ తల్లి నుంచి ఆమె పిల్లలను వేరు చేస్తుంది నార్వే ప్రభుత్వం. ఇది నిజ జీవితంలో జరిగిన ఘటన. దాని ఆధారంగానే ఇప్పుడీ మిసెస్ ఛటర్జీ సినిమాను తెరకెక్కించారు.

ఈ మూవీ ట్రైలర్ చూసి తాను వణికిపోయానని బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ అన్నాడు. నార్వేలోని ఫోస్టర్ కేర్ వ్యవస్థపై ఓ భారతీయురాలైన తల్లి చేసే పోరాటాన్ని అద్భుతంగా చిత్రీకరించారని అతడు చెప్పాడు. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు. ఈ సినిమాలో రాణి ముఖర్జీతోపాటు అనిర్బన్ భట్టాచార్య, జిమ్ సర్బా, నీనా గుప్తా కూడా నటించారు.

WhatsApp channel

సంబంధిత కథనం

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.