మహేశ్ బాబు నెల రోజులు.. రామ్‍చరణ్ మూడు వారాలు-mahesh babu to take one month break from ssmb29 shooting and ram charan set to go vacation tollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  మహేశ్ బాబు నెల రోజులు.. రామ్‍చరణ్ మూడు వారాలు

మహేశ్ బాబు నెల రోజులు.. రామ్‍చరణ్ మూడు వారాలు

సమ్మర్ బ్రేక్ తీసుకోనున్నారు టాలీవుడ్ స్టార్ హీరోలు మహేశ్ బాబు, రామ్‍చరణ్. ఎస్ఎస్ఎంబీ29 షూటింగ్ అప్‍డేట్ కూడా ఒకటి బయటికి వచ్చింది. చరణ్ వెకేషన్ ప్లాన్ గురించి కూడా తెలిసింది.

మహేశ్ బాబు నెల రోజులు.. రామ్‍చరణ్ మూడు వారాలు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో సినిమా చేస్తున్నారు. గ్లోబల్ రేంజ్‍లో భారీ బడ్జెట్‍తో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజులుగా జోరుగా సాగుతోంది. అయితే, సమ్మర్ వచ్చేయడంతో బ్రేక్ తీసుకునేందుకు మహేశ్ డిసైడ్ అయ్యారు. పెద్ది షూటింగ్ నుంచి మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ కూడా విరామం తీసుకున్నారట. ఆ వివరాలు ఇవే..

మహేశ్ నెల రోజుల బ్రేక్.. పాట షూటింగ్

ఎస్ఎస్ఎంబీ29 షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‍లోనే సాగుతోంది. మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా మధ్య పాటను రాజమౌళి చిత్రీకరిస్తున్నారని షూటింగ్ అప్‍డేట్ బయటికి వచ్చింది. అయితే, ఈ షెడ్యూల్ నేటితోనే ఫినిష్ కానుందని సమాచారం. దీంతో నెలరోజుల పాటు బ్రేక్ తీసుకోనున్నారట మహేశ్ బాబు.

నెల రోజుల సమ్మర్ బ్రేక్‍లో ఫ్యామిలీతో కలిసి మహేశ్ వెకేషన్‍కు వెళ్లే ఛాన్స్ ఉంది. విరామం తర్వాత మళ్లీ షూటింగ్‍లో పాల్గొంటారు. ఈ చిత్రంలో మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ కూడా ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి ఇటీవలే ఓ క్రేజీ రూమర్ వచ్చింది. డ్రాగన్ల బ్యాక్‍డ్రాప్‍లో ఓ ఫైట్ సీన్‍ను డైరక్టర్ రాజమౌళి ప్లాన్ చేస్తున్నారనే ఊహాగానాలు వినిపించాయి.

సుమారు రూ.1000కోట్ల భారీ బడ్జెట్‍తో ఎస్ఎస్ఎంబీ29 చిత్రం రూపొందనుందనే అంచనాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ రేంజ్‍లో రాజమౌళి పాపులర్ అయ్యారు. దీంతో ఇంటర్నేషనల్ టార్గెట్‍గా ఈ అడ్వెంచర్ యాక్షన్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి మైథలాజికల్ టచ్ కూడా ఉంటుందనే రూమర్ ఉంది. ఇటీవలే హిట్ 3 ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు హాజరైన రాజమౌళిని ఎస్ఎస్ఎంబీ29 అప్‍డేట్ కోసం సుమ అడిగితే.. ఆయన ఏమీ చెప్పలేదు.

లండన్ వెళ్లనున్న చరణ్

పెద్ది సినిమా షూటింగ్‍లో కొన్ని వారాలుగా ఫుల్ బిజీగా ఉన్నారు రామ్‍చరణ్. ఈ చిత్రానికి ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే వచ్చిన పెద్ది గ్లింప్స్ మోతమోగించింది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‍లో కొన్ని రోజులుగా సాగుతోంది. అయితే, షూటింగ్ నుంచి చరణ్ ప్రస్తుతం బ్రేక్ తీసుకున్నారని తెలుస్తోంది.

పెద్ది షూటింగ్ నుంచి రామ్‍చరణ్ మూడు వారాల విరామం తీసుకోనున్నారు. ఫ్యామిలీతో కలిసి లండన్ వెకేషన్‍కు వెళ్లనున్నారు. లండన్‍లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్‍చరణ్ మైనపు విగ్రహ ఆవిష్కరణ మే 9న జరగనుంది. ఈ కార్యక్రమానికి చరణ్ హాజరుకానున్నారు. అలాగే, లండన్‍లోనే వెకేషన్ ఎంజాయ్ చేయనున్నారు.

పెద్ది చిత్రంలో రామ్‍చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, దివ్యేందు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమా బ్యానర్లు ప్రొడ్యూజ్ చేస్తున్నాయి. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది 2026 మార్చి 27న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమా రామ్‍చరణ్ రస్టిక్ మాస్ లుక్‍లో ఉన్నారు. ఈ మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్ అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంది. చిత్రంపై హైప్‍ను మరింత పెంచేసింది.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం