కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్ (ఏప్రిల్ 26)లో ఏం జరిగిందంటే.. జైలులోని దీప బయటికి రావాలని కోరుకుంటూ కాంచన, అనసూయ పూజ చేసేందుకు రెడీ అవుతారు. దీపాలు వెలిగించేందుకు ప్రమిదలు చేస్తుంటారు. నేనూ చేస్తా నాయనమ్మ అని శౌర్య అడుగుతుంది. సరే చెయ్ అని, ఎలా చేయాలో చెబుతుంది కాంచన. నాన్న ఇంకా రాలేదేంటి.. అమ్మతో వస్తాడా అని శౌర్య అడుగుతుంది.
అమ్మను నాన్న తీసుకొస్తాడు కదా అని శౌర్య అడుగుతుంది. బుధవారం తీసుకొస్తానని చెప్పాడు కదే అని అనసూయ బదులిస్తుంది. అప్పటి వరకు అమ్మ ఎక్కడ ఉంటుందని శౌర్య ప్రశ్నిస్తుంది. పోలీస్ స్టేషన్లోనా అని అడుగుతుంది. ఇంతలో కార్తీక్ వస్తాడు. నాన్న అంటూ ఆనందంగా అంటుంది శౌర్య.
కార్తీక్ చోక్కాకు రక్తం ఉండడాన్ని శౌర్య గమనిస్తుంది. నాన్న షర్టుకు రక్తం ఉంది నానమ్మ అని శౌర్య అంటుంది. ఏమైందని కాంచన అడుగుతుంది. రోడ్డు మీద వేరే వాళ్లకు చిన్న యాక్సిడెంట్ అయిందని, రక్తం ఇచ్చానని కార్తీక్ చెబుతాడు.
ఏవో ఏర్పాట్లు చేసినట్టున్నారని కాంచనను కార్తీక్ అడుగుతాడు. ఈరోజు మంచి రోజు, దేవుడికి పిండి దీపాలతో దీపారాధన చేసి, కటిక నేలపై భోజనం చేస్తే కోరుకున్నది జరుగుతుందని కాంచన చెబుతుంది. అమ్మను బుధవారం తీసుకొస్తానని మాటిచ్చావు కదా.. అది నెరవేరేలా మొక్కుకుంటానని శౌర్య అంటుంది. దీపం వెలిగించాలంటే.. అందరి సంకల్పం ఒకరి కోసమే కదా మీరే వెలిగించండి అని కార్తీక్ అంటాడు. కాంచన, అనసూయ దీపాలు వెలిగించి మొక్కుకుంటారు.
మా అమ్మను త్వరగా ఇంటికి పంపించెయ్, మాతో ఉండేలా చూడు అని దేవుడిని మొక్కుతుంది శౌర్య. రౌడీకి మాట ఇచ్చినా నా నమ్మకం లేదు, కానీ ఆ మాట నిలబెట్టుకునేలా చూడు అని కార్తీక్ కోరుకుంటాడు. పూజలో భాగంగా నేలపై అన్నం పెట్టుకొని తింటారు కాంచన, అనసూయ, కార్తీక్, శౌర్య. నువ్వు ప్లేట్లో తినాలని చెప్పినా శౌర్య మాత్రం అమ్మ కోసం నేల భోజనం చేస్తానని అంటుంది. అమ్మ భోజనం చేసి ఉంటుందా అని శౌర్య అడుగుతుంది. అమ్మను చూసుకునేందుకు అక్కడ కొందరు ఉన్నారని చెప్పాగా.. తినే ఉంటుందని కార్తీక్ అంటాడు. దీప భోజనం చేసిందో లేదో అని మనసులో అనుకుంటాడు.
జైలులో ఉన్న దీపకు భోజనం తెచ్చి ఇస్తుంది కానిస్టేబుల్. బాధగా ఆ ప్లేట్ తీసుకుంటుంది దీప. గతంలో తాను కోపంగా ఉన్న సమయంలో శౌర్య అన్నం తీసుకొచ్చిన విషయాన్ని దీప గుర్తు చేసుకుంటుంది. సారీ చెప్పి తనకు శౌర్య అన్నం తినిపించిన విషయాన్ని తలచుకుంటుంది. భోజనం తినకుండా ఆకలితో ఉంటే నాపై ఒట్టే అని శౌర్య అన్న మాటను గుర్తు తెచ్చుకొని కన్నీరు పెట్టుకుంటుంది. వెక్కివెక్కి ఏడుస్తూనే అన్నం తింటుంది.
శౌర్య మీ అందరికి చాలా దూరమైపోయినట్టుంది శౌర్య, నన్ను వదిలి ఎక్కడికో వెళ్లిపోయినట్టుంది అని ఏడుస్తుంది దీప. ఎలా తింటున్నావో, ఎలా పడుకుంటున్నావో అని అంటుంది. శ్రీధర్ అన్నట్టు నాకు శిక్ష పడి జైలులో ఉండిపోతే నా కూతురు పరిస్థితి ఏంటి, కార్తీక్ బాబు పరిస్థితి ఏంటి అని ఏడుస్తుంది దీప. “నా వల్ల ఎవరికీ అన్యాయం జరగకూడదంటే నేనేం చేయాలి, నేనే నిర్ణయం తీసుకోవాలి” కన్నీరు పెట్టుకుంటూనే ఆలోచిస్తూ తింటుంది దీప.
కార్తీక్కు విడాకులు ఇవ్వాలని దీపకు సలహా ఇచ్చిన శ్రీధర్పై కావేరి కోప్పడుతుంది. ఆడవాళ్లంటే అసలు గౌరవం ఉందా అని అడుగుతుంది. మీకు మొగుళ్లంటే గౌరవం ఉందా అని ఎదురు ప్రశ్నిస్తాడు శ్రీధర్. మీరు ఉండగానే నన్ను రెండో పెళ్లి చేసుకోవాలని అడిగితే మీకు ఎలా ఉంటుందని కావేరి అడుగుతుంది. ఎగిరి గంతేసి రెండో పెళ్లి స్వయంగా జరిపిస్తానని వెటకారంగా మాట్లాడతాడు శ్రీధర్.
“ఏ పెళ్లాం మెడలో మొగుడు కట్టిన తాళి ఉందో చెప్పు. కట్టిన వారం రోజులకే దాన్ని పీకి పక్కన పెట్టి దాని ప్లేస్లో బంగారు తాడు తగిలించుంటారు. దానికి మీరు వేసిన మూడు ముళ్లు అంటారు” అని వెటకరిస్తాడు శ్రీధర్. ఇద్దరి మధ్య మాటలు ఇలాగే సాగుతాయి. వంట చేయకుండా ఉపవాస దీక్ష చేస్తుంటుంది కావేరి. దీక్ష విరమించాలంటే ఏం చేయాలని శ్రీధర్ అడుగుతాడు. తనకు, దీపకు, ఆడవాళ్లకు క్షమాపణ చెప్పాలని కావేరి అంటుంది.
లాయర్తో మళ్లీ మాట్లాడు, ఉన్న సాక్ష్యాలు దీపను కాపాడలేవని అర్థమవుతోంది రా అని కార్తీక్తో కాంచన మాట్లాడుతుంటుంది. కరెక్ట్గా చెప్పావత్తా అంటూ జ్యోత్స్న ఎంట్రీ ఇస్తుంది. నీ దగ్గర ఉన్న సాక్ష్యాలు దీపను కాపాడలేవని అంటుంది. నువ్వు ఎందుకు వచ్చావని కార్తీక్ అడుగుతాడు. నేను నా మేనత్త కోసం వచ్చానంటుంది జ్యోత్స్న. నీ కోడలు క్షేమంగా ఇంటికి తిరిగి రాదు అంటూ మాట్లాడుతుంది.
ఇప్పుడు మా డాడీ కోర్టుకు వచ్చిన దీపే షూట్ చేసిందని సాక్ష్యం చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని జ్యోత్స్న అంటుంది. రెచ్చిపోయే ఎవరిని కాల్చేసినా శిక్ష పడకూడదు అని మాట్లాడుతుంది. “ఆసుపత్రి నుంచి ఇంటికి రాగానే.. చెల్లెలికి నా గురించి తెలుసా అని అడిగారు.. అంత ప్రేమ ఆయనకు నువ్వంటే. కానీ అవేమీ అవసరం లేదు” అని జ్యో అంటుంది. జ్యోత్స్న గట్టిగా అరుస్తాడు కార్తీక్. ఏం నాన్నను చూసేందుకు ఆసుపత్రికి అత్త వచ్చిందా అని జ్యో అడుగుతుంది. ఆసుపత్రిలోనే ముఖం చూడనివ్వనని మీ తాత.. ఇంటికి వస్తే ఊరుకుంటాడా అని కార్తీక్ అంటాడు.
కొడుకును చంపాలనుకున్న మనిషిని కాపాడలని తాపత్రయ పడుతుంటే ఏ తండ్రికి బాధ ఉండదు అని జ్యో అంటుంది. శౌర్య ఇంట్లోనే ఉంది మెల్లగా మాట్లాడు అని కార్తీక్ అంటాడు. దీప జైలులో ఉందని శౌర్యకు తెలియదా అని జ్యో అంటుంది. ఎవరినీ వదులుకోలేక, కాపాడుకోలేక చేతకాని దానిలా మిగిలిపోయానని కన్నీరు పెట్టుకుంటుంది కాంచన. మా అన్నయ్య అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు అని ఏడుస్తుంది.
జ్యోత్స్నను ఇంటి నుంచి బయటికి లాక్కొస్తాడు కార్తీక్. మా అమ్మ మందులు వేసుకొని అలా ఉంది అంతే అని అంటాడు. మా అమ్మకు కూడా నిన్నటి వరకు అలాగే ఉందని జ్యో బదులిస్తుంది. మా డాడీకి ఏమైనా అయి ఉండి ఉంటే అని జ్యోత్స్న అంటే.. ఆ పాపం నీకే చుట్టుకొని ఉండేదని కార్తీక్ అంటాడు. దీప షూట్ చేస్తే ఆ పాపం నాకెందుకు చుట్టుకుంటుందని జ్యోత్స్న అడుగుతుంది. మామయ్యకు బుల్లెట్ తగలడానికి కారణం నువ్వు అని కార్తీక్ అంటాడు. ఇంకా నయం నేనే చేశాననేలా అని జ్యో అంటుంది. ‘నాకు డౌటే’ అని కార్తీక్ అంటాడు. దీంతో షాకైన జ్యోత్స్న బావ గట్టిగా అంటుంది.
నా కన్న తండ్రిని నీ కోసం చంపుకుంటానా అని జ్యోత్స్న అంటుంది. మరి దీపకు ఏం అవసరం ఉందని కార్తీక్ అడుగుతాడు. నన్ను కాల్చబోయి మా డాడీని కాల్చిందని జ్యో అంటుంది. దీప చేతిలోకి గన్ రావడానికి కారణం నువ్వే కదా అని కార్తీక్ బదులిస్తాడు. దీప షూట్ చేసింది నువ్వు ఒప్పుకుంటున్నావా అని జ్యో అంటుంది. ఒప్పుకోను అని కార్తీక్ కౌంటర్ ఇస్తాడు. ఎవరు షూట్ చేశారని అనుకుంటున్నావని జ్యో అడుగుతుంది. అది ఆ దేవుడికే తెలియాలని అని కార్తీక్ అంటాడు. నేనే షూట్ చేశానని దీప అంటే నమ్ముతావా అని జ్యో అడుగుతుంది. నమ్మనంటాడు కార్తీక్. ఎందుకంటే దీపకు ప్రాణాలు పోయడమే వచ్చు.. ప్రాణాలు తీయడం రాదు అని చెబుతాడు.
నువ్వు ఇలాగే గుడ్డిగా నమ్ముతూ ఉండు.. దీప బయటికి రాదు అని కార్తీక్తో జ్యోత్స్న అంటుంది. ఈ మాటను శౌర్య వింటుంది. భయపడిపోతుంది. దీప బయటికి రాదా అని అనుకుంటుంది. నా భార్యను ఎలా కాపాడుకోవాలో తెలుసు అని కార్తీక్ అంటాడు. మా డాడీ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబుతాడని జ్యో అంటుంది. దీప ఏ తప్పు చేయలేదని నాకు నమ్మకం ఉంది, నా నమ్మకమే గెలుస్తుందని నమ్మకండా అంటాడు కార్తీక్. నిన్ను నా కూతురు చూడక ముందే వెళ్లు అని అంటాడు. ఆరోజు దీప పోలీస్ స్టేషన్లో ఉందని చెప్పినట్టే.. ఈరోజు దీప ఎక్కడ ఉందో శౌర్యకు చెబుతావంటూ కార్తీక్ కోప్పడతాడు. నాకు దూరంగా ఉంటే మంచిది అని అంటాడు.
ఈ దూరం దగ్గరవడానికే బావ అని జ్యోత్స్న అనుకుంటుంది. కారు ఎక్కేందుకు రెడీ అవుతుంది. జ్యో అని శౌర్య పిలుస్తుంది. మా అక్కడ ఉంది అని ఏడుస్తూ అడుగుతుంది. మీ నాన్ననే అడుగు, నేను చెబితే ఒప్పుకోడు అని చిరాకు పడుతుంది జ్యోత్స్న. నువ్వు చెప్పానని చెప్పను.. మా అమ్మ ఎక్కడ ఉందో చెప్పు అని శౌర్య అడుగుతుంది. దీప రాదని మా నాన్నతో చెప్పడం నేను విన్నా అని అంటుంది.
మా అమ్మను పోలీసులు ఎందుకు తీసుకెళ్లారని జ్యోత్స్నను శౌర్య అడుగుతుంది. ఇన్ని చెప్పను కానీ.. ఒకటి చెపుతా విను అంటుంది జ్యోత్స్న. “మీ అమ్మ నీకోసం రాలేనంత దూరంలో ఉంది. ఎప్పటికీ రాదు. నువ్వు ఏడ్చినా మీ అమ్మకు వినపడదు. మీ అమ్మ నీ కంటికి కనపడదు” అని జ్యోత్స్న అంటుంది. ఇక నువ్వు మీ అమ్మను మరిచిపో అని అంటుంది. చెప్పవా.. ప్లీజ్ జో అని చేయి పట్టుకుంటుంది శౌర్య.
సారీ పాప.. నేను ఇప్పుడు కన్నీళ్లకు కరగడం మానేసానని చెప్పన జ్యోత్స్న కారు ఎక్కి వెళ్లిపోతుంది. అమ్మ ఎక్కడ ఉందో చెప్పకుండా ఎలా వెతుక్కోవాలని ఏడుస్తుంది శౌర్య. “తప్పు చేసిన వాళ్లను పోలీసులు వెతుకుతారని అమ్మ చెప్పేది కదా.. వాళ్లనే అడిగితే తెలుస్తుంది.. ఎలా అడగాలి. ఏమని అడగాలి. ఎలా వెళ్లాలి” అంటూ ఏడుస్తుంది శౌర్య. దీంతో కార్తీక దీపం 2 నేటి (ఏప్రిల్ 26) ఎపిసోడ్ ముగిసింది.
సంబంధిత కథనం