సింగిల్ సినిమా ట్రైలర్‌పై మంచు విష్ణు గుస్సా? కారణమిదే!-manchu vishnu reportedly unhappy with sri vishnu single movie trailer ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  సింగిల్ సినిమా ట్రైలర్‌పై మంచు విష్ణు గుస్సా? కారణమిదే!

సింగిల్ సినిమా ట్రైలర్‌పై మంచు విష్ణు గుస్సా? కారణమిదే!

సింగిల్ సినిమా ట్రైలర్ ఎంటర్‌టైనింగ్‍గా ఉంటూ ఆకట్టుకుంది. శ్రీవిష్ణు మరోసారి కామెడీ టైమింగ్‍తో అదరగొట్టారు. అయితే, ఈ మూవీ ట్రైలర్‌పై మంచు విష్ణు అసంతృప్తిగా ఉన్నారట. ఆ వివరాలు ఇవే..

సింగిల్ సినిమా ట్రైలర్‌పై మంచు విష్ణు గుస్సా?

టాలీవుడ్ యంగ్ స్టార్ శ్రీవిష్ణు హీరోగా నటించిన సింగిల్ సినిమా రిలీజ్‍కు రెడీ అవుతోంది. మే 9వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. హర హర వీరమల్లు వాయిదా పడడం దాదాపు ఖాయమవడంతో ఆ తేదీకి సింగిల్ చిత్రం వచ్చేస్తోంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి కార్తీక్ రాజు సంగీతం అందించారు. సింగిల్ సినిమా ట్రైలర్ రీసెంట్‍గానే వచ్చింది. ఈ ట్రైలర్ పట్ల సినీ హీరో, మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు సీరియస్‍గా ఉన్నారని ఇండస్ట్రీలో టాక్.

కారణం ఇదే!

సింగల్ చిత్రం ట్రైలర్ పట్ల మంచు విష్ణు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఈ ట్రైలర్లో శ్రీవిష్ణు.. ‘శివయ్యా’ అని గట్టిగా అరుస్తారు. కన్నప్ప సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ టీజర్లో మంచు విష్ణు ‘శివయ్యా’ అని గట్టిగా అన్నారు. దానిపై కాస్త ట్రోలింగ్ కూడా నడిచింది. ఇప్పుడు సింగిల్ ట్రైలర్లో శివయ్యా అని వెటకరించేలా శ్రీవిష్ణు అన్నట్టు ఉంది. అలాగే, ఈ ట్రైలర్ చివర్లో ‘మంచు కురిసిపోతుందని’ అని శ్రీవిష్ణు డైలాగ్ ఉంది. ఈ కారణంగానే సింగిల్ ట్రైలర్ విషయంలో శ్రీవిష్ణు గుస్సాగా ఉన్నారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

సింగిల్ ట్రైలర్లోని ఆ రెండు అంశాలపై మంచు విష్ణు అసంతృప్తిగా ఉన్నారట. ఈ విషయంపై డైరెక్టర్స్ అసోసియేషన్‍లోనూ ఫిర్యాదు చేసే అవకాశం ఉందనే రూమర్లు కూడా ఉన్నాయి. మరి విష్ణు ఈ విషయంపై బహిరంగంగా స్పందిస్తారా.. లేదా అనేది చూడాలి.

సింగిల్ సినిమా గురించి..

సింగిల్ చిత్రం కామెడీ ట్రయాంగిల్ లవ్ స్టోరీతో వస్తోంది. శ్రీవిష్ణు సరసన కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. పంచ్‍లతో ట్రైలర్ ఆకట్టుకుంది. శ్రీవిష్ణు మార్క్ కామెడీ టైమింగ్ అదిరిపోయింది. ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా డైరెక్టర్ కార్తీక్ రాజు తెరకెక్కించినట్టు అర్థమవుతోంది. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్ కూడా ముఖ్యమైన రోల్ చేశారు.

సింగిల్ మూవీని గీతా ఆర్ట్స్, కాల్యా ఫిల్మ్స్ బ్యానర్లపై విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. పాపులర్ ప్రొడ్యూజర్ అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. మే 9న ప్రేక్షకులు ముందుకు ఈ చిత్రం రానుంది.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం