పు వివాదాలు వెంటాడినా.. కలెక్షన్స్ లో మాత్రం అదరగొట్టిన మలయాళం మూవీ ‘ఎల్2 ఎంపురాన్’ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రికార్డులు బ్రేక్ చేసింది. మలయాళం మూవీ ఇండస్ట్రీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఓటీటీలోనూ దూకుడు చూపిస్తోంది.
జియోహాట్స్టార్ ఓటీటీలో ఎల్2 ఎంపురాన్ ఈ నెల 24న స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇప్పుడా ఫిల్మ్ ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. ఓటీటీలోనూ ఈ యాక్షన్ థ్రిల్లర్ కు ఫ్యాన్స్ నుంచి రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. ఈ మూవీలో అన్నదమ్ములుగా సూపర్ స్టార్ మోహన్ లాల్, టొవినో థామస్ యాక్టింగ్ వేరే లెవల్ లో ఉంది.
2019లో సూపర్ హిట్గా నిలిచిన లూసిఫర్ మూవీకి ఎల్2 ఎంపురాన్ సీక్వెల్గా తెరకెక్కింది. ఈ సినిమాకు మరో హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా ఎల్2 ఎంపురాన్ మూవీ తెరకెక్కింది. డ్రగ్స్, ఇంటర్నేషనల్ మాఫియా, ఫ్యామిలీ ఎమోషన్స్, రాజకీయాలు వంటి ఇతర అంశాల చుట్టూ ఈ సినిమాను చిత్రీకరించారు.
ఎంపురాన్ అంటే దేవుడికి తక్కువ.. చక్రవర్తికి ఎక్కువ అనే మీనింగ్ వస్తుంది. మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా మలయాళం, తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో ఎల్2 ఎంపురాన్ థియేటర్లలో విడుదల అయింది.
థియేటర్లలో అదరగొట్టిన ఎల్2 ఎంపురాన్ కలెక్షన్లలో కొత్త రికార్డు నమోదు చేసింది. అత్యధిక వసూళ్లు రాబట్టిన మలయాళం మూవీగా ఈ మూవీ నిలిచింది. దాదాపు రూ.180 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.262.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
ఇండియాలో రూ. 121.7 కోట్లు, ఓవర్సీస్ మార్కెట్లో రూ. 142 కోట్ల గ్సాస్ కలెక్ట్ చేసింది. దీంతో మలయాళంలోనే అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా ఎల్2 ఎంపురాన్ రికార్డ్ కొట్టింది. మోహన్ లాల్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఎల్2 ఎంపురాన్ ఓటీటీ రిలీజ్ అయింది. జియో హాట్స్టార్లో తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ వంటి నాలుగు భాషల్లో ఎల్2 ఎంపురాన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఎల్2 ఎంపురాన్ కథ విషయానికొస్తే.. ఐయూఎఫ్ పార్టీలో సమస్యలన్ని చక్కదిద్దిన స్టీఫెన్ నెడుంపల్లి (మోహన్ లాల్) అజ్ఞాతంలోకి వెళ్తాడు.
పార్టీ పగ్గాలు, అధికారం చేతికొచ్చిన తర్వాత జతిన్ రామ్దాస్ (టొవినో థామస్) భారీగా అవినీతి చేస్తాడు. తన సోదరుడు చేస్తున్న అవినీతిని ఎదిరించడానికి స్టీఫెన్ రంగంలోకి దిగుతాడు. దాంతో అన్నదమ్ముల మధ్య పొలిటికల్ వార్ మొదలు అవుతుంది. అది ఇంటర్నేషనల్ స్థాయిలోకి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూసేయండి.
సంబంధిత కథనం