Mirzapur S3 OTT: ఎక్కువ మంది ఎదురుచూస్తున్న ఇండియన్ వెబ్ సిరీస్లో మీర్జాపూర్ మూడో సీజన్ ముందుంది. ఈ క్రైమ్ ఇంటెన్స్ డ్రామా సిరీస్లో తొలి రెండు సీజన్లు భారీ సక్సెస్ అయ్యాయి. మీర్జాపూర్ పవర్ కోసం జరిగే కుట్రలు, ప్రతీకారాలు, హింసతో రెండు సీజన్లు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇప్పుడు, మీర్జాపూర్ మూడో సీజన్ వచ్చేస్తోంది. జూలై 5వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుంది. ఈ తరుణంలో సీజన్ 3 ట్రైలర్ తీసుకొచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ట్రైలర్ రిలీజ్ డేట్పై నేడు అధికారిక ప్రకటన వచ్చింది.
మీర్జాపూర్ సీజన్ 3 వెబ్ సిరీస్ ట్రైలర్ జూన్ 20వ తేదీన రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్ఫామ్ నేడు (జూన్ 18) ప్రకటించింది. ఓ కొత్త పోస్టర్ తీసుకొచ్చి ట్రైలర్ డేట్ను వెల్లడించింది. అఫీషియల్ ట్రైలర్ జూన్ 20న వస్తుందని పేర్కొంది.
మీర్జాపూర్ మూడో సీజన్ను జూలై 5న తేదీన స్ట్రీమింగ్కు తీసుకొస్తామని అమెజాన్ ప్రైమ్ వీడియో ఇటీవలే వెల్లడించింది. అయితే అందుకోసం ఓ యానిమేటెడ్ పోస్టర్ తీసుకొచ్చి ప్రేక్షకులకే పని పెట్టింది. దాంట్లోనే స్ట్రీమిండ్ డేట్ ఉందని, గుర్తించాలని చెప్పింది. ఆ తర్వాత ఎట్టకేలకు జూలై 5న స్ట్రీమింగ్కు వస్తుందని వెల్లడించింది.
మీర్జాపూర్ సీజన్ 3లో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజర్, రసిక దుగల్, శ్వేత త్రిపాఠి శర్మ, విజయ్ వర్మ, ఇషా తల్వార్, అంజుమ్ శర్మ, ప్రియాన్షు పైన్యులీ, హర్షిత శేఖర్ గౌర్, రాజేశ్ తైలాంగ్, షీబా చద్దా ప్రధాన పాత్రలు పోషించారు. మరికొన్ని క్యారెక్టర్లు కూడా తిరిగి వస్తాయనే అంచనాలు ఉన్నాయి.
మీర్జాపూర్ మూడో సీజన్కు కరణ్ ఆయుష్మాన్, గుర్మీత్ సింగ్, మిహిర్ దేశాయ్ దర్శకత్వం వహించారు. కరణ్ ఆయుష్మాన్, పునీత్ కృష్ణ క్రియేటర్లుగా ఉన్నారు. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఈ సిరీస్ను నిర్మించింది. మీర్జాపూర్పై ఆధిపత్యం కోసం పోరు మూడో సీజన్లోనూ సాగనుంది.
మీర్జాపూర్ తొలి సీజన్ 2018లో వచ్చి బాగా పాపులర్ అయింది. 2020లో వచ్చిన రెండో సీజన్ మరింత భారీ సక్సెస్ అయింది. సక్రేడ్ గేమ్స్ తర్వాత మోస్ట్ పాపులర్ ఇండియన్ వెబ్ సిరీస్గా నిలిచింది. ఇక మీర్జాపూర్ మూడో సీజన్ కోసం నాలుగేళ్లుగా అభిమానులు ఎదురుచూస్తున్నారు ఎట్టకేలకు జూలై 5వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో సీజన్ 3 చూసేయవచ్చు.
పంచాయత్ వెబ్ సిరీస్ మూడో సీజన్ మే నెలలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వచ్చింది. మే 28న తేదీన ఈ రూరల్ డ్రామా సిరీస్ అడుగుపెట్టింది. ఈ సిరీస్ రెండు సీజన్లు కూడా సూపర్ సక్సెస్ కాగా.. మూడో సీజన్ కోసం ప్రేక్షకులు రెండేళ్లు ఎదురుచూశారు. అయితే గత నెలలోనే ఈ సిరీస్ వచ్చింది. జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘువీర్ యాదవ్, ఫైజల్ మాలిక్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ పంచాయత్ సీజన్ 3కు కూడా భారీగా వ్యూస్ దక్కుతున్నాయి. ఈ సిరీస్కు దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహించారు.
టాపిక్