Thriller Movies: మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన మూవీ ఎల్2: ఎంపురాన్. ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి వస్తోంది. ఈ నేపథ్యంలో ఆ మూవీ కంటే ముందే ఓటీటీలో అతడు నటించిన థ్రిల్లర్ సినిమాలు కొన్ని ఉన్నాయి. మరి అవేంటో, ఎక్కడ చూడాలో తెలుసుకోండి.
పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన లీగల్ థ్రిల్లర్ మూవీ జన గణ మన. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఓ కాలేజీ ప్రొఫెసర్ హత్య యూనివర్సిటీలో ఆందోళనలకు దారి తీస్తుంది. ఓ పోలీస్ అధికారిపై దీనిపై విచారణ చేపడతాడు. మరోవైపు దీనిపై కోర్టులో ఓ న్యాయవాది న్యాయపోరాటం చేస్తాడు. ఆ న్యాయవాది పాత్రలో పృథ్వీరాజ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన తొలి సినిమా. ఇప్పుడు వచ్చిన ఎల్2: ఎంపురాన్ మూవీ దీనికి సీక్వెల్. ఇదొక పొలిటికల్ థ్రిల్లర్. ఓ రాష్ట్ర సీఎం చనిపోవడంతో ఆ పదవి కోసం రేసు మొదలవుతుంది. ఈ క్రమంలో లూసిఫర్ రంగంలోకి దిగుతాడు. ఈ మూవీలో జాయెద్ మసూద్ పాత్రలో పృథ్వీరాజ్ నటించాడు.
పృథ్వీరాజ్ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన మూవీ ఈ కోల్డ్ కేస్. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఓ మర్డర్ కేసు దర్యాప్తు చుట్టూ తిరుగుతుంది. ఈ కేసును ఓ పోలీస్ ఆఫీసర్, ఓ జర్నలిస్ట్ ఒకేసారి దర్యాప్తు చేస్తూ ఉంటారు. చివరికి ఈ కేసు ఏమవుతుందన్నది ఇంట్రెస్టింగ్ ట్విస్టులతో చూపించిన తీరు ఆకట్టుకుంటుంది.
పృథ్వీరాజ్ ఓ నక్సలైట్ పాత్రలో నటించిన థ్రిల్లర్ మూవీ ఈ తలప్పావు. 2008లో రిలీజైంది. ఇందులో నక్సలైట్ కామ్రేడ్ జోసెఫ్ పాత్రలో అతడు కనిపించాడు. ఓ నక్సలైట్ ను నకిలీ ఎన్కౌంటర్లో చంపిన కానిస్టేబుల్ తర్వాత ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటాడన్నది ఈ మూవీలో చూడొచ్చు.
ఈ అర్జునన్ సాక్షి మూవీ కూడా సన్ నెక్ట్స్ ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో జాయ్ మాథ్యూ అనే పాత్రలో సుకుమారన్ నటించాడు. అతన్ని ఓ హై ప్రొఫైల్ మర్డర్ కేసులో ప్రధాన సాక్షి అయిన అర్జున్ గా కొందరు పొరపాటు పడతారు. అయితే చనిపోయిన ఆ వ్యక్తికి న్యాయం కోసం మాథ్యూయే అర్జున్ గా మారిపోతాడు.
సంబంధిత కథనం