మలయాళ సీనియర్ స్టార్ హీరో మోహన్లాల్ నటించిన ఎల్2: ఎంపురాన్ బాక్సాఫీస్ సక్సెస్ సాధించింది. పృథ్విరాజ్ సుకుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించడంతో పాటు ఓ కీలకపాత్ర కూడా పోషించారు. ఈ హైవోల్టేజ్ యాక్షన్ మూవీ ఈ ఏడాది మార్చి 27వ తేదీన థియేటర్లలో రిలీజై దుమ్మురేపింది. లూసిఫర్ సీక్వెల్గా భారీ అంచనాలు ఉండగా వాటిని నిలుపుకుంది. ఇప్పుడు ఓటీటీలోనూ ఎల్2: ఎంపురాన్ దుమ్మురేపుతోంది.
ఎల్2: ఎంపురాన్ సినిమా ఏప్రిల్ 24న జియోహాట్స్టార్ ఓటీటీలోకి మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్కు అడుగుపెట్టింది. బ్లాక్బస్టర్ హిట్ అయినా థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చింది. క్రేజ్తో స్ట్రీమింగ్కు వచ్చిన ఈ చిత్రానికి అన్ని భాషల్లో మంచి వ్యూస్ దక్కాయి.
జియోహాట్స్టార్ ఓటీటీలో ప్రస్తుతం (ఏప్రిల్ 29) ఎల్2: ఎంపురాన్ సినిమా ట్రెండింగ్లో టాప్ ప్లేస్కు వచ్చింది. మలయాళం, తెలుగు, కన్నడ, తమిళం విభాగాల్లో హాట్స్టార్ ఓటీటీలో అగ్రస్థానంలో ట్రెండ్ అవుతోంది. మంచి వ్యూస్ సాధిస్తూ స్ట్రీమింగ్లోనూ సత్తాచాటుతోంది.
ఎల్2: ఎంపురాన్ చిత్రం బడ్జెట్పరంగానూ, రికార్డుల్లోనూ మలయాళ ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించింది. ఈ మూవీ సుమారు రూ.170కోట్ల బడ్జెట్తో రూపొందింది. అత్యంత ఖరీదైన మలయాళ చిత్రం నిలిచింది. ఇక ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.260కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుంది. దీంతో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా చరిత్ర సృష్టించింది.
ఎల్2: ఎంపురాన్ మూవీని పాలిటిక్స్, ఇంటర్నేషనల్ మాఫియా గ్రూప్లు బ్యాక్డ్రాప్లో యాక్షన్ మూవీగా తెరకెక్కించారు పృథ్విరాజ్ సుకుమారన్. ఈ మూవీపై కాస్త వివాదం నడిచింది. కొన్ని సీన్లలో కట్స్ కూడా చేశారు మేకర్స్. కాంట్రవర్సీ నడిచినా బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ మూవీ జోరు చూపింది. ఈ చిత్రంలో మోహన్లాల్, పృథ్విరాజ్తో పాటు టివినో థామస్, అభిమన్యు సింగ్, మంజు వారియర్, ఇంద్రజిత్ సుకుమారన్, జెరోమ్ ఫ్లిన్ కీలకపాత్రలు పోషించారు.
ఎంపురాన్ మూవీని ఆశీర్వాద్ సినిమాస్, లైకా ప్రొడక్షన్స్, శ్రీగోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, సుభాస్కరన్, గోకులం గోపాలన్ ప్రొడ్యూజ్ చేశారు. దీపక్ దేవ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సుజీత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ చేశారు.
సంబంధిత కథనం