యంగ్ ట్యాలెంటెడ్ సుధీస్, అంకిత హీరో హీరోయిన్స్గా నటించిన లేటెస్ట్ మూవీ పేషన్. తెలుగు ఇంటెన్స్ ఎమోషనల్ లవ్ స్టొరీగా తెరకెక్కిన 'పేషన్' సినిమాకు అరవింద్ జాషువా దర్శకత్వం వహించారు. రెడంట్ క్రియేషన్ బ్యానర్పై నరసింహా యేలే, ఉమేష్ చిక్కు, రాజీవ్ సింగ్ నిర్మించారు.
పేషన్ మూవీ ఫస్ట్ లుక్ని క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా పేషన్ ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఫస్ట్ లుక్ లాంచ్ ప్రెస్ మీట్లో డైరెక్టర్ శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. "అరవింద్ జాషువా ఆనంద్ సినిమా నుంచి నాకు పరిచయం. అప్పటిలోనే తనలో స్టోరీ టెల్లింగ్ రైటింగ్ క్రియేటర్ ఉన్నాడని అనిపించింది. తను పేషన్ అని ఒక నవల రాశారు. అది నేను చదివాను. చాలా బాగుంది" అని అన్నారు.
"తను (అరవంద్ జాషవా) వచ్చిన ఫ్యాషన్ బ్యాక్ గ్రౌండ్ గురించి ఇందులో రాశారు. అందుకే చాలా అథెంటిక్గా ఉంది. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్. ఈ సినిమా చాలా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని శేఖర్ కమ్ముల కోరారు.
"అరవింద్కు మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది. స్క్రిప్ట్ చాలా బాగుంది. నిర్మాతలు అందరూ కొత్తవాళ్లు. వీళ్లంతా చాలా ప్యాషన్ తో సినిమా తీస్తున్నారు. వాళ్లందరికీ కంగ్రాచ్యులేషన్స్. ఈ పోస్టర్ డిజైన్ చాలా బాగుంది. టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్" అని శేఖర్ కమ్ముల చెప్పారు.
"కొత్త ఫ్లేవర్తో వచ్చిన సినిమాలుని ఆడియన్స్ ఆదరిస్తారు. ఈ పేషన్ సినిమాని కూడా అంత అద్భుతంగా ఆదరిస్తారని నమ్ముతున్నాను. టీమ్ అందరికీ కంగ్రాచ్యులేషన్స్" అని దర్శకుడు శేఖర్ కమ్ముల తన స్పీచ్ ముగించారు.
ఇకపోతే హ్యాపీడేస్, ఆనంద్, గోదావరి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఫిదా వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన శేఖర్ కమ్ముల ప్రస్తుతం కుబేర సినిమాతో బిజీగా ఉన్నారు. కుబేరలో నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా వంటి స్టార్ యాక్టర్స్ నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, పేషన్ మూవీలో హీరో హీరోయిన్స్ సుధీస్, అంకితతోపాటు ప్రకాష్ రాజ్, హిమజ అశ్విన్ ముశర్న్, బెనర్జీ, చందన, అర్చన, ఉదయ్ మహేష్, సూర్య, కన్నడ కిషోర్, యుక్త, అర్జున్, శ్రేయషి, పరిణిత, అన్షుల, అర్జున్, అంకిత్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
సంబంధిత కథనం