మలయాళం మూవీ పరన్ను పరన్నుపరన్ను చెల్లన్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ మనోరమా మ్యాక్స్ ఓటీటీలో మే 16 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ను మనోరమా మ్యాక్స్ అఫీషియల్గా అనౌన్స్చేసింది. ఈ మలయాళం మూవీలో సాజిన్ చెరుకాయిల్, ఉన్ని లాలు, సమృద్ధి తార కీలక పాత్రల్లో నటించారు. జిష్ణు హరీంద్ర వర్మ దర్శకత్వం వహించాడు.
ఈ ఏడాది జనవరిలో పరన్ను పరన్నుపరన్ను చెల్లన్ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఐఎమ్డీబీలో పదికిగాను 8.3 రేటింగ్ను సొంతం చేసుకున్నది.
ఆ యువ జంట ప్రేమకు కులమతాలు ఎలా అడ్డుగోడలుగా నిలిచాయనే కాన్సెప్ట్తో పరన్ను పరన్ను పరన్ను చెల్లం మూవీని దర్శకుడు తెరకెక్కించాడు. జిజు, సంధ్యప్రేమించుకుంటారు. సంధ్య ఉన్నత కులానికి చెందిన అమ్మాయి కావడంతో ఆమె కుటుంబసభ్యులు వారి ప్రేమకు అడ్డు చెబుతారు. సంధ్య బంధువు సతీష్...జిజును కొట్టి అవమానిస్తాడు.
ఆ అవమానం భరించలేకపోయిన జిజు...ఎలాగైనా సంధ్యను లేవదీసుకుపోయి పెళ్లిచేసుకోవాలని ఫిక్సవుతాడు. సంధ్య కుటుంబంలో ప్రతి ఎటా జరిగే ఓ ఉత్సవాన్ని అడ్డుపెట్టుకొని తన ప్లాన్ను అమలు పరచాలని అనుకుంటాడు. జిజు ప్రయత్నాలు ఫలించాయా? జిజు ప్లాన్ గురించి తెలిసిన సతీష్ ఏం చేశాడు? జిజు, సంధ్యలను అడ్డుకున్నాడా? అన్నదే ఈ మూవీ కథ.
పరన్ను పరన్నుపరన్ను చెల్లన్ స్టోరీ రొటీన్ అయినా విజయరాఘవన్ పాత్రకు సంబంధించి క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్కు మాత్రం ఆడియెన్స్ను ఆకట్టుకుంటుంది. ఓ మలయాళం సూపర్ హిట్ సాంగ్ ఆధారంగా ఈ మూవీకి టైటిల్ను పెట్టారు డైరెక్టర్. ఈ మూవీలో పొరట్టు నడకం అనే కేరళ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ గురించి దర్శకుడు చూపించాడు. ఈ మూవీకి నేషనల్ అవార్డ్ విన్నర్ మధు అంబాట్ సినిమాటోగ్రఫీ సమకూర్చారు.
పరన్ను పరన్నుపరన్ను చెల్లన్ తో పాటు మే 15న బాసిస్ జోసెఫ్ హీరోగా నటించిన మారన మాస్ మూవీ కూడా రాబోతోంది. ఈ యాక్షన్ కామెడీ మూవీ సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.
సంబంధిత కథనం