స్టార్ యాక్టర్లు అక్షయ్ కుమార్, మాధవన్ ప్రధాన పాత్రలు పోషించిన కేసరి చాప్టర్ 2 మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. భారత స్వాతంత్య్ర సమరంలో కీలక ఘట్టమైన జలియన్ వాలాబాగ్ మారణ హోమం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ దారుణానికి పాల్పడిన బ్రిటీషర్లకు వ్యతిరేకంగా కోర్టులో భారతీయ లాయర్ పోరాడడం చుట్టూ సాగుతుంది. గత శుక్రవారం ఏప్రిల్ 18న విడుదలైన కేసరి చాప్టర్ 2 మూవీకి అద్భుతమైన టాక్, పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. కానీ బాక్సాఫీస్ వద్ద మరీ ఎక్కువ గ్రోత్ దక్కలేదు. మూడు రోజుల్లో ఎంత వచ్చిందంటే..
కేసరి చాప్టర్ 2 సినిమాకు మూడు రోజుల్లో ఇండియాలో రూ.29.75 కోట్ల నెట్ కలెక్షన్లు దక్కాయి. మూడో రోజైన ఆదివారం వసూళ్లలతో కాస్త పెరుగుదల కనిపించింది. అయితే, టాక్ చాలా బాగుండటంతో కలెక్షన్లు ఎక్కువగా వస్తాయనే అంచనాలు వచ్చాయి. కానీ ఆ రేంజ్లో గ్రోత్ కనిపించలేదు. మూడో రోజు ఈ చిత్రానికి సుమారు రూ.12.25 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి.
మరి సోమవారం నుంచి కేసరి చాప్టర్ 2 సినిమా బాక్సాఫీస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. వీక్డేస్లోనూ వసూళ్లు స్టడీగా ఉంటే ఫుల్ రన్లో మంచి కలెక్షన్లు దక్కే అవకాశం ఉంటుంది. డ్రాప్ కనిపిస్తే అక్షయ్ కుమార్కు మరోసారి నిరాశ తప్పదు.
కేసరి చాప్టర్ 2 మూవీకి కరణ్ సింగ్ త్యాగీ దర్శకత్వం వహించారు. బ్రిటీషర్లపై న్యాయపోరాటం చేసిన లాయర్ సి.శంకరన్ నాయర్ పాత్రను ఈ చిత్రంలో పోషించారు అక్షయ్ కుమార్. బ్రిటీషర్ల తరఫున వాదించిన లాయర్ క్యారెక్టర్ చేశారు మాధవన్. ఈ మూవీలో అక్షయ్, మాధవన్ నటనకు ప్రశంసలు భారీగా దక్కుతున్నాయి. ఈ కోర్ట్ రూమ్ డ్రామాగా ఈ హిస్టారికల్ మూవీ ఆసక్తికరంగా సాగింది. జలియన్ వాలాబాగ్ మారణ హోమం చుట్టూ వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ తెరకెక్కించారు.
కేసరి చాప్టర్ 2లో అక్షయ్, మాధవన్తో పాటు అనన్య పాండే, రెజీనా కసాండ్రా, విశాఖ్ నాయర్, సైమన్ డే కీరోల్స్ చేశారు. ధర్మ ప్రొడక్షన్స్, లియో మీడియా కలెక్టివ్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లు ఈ మూవీని ప్రొడ్యూజ్ చేశాయి.
సంబంధిత కథనం
టాపిక్