ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ఒకటైన సోనీలివ్ ఈ మధ్యే ప్రేక్షకులకు ఓ బంపర్ ఇచ్చింది. ఏప్రిల్ 25 నుంచి మే 25 వరకు తన ప్లాట్ఫామ్ ఉన్న 8 మలయాళం సినిమాలను ఫ్రీగా చూసే అవకాశం కల్పించింది. అయితే ఈ సినిమాల్లో 2 థ్రిల్లర్ మూవీస్ ఆకట్టుకునే కథ, కథనాలతో ఉన్నాయి. అవేంటో చూడండి.
సోనీలివ్ ఓటీటీలో ఫ్రీగా అవుతున్న మలయాళ థ్రిల్లర్ సినిమాల్లో ఒకటి ఈషో(Eesho). ఈ సినిమా 2022లో రిలీజైంది. ఆ తర్వాత ఓటీటీలోకి అడుగు పెట్టింది. ప్రముఖ నటుడు జయసూర్య నటించిన సినిమా ఇది. అతనితోపాటు జాఫర్ ఇడుక్కి, నమితా ప్రమోద్, జానీ ఆంటోనీ, అక్షర కిశోర్ లాంటి వాళ్లు నటించారు. ఈ సినిమాను సోనీలివ్ ఓటీటీ మే 25 వరకు ఫ్రీగా స్ట్రీమింగ్ చేయనుంది.
ఈషో ఓ డిఫరెంట్ థ్రిల్లర్ సినిమా. ఓ ప్రముఖ పారిశ్రామికవేత్తకు సంబంధించిన కేసులో ఓ ఏటీఎం గార్డు సాక్షి ఉంటాడు. అతన్ని హతమార్చి ఈ కేసు నుంచి బయటపడాలని ఆ వ్యక్తి అనుకుంటాడు. ఈ బాధ్యతను ఓ కిల్లర్ కు అప్పగిస్తాడు. రాత్రి పూట ఏటీఎం దగ్గర గార్డుగా పని చేస్తున్న ఆ వ్యక్తి దగ్గరికి ఈషో అనే ఓ వ్యక్తి వస్తాడు. అతనితో పరిచయం పెంచుకుంటాడు.
అతడు ఎవరు? ఏటీఎం గార్డును ఏం చేయబోతున్నాడు? ఓ కిల్లర్ ఓ కీలకమైన కేసులో సాక్షిని ఎందుకు కాపాడతాడు అన్నది ఈ సినిమాలో చూడొచ్చు. దాదాపు సగం సినిమా ఒక్క రాత్రిలోనే సాగుతుంది. ఆ కిల్లర్, సెక్యూరిటీ గార్డు మధ్య వచ్చే సీన్లు ఉత్కంఠ రేపుతాయి.
సోనీ లివ్ ఓటీటీలోనే ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతున్నమరో మలయాళం డ్రామా థ్రిల్లర్ కానెక్కానే (kaanekkane). సూరజ్ వెంజరమూడు, టొవినో థామస్ లాంటి వాళ్లు నటించారు. ఇది కూడా ఓ డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. తన భార్య మరణం తర్వాత మరొకరిని పెళ్లి చేసుకొని హాయిగా గడుపుతున్న అలెన్ (టొవినో థామస్) ఇంటికి రెండేళ్ల తర్వాత తన మామ పాల్ మతాయ్ (సూరజ్ వెంజరమూడు) తిరిగి వస్తాడు.
రెండు రోజుల తర్వాత అతడు తిరిగి వెళ్తున్న సమయంలో ఆ ఇంట్లో అనుకోకుండా ఓ ఫొటోను చూస్తాడు. అది అతనిలో కొన్ని అనుమానాలను లేవనెత్తుతుంది. తన కూతురి మరణంలో అల్లుడి పాత్ర ఏంటన్నది తెలుసుకునే ప్రయత్నం మొదలుపెడతాడు.
ఇంతకీ ఆ ఇంట్లో అతడు చూసిన ఆ ఫొటోలో ఏముంది? ఈ క్రమంలో అతనికి తెలిసిన నిజాలేంటి? తన తొలి భార్య మరణంలో అలెన్ పాత్ర ఏంటి అన్నది ఈ కానెక్కానే మూవీలో చూడొచ్చు. 2021లో థియేటర్లలో రిలీజైన మూవీ ఇది. ప్రస్తుతం మే 25 వరకు ఈ సినిమా తెలుగులోనూ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది.
సంబంధిత కథనం