Keerthy Suresh gifts gold coins: దసరా టీమ్ మొత్తానికి అదిరిపోయే గిఫ్ట్లు ఇచ్చిన కీర్తి సురేశ్
Keerthy Suresh gifts gold coins: దసరా టీమ్ మొత్తానికి అదిరిపోయే గిఫ్ట్లు ఇచ్చింది కీర్తి సురేశ్. సినిమా షూటింగ్ చివరి రోజు ఆమె ఇలా అందరికీ గిఫ్ట్ లు ఇవ్వడం విశేషం.
Keerthy Suresh gifts gold coins: సాధారణంగా ఏదైనా సినిమా హిట్ అయితే.. సదరు మూవీ ప్రొడ్యూసర్ టీమ్ లోని అందరికీ ఖరీదైన బహుమతులు ఇస్తుంటారు. కానీ దసరా మూవీ చేసిన హీరోయిన్ కీర్తి సురేశ్ మాత్రం తానే సినిమా షూటింగ్ ముగిసిన తర్వాత ఈ మూవీ కోసం పని చేసిన అందరికీ గిఫ్ట్ లు ఇచ్చిందన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.
దసరా టీమ్ మొత్తం 130 మందికి ఈ బహుమతులు అందాయి. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా? ఒక్కొక్కరికి 10 గ్రాముల బంగారం కావడం విశేషం. నిజంగా ఇది మామూలు విషయం కాదు. ఇప్పుడున్న బంగారం ధరలు చూసుకుంటే ఆమె ఇచ్చిన బహుమతుల విలువ సుమారు రూ.75 లక్షల వరకూ ఉంటుంది. ఓ హీరోయిన్ ఇంత భారీ స్థాయిలో ఖర్చు పెట్టి గిఫ్ట్ లు ఇవ్వడం నిజంగా విశేషమే.
ఈ దసరా మూవీతో ఆమె చాలా కనెక్ట్ అయినట్లు ఈ సినిమా వర్గాలు వెల్లడించాయి. షూటింగ్ పూర్తవుతుంటే ఆమె చాలా ఎమోషనల్ అయిందని చెప్పాయి. అందుకే ఈ సినిమా కోసం పని చేసిన అందరికీ ఏదైనా గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాలని భావించి కీర్తి ఈ నిర్ణయం తీసుకుందట. ఈ పాన్ ఇండియా మూవీలో వెన్నెల అనే క్యారెక్టర్ లో కీర్తి కనిపించింది.
తెలంగాణ నేటివిటీతో తెరకెక్కిన దసరా మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా మార్చి 30న రిలీజ్ కాబోతోంది. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సింగరేణి ప్రాంతంలోని వీర్లపల్లి అనే గ్రామం చుట్టూ తిరిగే కథ ఇది.
సంబంధిత కథనం