ఒకే రోజు ఒకే ఓటీటీలోకి వ‌చ్చిన రెండు మ‌ల‌యాళం సినిమాలు - ఒక‌టి క్రైమ్ థ్రిల్ల‌ర్ - మ‌రోటి మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ-malayalam crime thriller movies kummattikali and kallam streaming now on manorama max ott in same day mollywood ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఒకే రోజు ఒకే ఓటీటీలోకి వ‌చ్చిన రెండు మ‌ల‌యాళం సినిమాలు - ఒక‌టి క్రైమ్ థ్రిల్ల‌ర్ - మ‌రోటి మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ

ఒకే రోజు ఒకే ఓటీటీలోకి వ‌చ్చిన రెండు మ‌ల‌యాళం సినిమాలు - ఒక‌టి క్రైమ్ థ్రిల్ల‌ర్ - మ‌రోటి మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ

Nelki Naresh HT Telugu

మ‌ల‌యాళం సినిమాలు కుమ్మ‌ట్టిక‌లి, క‌ల్లం ఒకే రోజు, ఒకే ఓటీటీలో రిలీజ‌య్యాయి. ఈ రెండు సినిమాలు శుక్ర‌వారం మ‌నోర‌మా మ్యాక్స్ ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. కుమ్మ‌ట్టిక‌లి మూవీతో మ‌ల‌యాళ సీనియ‌ర్ హీరో సురేష్ గోపి త‌న‌యుడు మాధ‌వ్ సురేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు

మ‌ల‌యాళం ఓటీటీ

మ‌ల‌యాళం సినిమాలు కుమ్మ‌ట్టిక‌లి, క‌ల్లం ఒకే రోజు ఓటీటీలోకి వ‌చ్చాయి. శుక్ర‌వారం రోజు ఈ రెండు సినిమాలు మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీలో రిలీజ‌య్యాయి. కుమ్మ‌ట్టిక‌లి, క‌ల్లం సినిమాలు థియేట‌ర్ల‌లో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌డం గ‌మ‌నార్హం.

కుమ్మ‌ట్టిక‌లి

మ‌ల‌యాళం సీనియ‌ర్ హీరో సురేష్ గోపి త‌న‌యుడు మాధ‌వ్ సురేష్ కుమ్మ‌ట్టిక‌లి మూవీతో హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. యాక్ష‌న్ క్రైమ్ కామెడీ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీ ఆర్‌కే విన్సెట్ సెల్వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. టాలీవుడ్ సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ ఆర్‌బీ చౌద‌రి కుమ్మ‌ట్టిక‌లి మూవీని నిర్మించాడు. ఈ సినిమాలో మాధ‌వ్ సురేష్‌తో పాటు మిథున్ ప్ర‌కాష్‌, రాసిక్ అజ్మ‌ల్‌, లీనా కుమార్‌, మైమ్ గోపి కీల‌క పాత్ర‌లు పోషించారు.

రా అండ్ ర‌స్టిక్ రోల్‌...

తొలి సినిమాతోనే హీరోగా క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు మాధ‌వ్ సురేష్‌. రా అండ్ ర‌స్టిక్‌గా సాగే క్యారెక్ట‌ర్‌లో క‌నిపించాడు. స‌ముద్ర‌తీరం ప్రాంత‌లోని ఓ ప‌ల్లెటూళ్లో కుమ్మ‌ట్టిక‌లి అనే జాత‌ర జ‌రుగుతుంది. ఈ ఊరిలోని కుమ్మ‌టి బాయ్స్ గ్రూప్‌కు డెన్నిస్ లీడ‌ర్‌గా ఉంటాడు.

త‌న స్నేహితులు లుకా భైర‌వ‌న్‌, అమీర్‌తో క‌లిసి జులాయిగా తిరుగుతుంటాడు. జాత‌ర‌లో అనుకోకుండా న‌లుగురు స్నేహితులు పెద్ద క్రైమ్‌లో చిక్కుకుంటారు? ఆ క్రైమ్ నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డారు? ఆ జాత‌ర వారి జీవితాల‌ను ఎలాంటి మ‌లుపులు తిప్పింది అన్న‌దే ఈ మూవీ క‌థ‌. ఈ మూవీలో మాధ‌వ్‌కు జోడీగా యామీ సోనా హీరోయిన్‌గా న‌టించింది.

క‌ల్లం...

మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన క‌ల్లం మ‌నోర‌మా మ్యాక్స్ ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. క‌ల్లం మూవీలో జియో బేబీ, కైలాష్‌, షాహీన్ సిద్ధిఖీ, నంద‌న‌రాజ‌న్‌, ఆదిల్ ఇబ్ర‌హీం కీల‌క పాత్ర‌లు పోషించారు. అనురామ్‌ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 8.6 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది.

మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌…

శ్రీకుట్టి ప్ల‌స్ వ‌న్ స్టూడెంట్‌. అనుమానాస్ప‌ద స్థితిలో త‌న ఇంట్లోనే హ‌త్య‌కు గుర‌వుతుంది. శ్రీకుట్టిని హ‌త్య‌చేశాడ‌నే ఆరోప‌ణ‌లో ఆమె బాయ్ ఫ్రెండ్ నియాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. శ్రీకుట్టిని నిజంగానే నియాజ్ హ‌త్య చేశాడా?

ఈ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీని డెటెక్టివ్స్ ఆనంద్‌, ష‌మీమ్ ఎలా ఛేదించారు అన్న‌దే ఈ మూవీ క థ‌. క్రైమ్ ఎలిమెంట్స్‌తో పాటు స్త్రీ స్వేచ్ఛ‌కు సంబంధించి ఓ మెసేజ్‌ను క‌ల్లం మూవీ ద్వారా అందించారు ద‌ర్శ‌కుడు. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌ల‌తో ఈ మూవీ ఆడియెన్స్‌ను మెప్పించింది.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం