ఓటీటీలోకి తెలుగులో వస్తున్న మలయాళ మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. థియేటర్లలో రిలీజైన రెండేళ్లకు..-malayalam mystery thriller movie pendulum ott release date etv win to stream the movie in telugu from 22nd may ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలోకి తెలుగులో వస్తున్న మలయాళ మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. థియేటర్లలో రిలీజైన రెండేళ్లకు..

ఓటీటీలోకి తెలుగులో వస్తున్న మలయాళ మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. థియేటర్లలో రిలీజైన రెండేళ్లకు..

Hari Prasad S HT Telugu

ఓటీటీలోకి ఓ మలయాళ మిస్టరీ థ్రిల్లర్ మూవీ రెండేళ్ల తర్వాత తెలుగులో వస్తోంది. అది కూడా మరో రెండు రోజుల్లోనే కావడం విశేషం. 2023లో థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఓటీటీలోకి తెలుగులో వస్తున్న మలయాళ మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. థియేటర్లలో రిలీజైన రెండేళ్లకు..

మలయాళ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఓ గుడ్ న్యూస్. అలాంటిదో ఓ మూవీ ఇప్పుడు తెలుగులో వస్తోంది. ఈ సినిమా పేరు పెండులమ్ (Pendulum). ఎప్పుడో రెండేళ్ల కిందట అంటే జూన్, 2023లో థియేటర్లలో రిలీజైంది. ఆ సినిమాను ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీ తెలుగులో స్ట్రీమింగ్ చేయబోతోంది. ఆ వివరాలేంటో చూడండి.

పెండులమ్ ఓటీటీ రిలీజ్ డేట్

మలయాళ మిస్టరీ థ్రిల్లర్ సినిమా పెండులమ్ ఇప్పుడు తెలుగులో రాబోతోంది. ఈ సినిమాను మే 22 నుంచి అంటే ఈ గురువారం నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈటీవీ విన్ వెల్లడించింది. మంగళవారం (మే 20) తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఆ ఓటీటీ ఈ విషయం తెలిపింది.

“మీ కలలు మీకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది? అసలు నిజమేదో, భ్రమేదో తెలుసుకోలేని ఓ గ్రిప్పింగ్ మిస్టరీ థ్రిల్లర్ ను చూడటానికి సిద్ధంగా ఉండండి. పెండులమ్ తెలుగులో మే 22 నుంచి ప్రీమియర్ కానుంది. కేవలం ఈటీవీ విన్ లో” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.

పెండులమ్ మూవీ గురించి..

పెండులమ్ 2023లో వచ్చిన ఓ మలయాళ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. రెజిన్ బాబు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో.. విజయ్ బాబు, అనుమోల్, ప్రకాశ్ బారేలాంటి వాళ్లు నటించారు. జూన్ 16, 2023లో రిలీజైంది. డాక్టర్ మహేష్ నారాయణన్ అనే వ్యక్తి చుట్టూ తిరిగే మూవీ ఇది. తన జీవితంలో జరిగిన ఓ అసాధారణ ఘటన గురించి అతడు తెలుసుకోవాలని అనుకుంటాడు.

దీనికోసం ఓ స్పష్టమైన కల కనడం ద్వారా తన గతం గురించి తెలుస్తుందని భావిస్తాడు. కేవలం గంటా 46 నిమిషాల వ్యవధితో ఉన్న ఈ సినిమాకు ఐఎండీబీలో 6.5 రేటింగ్ ఉంది. ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో వచ్చిన ఈ మూవీకి తెలుగులో మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు. మలయాళ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులు మే 22 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం