బ్లాక్‌బస్టర్ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ కూడా వస్తోంది.. ఫస్ట్ పార్ట్ చూశారా లేదా.. క్లైమ్యాక్స్ మైండ్ బ్లోయింగ్-malayalam action thriller movie pani to get sequel confirms director actor joju george ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  బ్లాక్‌బస్టర్ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ కూడా వస్తోంది.. ఫస్ట్ పార్ట్ చూశారా లేదా.. క్లైమ్యాక్స్ మైండ్ బ్లోయింగ్

బ్లాక్‌బస్టర్ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ కూడా వస్తోంది.. ఫస్ట్ పార్ట్ చూశారా లేదా.. క్లైమ్యాక్స్ మైండ్ బ్లోయింగ్

Hari Prasad S HT Telugu

ఓ బ్లాక్‌బస్టర్ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ కూడా రాబోతోంది. ఈ విషయాన్ని ఈ సినిమాలో హీరోగా నటించి, డైరెక్ట్ చేసిన జోజు జార్జ్ కన్ఫమ్ చేశాడు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయట.

బ్లాక్‌బస్టర్ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ కూడా వస్తోంది.. ఫస్ట్ పార్ట్ చూశారా లేదా.. క్లైమ్యాక్స్ మైండ్ బ్లోయింగ్

మలయాళం ఇండస్ట్రీ నుంచి గతేడాది అక్టోబర్ లో వచ్చిన సంచలన విజయం సాధించిన మూవీ పని (Pani). ప్రముఖ నటుడు జోజు జార్జ్ తొలిసారి డైరెక్ట్ చేసిన సినిమా ఇది. కాస్త వయోలెన్స్ ఎక్కువైనా.. ఈ మూవీకి పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. ముఖ్యంగా ఊహకందని క్లైమ్యాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రానున్నట్లు జోజు జార్జ్ కన్ఫమ్ చేశాడు.

పని మూవీ సీక్వెల్

జోజు జార్జ్ ఇప్పటికే ఎన్నో మలయాళం సినిమాల్లో నటుడిగా తనను తాను నిరూపించుకున్నాడు. అయితే పని మూవీతో తొలిసారి డైరెక్టర్ గానూ సత్తా చాటాడు. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ చేస్తున్నట్లు అతడు వెల్లడించాడు. అంతేకాదు మొత్తంగా మూడు భాగాలు రానున్నట్లు కూడా చెప్పడం విశేషం.

పని 2 మూవీని కన్ఫమ్ చేయడమే కాదు.. ఇది తొలి భాగం కంటే మరింత తీవ్రంగా ఉండబోతున్నట్లు కూడా చెప్పాడు. అయితే తొలి పార్ట్ తో ఎలాంటి డైరెక్ట్ లింక్స్ ఉండవని కూడా తెలిపాడు. ఇప్పటికే స్క్రిప్ట్ పని పూర్తయ్యిందట. షూటింగ్ కోసం సిద్ధమవుతున్నారు.

ఈ పని 2 కోసం పూర్తిగా కొత్త లొకేషన్లు, కొత్త నటీనటులు రాబోతున్నారు. దేశంలోని ప్రముఖ సాంకేతిక సిబ్బంది ఈ సినిమా కోసం పని చేయబోతున్నట్లు కూడా తెలిపాడు. ఈ ఏడాది డిసెంబర్ లో పని 2 షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఆ తర్వాత పని 3 కూడా రానుంది.

పని మూవీ చూశారా?

పని గతేడాది అక్టోబర్ 24న థియేటర్లలో రిలీజైంది. ఇందులో జోజు జార్జ్ తోపాటు అభినయ, సాగర్ సూర్య, జునైజ్ వీపీ, సీమా, ప్రశాంత్ అలెగ్జాండర్, సుజిత్ శంకర్ లాంటి వాళ్లు నటించారు. ఈ మూవీ ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది కేరళలోని త్రిసూర్ లో జరిగే స్టోరీ.

ఆ నగరాన్ని శాసించే ఓ గ్యాంగ్‌స్టర్, అతని సహచరుల కుటుంబాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. వాళ్ల జీవితాల్లోకి అనుకోకుండా ఓ రోజు ఇద్దరు యువకులు వస్తారు. ఎలాంటి భయం, బెదురు లేని వాళ్లు అప్పటికే ఓ ఏటీఎంలోనే హత్య చేసి ఉంటారు. అలాంటి యువకుల నుంచి ఆ కుటుంబానికి ఎదురైన సవాలేంటి?

త్రిసూర్ నే ఏలే అలాంటి కుటుంబంతో వాళ్లు ఎలా ఆడుకుంటారన్నది ఈ పని మూవీలో చూడొచ్చు. అయితే ఇందులో ఊహకందని క్లైమ్యాక్స్ మరో లెవెల్ అని చెప్పొచ్చు. కాస్త వయోలెన్స్ ఎక్కువే. ఇప్పుడు పని 2 మరింత తీవ్రంగా రాబోతున్నట్లు జోజు జార్జ్ చెప్పడం చూస్తే.. అందులో ఇంకా ఏం చూపిస్తారో అన్న ఆసక్తి నెలకొంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం