మలయాళం బోల్డ్ థ్రిల్లర్ మూవీ చతురం తెలుగులోకి వచ్చింది. సైనా ప్లే ఓటీటీలో అదే పేరుతో తెలుగులో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ థ్రిల్లర్ మూవీలో స్వాసిక, రోషన్ మాథ్యూ, అలెన్సియన్ లే లోఫెజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి సిద్ధార్థ్ భరతన్ దర్శకత్వం వహించారు. మలయాళంలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ తెలుగులో మాత్రం డైరెక్ట్గా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
చతురం మూవీ మలయాళంలో కమర్షియల్గా నిర్మాతలకు మోస్తారు లాభాలను తెచ్చిపెట్టింది.ఐఎమ్డీబీలో ఈ మూవీ 6.2 రేటింగ్ను సొంతం చేసుకున్నది. వాస్తవ ఘటనల స్ఫూర్తితో దర్శకుడు సిద్ధార్థ్ ఈ మూవీని తెరకెక్కించాడు.
శారీరకంగా లైంగికంగా వేధింపులకు గురిచేసే భర్తపై ఓ గృహిణి ఎలా రివేంజ్ తీర్చుకుంది అన్నది లవ్, లస్ట్, రివేంజ్ అంశాలతో ఈ మూవీలో చూపించాడు డైరెక్టర్. స్టోరీ కంటే హీరోయిన్ను గ్లామరస్గా చూపించడంపైనే దర్శకుడు ఎక్కువగా ఫోకస్ పెట్టాడనే విమర్శలు వినిపించాయి.
ఎల్దో సొసైటీలో పేరున్న ఓ ధనవంతుడు. భార్య దూరం కావడంతో సెలెనా అనే మరో అమ్మాయిని ఎల్దో పెళ్లిచేసుకుంటాడు. అందరి ముందు మంచివాడుగా నటించే ఎల్దోలో మరో కోణం ఉందనే విషయం పెళ్లైనా తర్వాతే సెలెనాకు అర్థమవుతుంది. చిన్నచిన్న కారణాలకే సెలెనాను దారుణంగా హింసిస్తుంటాడు.
ఎల్దోకు యాక్సిడెంట్ అవుతుంది. ఎల్దో బాగోగులు చూసుకోవడానికి కేర్ టేకర్గా బాల్తజార్ అనే యువకుడు నియమితుడవుతాడు.బాల్తజార్ను అడ్డుపెట్టుకొని ఎల్దోపై సెలెనా ఎలా రివేంజ్ తీర్చుకుంది? సెలెనా, బాల్తజార్ మధ్య ఏర్పడిన బంధం ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? అన్నదే ఈ మూవీ కథ.
చతురం మూవీలో హీరోయిన్గా నటించిన స్వాసిక విజయ్ మలయాళంతో పాటు తమిళం, తెలుగులోనూ సినిమాలు చేసింది. ఎటు చూసిన నువ్వే అనే మూవీతో కథానాయికగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.
ప్రస్తుతం మలయాళంలో టాప్ సీరియల్ యాక్టర్స్లో ఒకరిగా కొనసాగుతోంది. సీతా, ప్రణయిని, మాలికాపురం సీరియల్స్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. మిసెస్ హిట్లర్, సీతాపెన్నుతో పాటు మరికొన్ని సీరియల్స్లో గెస్ట్ రోల్స్ చేసింది.
గత ఏడాది తమిళంలో రిలీజైన లబ్బరుపందు మూవీలో యశోదిని పాత్రలో కనిపించింది. ఈ మూవీ ఆమెకు తమిళంలో మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇటీవల రిలీజైన సూర్య రెట్రోలో ఓ కీలక పాత్రలో కనిపించింది. ప్రస్తుతం సూర్య, ఆర్జే బాలాజీ మూవీలో నటిస్తోంది.
సంబంధిత కథనం