మలయాళ యాక్టర్లు మాథ్యూ థామస్, అర్జున్ అశోకన్ ప్రధాన పాత్రలు పోషించిన ‘బ్రొమాన్స్’ సినిమా మంచి హిట్ అయింది. ఈ ఏడాది ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైన ఈ అడ్వెంచర్ కామెడీ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద కూడా జోరు చూపింది. ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురుచూశారు. ఎట్టకేలకు ఈ బ్రొమాన్స్ మూవీ నేడే ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.
బొమాన్స్ సినిమా నేటి (ఏప్రిల్ 30) సాయంత్రం 5.30 గంటలకు సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్కు అడుగుపెట్టనుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీలోనూ స్ట్రీమింగ్కు రానుంది. ఈ చిత్రాన్ని మే 1న తీసుకురానున్నట్టు గతంలో సోనీలివ్ ప్రకటించింది. అయితే, ఒక రోజు ముందుగా నేడే సాయంత్రం ఈ చిత్రం స్ట్రీమింగ్కు ఎంట్రీ ఇవ్వనుంది.
బ్రొమాన్స్ సినిమా వాలెంటైన్స్ డే రోజున ఫిబ్రవరి 14వ తేదీ థియేటర్లలో రిలీజైంది. అదిరిపోయే టాక్ తెచ్చుకరొని కమర్షియల్ సక్సెస్ సాధించింది. అయితే, ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం చాలారోజుల నిరీక్షణ సాగింది. ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు థియేటర్లలో రిలీజైన సుమారు రెండున్నర నెలల తర్వాత సోనీ లివ్ ఓటీటీలోకి నేడే ఈ మూవీ స్ట్రీమింగ్కు అడుగుపెట్టనుంది.
బ్రొమాన్స్ చిత్రానికి అరుణ్ జీ జోస్ దర్శకత్వం వహించారు. కనిపించకుండా పోయిన అన్న కోసం తమ్ముడు వెతకడం చుట్టూ ఈ చిత్రం సాగుతుంది. అన్నను వెతికేందుకు స్నేహితుల సాయం తీసుకుంటాడు ఆ తమ్ముడు. ఈ క్రమంలో కొన్ని ఊహించని ట్విస్టులు, సవాళ్లు, కొత్త విషయాలు ఎదురవుతాయి. ఈ చిత్రం కామెడీ ప్రధానంగా సాగుతుంది. కొన్ని సీన్లు మనసుకు హత్తుకునే ఉంటాయి.
బ్రొమాన్స్ సినిమాలో మాథ్యూ థామస్, అశోకన్తో పాటు మహిమ నంబియార్, సంగీత్ ప్రతాప్, కళాభవన్ షాజాన్, శ్యామ్ మోహన్, భరత్ బొపన్న, బినూ పప్పు కీలకపాత్రలు పోషించారు. ఆషిక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆషిక్ ఉస్మాన్ ఈ మూవీని ప్రొడ్యూజ్ చేశారు. గోవింద్ వసంత మ్యూజిక్ ఇచ్చారు.
బ్రొమాన్స్ చిత్రం సుమారు రూ.3కోట్ల బడ్జెట్తో రూపొందినట్టు అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఓవరాల్గా దాదాపు రూ.13కోట్ల కలెక్షన్లను సాధించింది. బాక్సాఫీస్ సక్సెస్ కొట్టింది. ఈ సినిమాను నేటి సాయంత్రం నుంచి సోనీ లివ్ ఓటీటీలో చూసేయవచ్చు.
సంబంధిత కథనం