మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ హీరోగా 1971: బియాండ్ బార్డర్స్ అనే చిత్రం వచ్చింది. ఈ మూవీలో తెలుగు యంగ్ హీరో అల్లు శిరీష్ కూడా ఓ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈ సినిమా 2017లో మలయాళంలో థియేటర్లలో రిలీజైంది. 1971లో జరిగిన భారత్, పాకిస్థాన్ యుద్ధం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీ ఆశించిన రిజల్ట్ అందుకుంది. ఈ చిత్రానికి మేజర్ రవి దర్శకత్వం వహించారు. 1971: బియాండ్ బార్డర్స్ సినిమా తెలుగు డబ్బింగ్లో యుద్ధ భూమి పేరుతో ఉంది.
1971: బియాండ్ బార్డర్స్ సినిమా తెలుగు డబ్బింగ్లో యుద్ధభూమి పేరుతో యూట్యూబ్లో అందుబాటులో ఉంది. భవానీహెచ్డీ మూవీస్ అనే యూట్యూబ్ ఛానెల్లో యుద్ధభూమి సినిమా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీని ఉచితంగా చూసేయవచ్చు.
1971: బియాండ్ బార్డర్స్ (యుద్ధభూమి) సినిమాలో కల్నల్ మహదేవన్ పాత్రలో మోహన్లాల్ నటించారు. మరో క్యారెక్టర్ కూడా చేశారు. సెకండ్ లెఫ్టినెంట్ చిన్మయ్ పాత్ర పోషించారు అల్లు శిరీష్. ఈ మూవీలో అరుణోదయ్ సింగ్, రెంజి పనికర్, దీపక్ జేతి, ఆశా శరత్, ప్రియాంక అగర్వాల్ కీలకపాత్రలు పోషించారు.
బంగ్లాదేశ్ విమోచన పోరాటం సమయంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య 1971లో జరిగిన యుద్ధం ఆధారంగా 1971: బియాండ్ బార్డర్స్ చిత్రం రూపొందింది. వార్ థ్రిల్లర్ సినిమాగా డైరెక్టర్ మేజర్ రవి తెరెకెక్కించారు. జార్జియాలోనూ ఈ మూవీ షూటింగ్ జరిగింది. సుమారు రూ.15కోట్ల బడ్జెట్తో ఈ చిత్రం రూపొందింది.
ఈ సినిమాను రెడ్ రోజ్ క్రియేషన్స్ పతాకంపై ఆండ్రూ జాన్సన్ ప్రొడ్యూజ్ చేశారు. 2017 ఏప్రిల్ 7వ తేదీన ఈ మూవీ మలయాళంల థియేటర్లలో రిలీజైంది. అయితే అంచనాలకు తగ్గట్టుగా టాక్ రాలేదు. మిక్స్డ్ రెస్పాన్స్ దక్కింది. దీంతో సుమారు రూ.10కోట్లనే ఈ చిత్రం దక్కించుకుంది. కమర్షియల్గా ప్లాఫ్ అయింది.
1971: బియాండ్ బార్డర్స్ మూవీకి గోపీసుందర్ సంగీతం అందించారు. సుజిత్ వాసుదేవన్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి సంజిత్ మహమ్మద్ ఎడిటింగ్ చేశారు. ఈ సినిమాను తెలుగు డబ్బింగ్లో యుద్ధభూమి పేరుతో యూట్యూబ్లో చూసేయవచ్చు. వార్ సినిమాలను ఇష్టపడే వారిని ఈ చిత్రం మెప్పించవచ్చు.
సంబంధిత కథనం