Malayalam Movie: ఓటీటీలోకి ఏడాది తర్వాత తెలుగులో వస్తున్న మలయాళం మూవీ.. ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్-malayalam movie pranayam 1947 to stream in telugu on aha video ott from 23rd april ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Malayalam Movie: ఓటీటీలోకి ఏడాది తర్వాత తెలుగులో వస్తున్న మలయాళం మూవీ.. ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్

Malayalam Movie: ఓటీటీలోకి ఏడాది తర్వాత తెలుగులో వస్తున్న మలయాళం మూవీ.. ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్

Hari Prasad S HT Telugu

Malayalam Movie: ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్ ఉన్న ఓ మలయాళం మూవీ తెలుగులో స్ట్రీమింగ్ కు వస్తోంది. గతేడాది మార్చిలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. ఇప్పుడు తెలుగులో వస్తుండటం విశేషం. ఇప్పటికే ఈ సినిమా ప్రైమ్ వీడియోలో మలయాళంలో ఉంది.

ఓటీటీలోకి ఏడాది తర్వాత తెలుగులో వస్తున్న మలయాళం మూవీ.. ఐఎండీబీలో సూపర్ రేటింగ్

Malayalam Movie: మనసుకు హత్తుకునే ఓ మలయాళం మూవీ ఇప్పుడు తెలుగులోకి రాబోతోంది. తమ పిల్లలు తమను కాదనుకోవడంతో వృద్ధాశ్రమంలోని ఓ వృద్ధ జంట ఆ వయసులో ఒకరి కోసం మరొకరు కలిసి ఉండాలని తీసుకునే నిర్ణయం వాళ్ల జీవితాలను ఎలా మార్చేస్తుందనే కథ ఆధారంగా రూపొందిన మూవీ ఇది. ఈ సినిమా పేరు ప్రణయం 1947. ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్ ఈ మూవీ సొంతం.

ప్రణయం 1947 ఓటీటీ రిలీజ్ డేట్

మలయాళంలో గతేడాది మార్చిలో జననం: 1947 ప్రణయం తుదరున్ను పేరుతో ఓ మూవీ రిలీజైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కేరళలోని వృద్ధులు వయసు మీద పడిన సమయంలో ఎదుర్కొనే సవాళ్లు, కష్టాలను ఇద్దరు వృద్ధుల జీవితాల ఆధారంగా ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు.

ఇప్పుడీ సినిమాను ప్రణయం 1947 పేరుతో ఆహా వీడియో ఓటీటీ తెలుగులోకి తీసుకొస్తోంది. ఈ సినిమా బుధవారం (ఏప్రిల్ 23) నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా వెల్లడించింది. నిజానికి ఈ మూవీ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో మలయాళంలో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఆహా వీడియో ఓటీటీ ద్వారా తెలుగులోకి వస్తోంది.

ప్రణయం 1947 మూవీ గురించి..

మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో డ్రామా జననం: 1947 ప్రణయం తుదరున్ను. గతేడాది మార్చి 20న ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. ప్రేక్షకుల ఆదరణ సంపాదించిన ఈ మూవీ.. ఐఎండీబీలో ఏకంగా 8.1 రేటింగ్ సొంతం చేసుకుంది. ఈ సినిమా గౌరి అనే ఓ ఒంటరి వృద్ధ మహిళ చుట్టూ తిరుగుతుంది. ఆమె ఓ ఓల్డేజ్ హోమ్ లో కాలం గడుపుతుంటుంది.

ఆ సమయంలో తన కేర్ టేకర్ గా ఉన్న శివన్ తో కలిసి జీవించాలని నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత వాళ్లిద్దరి జీవితాలు ప్రేమతో నిండిపోతాయి. ఈ వృద్ధులు తమ శేష జీవితాన్ని ఎలా గడిపారన్నదే ఈ మూవీ స్టోరీ. బుధవారం (ఏప్రిల్ 23) నుంచి ఆహా వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ ప్రణయం 1947 సినిమాను తెలుగులో చూసి ఎంజాయ్ చేయండి.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం