మలయాళం సినిమాలు ఔసిప్పింతే ఒసియాతు, ప్రతి నిరపరాధియానో శుక్రవారం ఓటీటీలోకి వచ్చాయి. ఈ రెండు మలయాళం సినిమాలు మనోరమా మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్నాయి. ఔసిప్పింతే ఒసియాతు మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కగా ప్రతి నిరపరాధియానో క్రైమ్ ఇన్వేస్టిగేషన్ కథతో రూపొందింది.
ఔసిప్పింతే ఒసియాతు మార్చి ఫస్ట్ వీక్లో థియేటర్లలోకి వచ్చింది. కుటుంబ బంధాలకు మిస్టరీ థ్రిల్లర్ అంశాలను జోడించి తెరకెక్కిన ఈ మూవీ పాజిటివ్ టాక్ను సొంతం చేసుకున్నది. ఔసిప్పింతే ఒసియాతు మూవీలో కిష్కింద కాండం ఫేమ్ విజయ రాఘవన్ కీలక పాత్ర పోషించాడు. దిలీప్ పోతన్, కళాభవన్ షాజోన్, లీనా, అంజలి కృష్ణ కీలక పాత్రల్లో కనిపించారు. శరత్ చంద్రన్ ఆర్జే మూవీకి దర్శకత్వం వహించాడు. అనుబంధాలు, ఆప్యాయతలను డబ్బు ఎలా ప్రభావితం చేస్తుందనే కాన్సెప్ట్తో దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించాడు.
ఔసెప్ సమాజంలో పెద్ద మనిషిగా చెలామణి అవుతాడు. అతడి ముగ్గురు కొడుకుల్లో మైఖేల్ పోలీస్ తాహసీల్డార్గా, జార్జ్ పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తోండగా రాయ్ సామాజిక కార్యకర్తగా మారుతాడు. ముగ్గురు కొడుకులకు డబ్బు అవసరమవుతుంది. ఈ ప్రయత్నాల్లో ఉండగానే తండ్రి ఔసెప్ గురించి వారికి ఓ నిజం తెలుస్తుంది? అదేమిటి? ఆ నిజం కారణంగా ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఎలాంటి గొడవలు జరిగాయి? ఔసెప్ గతం ఏమిటి? అన్నదే ఈ మూవీ కథ.
క్రైమ్ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్గా రూపొందిన ప్రతి నిరపరాధియానో థియేటర్లలో రిలీజైన మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఈ మూవీలో ఇంద్రాన్స్, నలంద ప్రదీప్, అభా షాజీత్ కీలక పాత్రలు పోషించారు.ఐఎమ్డీబీలో ఈ మూవీ 8.2 రేటింగ్ను సొంతం చేసుకున్నది.
ఓ అమ్మాయికి యాక్సిడెంట్ అవుతుంది. మర్డర్ అటెంప్ట్గా భావించి పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేస్తారు. కేసు ఇన్వేస్టిగేషన్లో అనుకోని నిజాలు బయటపడతాయి? అవేమిటి? నిజంగానే ఆమెను హత్య చేయాలని చూశారా? అనే అంశాలతో ఈ మూవీ రూపొందింది. ఈ మూవీకి సునీల్ పొట్టమాల్ దర్శకత్వం వహించాడు.