Kriti Clarity on Dating Rumours: ప్రభాస్తో ప్రేమ, పెళ్లిపై కృతి క్లారిటీ.. ఏం చెప్పిందంటే?
Kriti Clarity on Dating Rumours: టాలీవుడ్ స్టార్ ప్రభాస్తో ప్రేమలో ఉందని వస్తున్న వార్తలపై కృతి సనన్ స్పందించింది. ఈ వార్తలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేసింది. తన ఇన్స్టా వేదికగా స్టోరీని పోస్ట్ చేసింది.
Kriti Clarity on Dating Rumours: పాన్ఇండియా స్టార్ ప్రభాస్తో కృతిసనన్ డేటింగ్లో ఉందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసందే. ఈ విషయాన్ని ఇటీవలే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కూడా కన్ఫార్మ్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఓ రియాల్టీ షోలో పాల్గొన్న వరుణ్.. కృతి ఒకరి మనస్సులో ఉందంటూ పరోక్షంగా ప్రభాస్ గురించి ప్రస్తావించాడు. దీంతో ఆమె ప్రభాస్ను ప్రేమిస్తుందని, త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కథనాలు విస్తృతంగా వచ్చాయి. తాజాగా వీటన్నింటికీ చెక్ పెట్టేసింది హీరోయిన్ కృతిసనన్. ఇవన్నీ వట్టి పుకార్లని తేల్చిచెప్పింది.
తన ఇన్స్టాగ్రామ్ వేదికగా స్టోరీని పోస్ట్ చేసింది కృతిసనన్. "ఇది ప్రేమ(ప్యార్) కాదు.. పీఆర్ కాదు. మా భేడియా టీమ్ రియాల్టీ షోలో కొంచెం ఎక్కువగానే మాట్లాడింది. అతడి(వరుణ్ ధావన్) పరిహాసం, సరదా దారుణమైన పుకార్లకు దారి తీసింది. కొన్ని పోర్టల్లు నా పెళ్లి తేదీని ప్రకటించే ముందు నన్ను చెప్పనివ్వండి. ఈ రూమర్లన్నీ పూర్తిగా నిరాధారమైనవి." అంటూ ఫేక్ న్యూస్ స్టిక్కర్ను కృతిసనన్ జోడించింది. కృతిసనన్ క్లారిటీ ఇవ్వడంతో ప్రభాస్తో ప్రేమ, పెళ్లి ఊహాగానాలకు చెక్ పెట్టేసినట్లయింది.
వరుణ్-కృతి ఇద్దరూ కలిసి భేడియా(తెలుగులో తోడేలు) అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ప్రముఖ హిందీ డ్యాన్స్ షోకు వీరు హాజరయ్యారు. ఆ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న కరణ్ జోహార్.. వరుణ్ను బాలీవుడ్లో సింగిల్గా ఉన్న హీరోయిన్ల గురించి అడిగారు. ఇందుకు వరుణ్ కృతి సనన్ పేరును చెప్పకుండా కొంతమంది పేర్లను సూచించాడు. దీనికి కరణ్ కృతి పేరును ఎందుకు చెప్పలేదు అని అడుగ్గా.. "ఎందుకంటే కృతి ఇప్పటికే ఒకరి హృదయంలో ఉంది. అతడు ముంబయిలో లేడు. ప్రస్తుతం అతడు దీపికాతో కలిసి ఓ సినిమా షూటింగ్లో ఉన్నాడు" అంటూ పరోక్షంగా ప్రభాస్ గురించి తెలియజేశాడు.
వరుణ్ వీడియో సోషల్ మీడియాలో విసృతంగా వైరల్ కావడంతో ప్రభాస్-కృతి ఇద్దరూ నిజంగానే త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. నెటిజన్లు కూడా ఈ వీడియోపై విశేషంగా తమ స్పందనలను తెలియజేశారు.
ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్టు కే సినిమాలో దీపికాతో పదుకునేతో కలిసి నటిస్తున్నాడు. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా 2024లో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.
సంబంధిత కథనం