ఓటీటీల్లోకి కొత్త మలయాళ చిత్రాల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా బాగా పాపులర్ అయిన సూపర్ హిట్ చిత్రాలను ఓటీటీలో చూడాలని అనుకుంటుంటారు. మలయాళ చిత్రాలు ఎక్కువగా ఇతర భాషల్లోనూ ఓటీటీలోకి వస్తుంటాయి. ఈ మే నెలలో ఓటీటీల్లో రెండు మలయాళ సినిమాలకు ఎక్కువ క్రేజ్ కనిపిస్తోంది. అవే ‘మరణమాస్’, ‘తుడరుమ్’. ఈ రెండు బ్లాక్బస్టర్ చిత్రాలు ఇదే నెలలో ఓటీటీల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి.
మలయాళ హీరో బాసిల్ జోసెఫ్.. తెలుగులోనూ బాగా పాపులర్ అయ్యారు. ఓటీటీల్లో తెలుగు డబ్బింగ్లో జోసెఫ్ నటించిన చిత్రాలకు మంచి క్రేజ్ కనిపిస్తుంది. బాసిల్ జోసెఫ్ హీరోగా చేసిన ‘మరణమాస్’ సిసిమా మే 15వ తేదీన సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుంది. మలయాళంలో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్కు అడుగుపెట్టనుంది. థియేటర్లలో మలయాళంలో ఒక్కటే విడుదలైనా.. ఓటీటీలో ఐదు భాషల్లో అడుగుపెడుతోంది.
డార్క్ కామెడీ మూవీ మరణమాస్ ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ చిత్రానికి శివప్రసాద్ దర్శకత్వం వహించారు ఓ సీరియల్ కిల్లర్ చుట్టూ ఈ సినిమా సాగుతుంది. సుమారు రూ.8కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా దాదాపు రూ.18కోట్ల కలెక్షన్లు రాబట్టి సూపర్ హిట్ అయింది.
మరణమాస్ చిత్రాన్ని హీరో టొనినో థామస్, టింగ్స్టన్ థామస్, రఫేల్, తంజీర్ సలామ్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ మూవీకి థియేట్రికల్ రన్లో పాజిటివ్ టాక్ వచ్చింది. క్లైమాక్స్ కూడా ప్రత్యేకంగా ఉందనే కామెంట్లు దక్కాయి. ఈ మరణమాస్ చిత్రాన్ని మే 15 నుంచి సోనీ లివ్ ఓటీటీలో చూసేయవచ్చు.
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన తుడరుమ్ సినిమా ఏప్రిల్ 25వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం పాజిటివ్ టాక్తో కలెక్షన్లలో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమా రూ.150కోట్ల కలెక్షన్ల మార్క్ దాటింది. ఇంకా దూకుడు చూపిస్తోంది. తెలుగునూ థియేటర్లలో విడుదలై మంచి కలెక్షన్లు దక్కించుకుంటుంది.
తుడరుమ్ సినిమా ఈ మే నెల చివర్లో జియోహాట్స్టార్ ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద మంచి రన్ ఉండటంతో కాస్త ఆలస్యం చేయాలని మేకర్స్.. హాట్స్టార్ ఓటీటీతో చర్చలు జరిపారని టాక్ ఉంది. అయితే, డీల్ ప్రకారమే మే చివరి వారంలో స్ట్రీమింగ్కు తెస్తామని హాట్స్టార్ చెప్పేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది.
తుడరుమ్ సినిమాలో మోహన్లాల్తో పాటు శోభన, ప్రకాశ్ వర్మ, థామస్ మాథ్యూ, బినూ పప్పూ, అమృత వర్షిని కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి తరుణ్ మూర్తి దర్శకత్వం వహించారు. ఈ సినిమా సుమారు రూ.30కోట్ల బడ్జెట్తో రూపొందింది. ఇప్పటికే రూ.150కోట్లను దాటి భారీ బ్లాక్బస్టర్ కొట్టేసింది. ఈ చిత్రాన్ని రాజపుత్ర విజువల్ మీడియా పతాకంపై రెంజిత్ నిర్మించారు. ఈ మూీకి జేక్స్ బెజోయ్ సంగీతం అందించారు.
మలయాళ మూవీ బ్రొమాన్స్ గతవారంలోనే సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీలో అడుగుపెట్టింది. మాథ్యూ థామస్, అర్జున్ అశోకన్ లీడ్ రోల్స్ చేసిన ఈ సినిమాను డైరెక్టర్ అరుణ్ డీ జోస్ తెరకెక్కించారు.
సంబంధిత కథనం