Karthika Deepam Today Episode April 21: దీపకు కార్తీక్ గోరుముద్దలు.. నోరు తెరిచిన దశరథ్.. మరిన్ని చిక్కుల్లో దీప-karthika deepam today episode april 21 deepa in deep trouble karthik in worry star maa tv daily serial ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam Today Episode April 21: దీపకు కార్తీక్ గోరుముద్దలు.. నోరు తెరిచిన దశరథ్.. మరిన్ని చిక్కుల్లో దీప

Karthika Deepam Today Episode April 21: దీపకు కార్తీక్ గోరుముద్దలు.. నోరు తెరిచిన దశరథ్.. మరిన్ని చిక్కుల్లో దీప

Karthika Deepam 2 Today Episode April 21: స్టేషన్‍లోనే దీపకు కార్తీక్ గోరుముద్దలు తినిపిస్తాడు. ఎస్ఐ చెప్పే మాటలతో ఇద్దరూ షాక్ అవుతారు. దశరథ్ నోరు తెరిచి పోలీసులకు వాగ్మూలం ఇస్తాడు. కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‌‍లో పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

Karthika Deepam Today April 21: జైలులో దీపకు అన్నం తినిపించిన కార్తీక్.. నోరు తెరిచిన దశరథ్.. మరిన్ని చిక్కుల్లో దీప

కార్తీక దీపం 2 నేటి (ఏప్రిల్ 21, 2025) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. నీకోసం ఎవరూ వచ్చేలా లేరు, తినేందుకు ఏమైనా తీసుకురావాలా అని జైలులో ఉన్న దీపను కానిస్టేబుల్ అడుగుతుంది. వద్దు అని, దశరథ్‍కు ఎలా ఉందో చెప్పాలని దీప ప్రశ్నిస్తుంది. ఆయన లేచే వరకు వరకు తినావా అని కానిస్టేబుల్ అడిగితే.. ఆయన నాకు తండ్రి లాంటి మనిషి అని దీప అంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా గుండెల్లో కాల్చావ్ అని కానిస్టేబుల్ అంటుంది. ఇంతలో క్యారేజీ పట్టుకొని పోలీస్ స్టేషన్‍కు వస్తాడు కార్తీక్.

మామయ్య స్పృహలోకి వచ్చాడు.. ఆనందించిన దీప

మీ ఆవిడకు ఆకలి లేదంట.. క్యారేజ్ అక్కడ పెట్టి వెళ్లాలని కార్తీక్‍తో కానిస్టేబుల్ చెబుతుంది. కొన్ని చెబితే ఆకలి గుర్తు రావొచ్చని కార్తీక్ అంటాడు. తమ ఇంటికి గురించి, అందరి గురించి చెబుతాడు. శౌర్య కూడా తినిందని తన మాటల్లో అంటాడు. నువ్వు తింటేనే నీ భర్త ఇక్కడి నుంచి నీ భర్త సంతోషంగా వెళతాడని అంటే ఆకలి గుర్తొస్తుందేమోనని చెబుతాడు. “ఆసుపత్రిలో మామయ్య స్పృహలోకి వచ్చాడని తెలిస్తే మరింత బాధ పోతుందేమో” అని కార్తీక్ అంటాడు. దశరథ్ స్పృహలోకి వచ్చారా అని కాస్త ఆనందంగా అంటుంది దీప. ఆయన ప్రాణాలకు ప్రమాదం లేదంట అని కార్తీక్ చెప్పడంతో… అమ్మా ముత్యాలమ్మ తల్లి అంటూ దీప కాస్త సంతోషిస్తుంది. భోజనం చేయ్ దీప అని కార్తీక్ అంటాడు.

వంట చేసుకొని తీసుకొచ్చా..

నీ కోసం నేను వంట చేసుకొచ్చానని, నువ్వు తినకపోతే వంట ఎంత బాధపడుతుందని దీపతో కార్తీక్ అంటాడు. మీ భార్య అంటే మీకు ఎంత ప్రేమ అండి అని ఇదంతా చూస్తున్న కానిస్టేబుల్ అంటుంది. క్యారేజ్ అక్కడ పెట్టి వెళ్లాలని అంటుంది. మా ఆవిడకు భోజనం నేనే పెడతాడనని కార్తీక్ అడుగుతాడు. ఎస్ఐ వస్తే ప్రాబ్లం అవుతుందని కానిస్టేబుల్ అంటే.. ఆలోపు అయిపోగొడతానని కార్తీక్ అంటాడు. కార్తీక్ కింద కూర్చుంటే వద్దు అంటుంది దీప. భార్యకు సముదాయించేలా మాటలు చెబుతాడు కార్తీక్.

ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందని దీప అడుగుతుంది. శౌర్య మాట వినడం లేదని, అమ్మకావాలి అని ఏడుస్తోందని చెబుతాడు. దీంతో దీప కూడా ఏడుస్తుంది. ఏవో అబద్దాలు చెప్పి శౌర్యకు అన్నం తినిపించానని కార్తీక్ అంటాడు. రేపు నువ్వు నిర్దోషిగా బయటికి వస్తావ్ కదా.. అప్పుడు నిన్ను శౌర్య ముందు నిలబెట్టి ఇదిగో అమ్మా అంటాను అని చెబుతాడు. కేసు నుంచి బయటపడతానని మీరు అనుకుంటున్నారా అని దీప అడుగుతుంది. తప్పు చేయలేదని తాను నమ్ముతున్నానని, బయటికి వస్తావని కార్తీక్ చెబుతాడు.

దీపకు గోరుముద్దలు తినిపించిన కార్తీక్

గోరుముద్దలు కలిపితే తనకు ఇవ్వాలని దీప అంటుంది. మళ్లీ చేయి కడుక్కోవాల్సి వస్తుందని, నేను తినిపిస్తానని కార్తీక్ చెబుతాడు. జైలులో ఉన్న దీపకు ప్రేమగా అన్నం తినిపిస్తాడు కార్తీక్. ఫోన్ అయినా మాట్లాడించాలని శౌర్య పట్టుబట్టిందని అంటాడు. మీరు తినండని దీప అడుగుతుంది. ఎస్ఐ వస్తే తిడతారని కార్తీక్ అంటే.. నాకూ వద్దు అని దీప అంటుంది. నువ్వు కూడా చిన్నపిల్లలా తయారయ్యావని కార్తీక్ అంటే.. దీప బాధపడుతుంది. దీంతో కార్తీక్ కూడా తింటూ.. దీపకు గోరుముద్దలు తినిపిస్తాడు.

నా వల్లే కార్తీక్ బాబు ఈ కష్టాలు వచ్చాయని బాధపడుతున్నావా అని దీపను కార్తీక్ అడుగుతాడు. చిన్నప్పుడు లోతు గురించి ఆలోచించకుండా కోనేట్లో దూకి నన్ను కాపాడావ్ కదా అని అంటాడు. అప్పుడు నువ్వు నన్ను వదిలేయలేదు.. ఇప్పుడు నేను నిన్ను వదిలేయలేను అని కార్తీక్ చెబుతాడు. శౌర్య కోసం వాయిస్ రికార్డ్ చేసి ఇవ్వు అని ఫోన్ ఇస్తాడు కార్తీక్. దీంతో శౌర్య పాప అంటూ ఫోన్‍లో తన మాటలను దీప రికార్డ్ చేస్తుంది.

షాకింగ్ విషయం చెప్పిన ఎస్ఐ

ఇంతలో ఎస్ఐ అక్కడికి వస్తాడు. కార్తీక్‍ను లోపలికి ఎందుకు రానిచ్చావని కానిస్టేబుల్‍పై సీరియస్ అవుతాడు. “దశరథ్ స్పృహలోకి వచ్చారు. కేసు నుంచి బయటపడ్డారని అనుకుంటున్నారేమో. వాళ్లు దీపపై అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. ఒకటి కాదు నాలుగు సెక్షన్లలో కేసు బుక్ చేశారు. వాళ్లేమో దీపకు యావజ్జీవ శిక్ష పడే వరకు వదిలిపెట్టమని అంటున్నారు” అని ఎస్ఐ షాకింగ్ విషయాలు చెబుతాడు. దీంతో కార్తీక్, దీప కంగారు పడతాడు. రేపు దశరథ్ వాగ్మూలం తీసుకునేందుకు వెళతానని, నన్ను షూట్ చేసింది దీప అని ఆయన చెబితే నిన్ను ఏ దేవుడు కాపాడలేడని ఎస్ఐ అంటాడు. అప్పుడు జైలులోనే మంచి భోజనం పెడతాడనని వెటకారంగా అంటాడు.

ఎవరు ఉన్నారో అర్థమవుతోందా!

దీప కంగారు పడుతుంది. నువ్వు నిర్దోషిగా బయటికి వస్తావు దీప అని కార్తీక్ అంటాడు. ముందు బయటికి వెళ్లు అని ఎస్ఐ అంటాడు. ఈ మాటల వెనుక ఎవరు ఉన్నారో అర్థమవుతోందా.. నువ్వు ధైర్యంగా ఉండు, నీకేం కాదు అని దీపకు చెప్పి వెళ్లిపోతాడు కార్తీక్. నీ భర్తకు నీపై ఉన్న ప్రేమను చూస్తుంటే నువ్వు ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నానని, మీ ఆయన తప్పనిసరిగా బయటికి తీసుకొస్తారని దీపతో కానిస్టేబుల్ చెబుతుంది. ధైర్యంగా ఉండు దీప అంటుంది.

నాకు యావజ్జీవ శిక్ష తప్పదా!

రేపు దశరథ్ ఏమని చెబుతారో.. దీపే కాల్చిందని చెబుతారా అని దీప ఆలోచిస్తుంది. “అలా చెబితే నాకు యావజ్జీవ శిక్ష తప్పదా.. నేను నా కూతురికి దూరం అయిపోతానా. దశరథ్ చెప్పే మాటలపై నా జీవితం ఆధారపడి ఉంది. ఆయన ఏం చెబుతారో ఏంటో” అని మనసులో బాధపడుతుంది దీప.

దీపే కాల్చింది.. నోరు తెలిచిన దశరథ్

దశరథ్ వాగ్మూలం తీసుకునేందుకు ఆసుపత్రికి వస్తాడు ఎస్ఐ. “దీప మిమ్మల్ని షూట్ చేసింది. ఇది నిజమా.. అబద్ధమా” అని బెడ్‍పై ఉన్న దశరథ్‍ను ఎస్ఐ అడుగుతాడు. కాసేపు మౌనంగా ఉంటాడు దశరథ్. కొంప తీసి గుర్తు లేదంటాడా అని జ్యోత్స్నతో చెప్పి కంగారు పడుతుంది పారిజాతం. ఏంటి దశరథ్ అని శివన్నారాయణ అంటే.. ఆయన ఒక్కడే మాట్లాడాలని ఎస్ఐ అంటాడు. దీప కాదంటాడా ఏంటి అని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది.

మిమ్మల్ని షూట్ చేసింది ఎవరు అని ఎస్ఐ మళ్లీ అడుగుతాడు. దీంతో.. ‘దీప’ అని దశరథ్ బదులిస్తాడు. వాగ్మూలంపై దశరథ్ సంతకం తీసుకుంటాడు ఎస్ఐ. అవసరమైతే కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాల్సి ఉంటుందని చెబుతాడు. దీపకు శిక్ష పడాల్సిందేనని శివన్నారాయణ అంటాడు. తనను కాల్చింది దీపేనని దశరథ్ అనడంతో దీప మరిన్ని చికుల్లో పడింది.

దీపకు శిక్ష పడుతుందని మనసులో ఆనందిస్తుంది జ్యోత్స్న. “థ్యాంక్స్ డాడీ.. ఇంక దీపకు శిక్ష పడుతుందనే నమ్మకం నాకు వచ్చింది. ఇప్పుడు నేను చేయాల్సి పని మరొకటి ఉంది. అక్కడికే వెళతాను” అని అనుకుంటుంది జ్యో.

శౌర్యకు రికార్డింగ్ వినిపించిన కార్తీక్

తనతో కార్తీక్ చెప్పిన మాటలను బొమ్మకు చెబుతూ ఉంటుంది శౌర్య. ఇది చూసి కార్తీక్ బాధపడతాడు. అమ్మ ఎక్కుడున్నా నీ గురించి ఆలోచిస్తుంది రౌడీ అని కార్తీక్ అంటాడు. నాకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదని శౌర్య బాధగా అంటుంది. అమ్మ నీతో మాట్లాడింది అని శౌర్య చేతికి ఫోన్ ఇస్తాడు కార్తీక్. దీప చేసిన వాయిస్ రికార్డింగ్‍ను శౌర్యకు వినిపిస్తాడు కార్తీక్. దీపతో ఫోన్ మాట్లాడుతున్నట్టుగా అమాయకంగా మాట్లాడుతుంది శౌర్య. నాన్న చెప్పినట్టు వినాలి, తినాలి అంటూ దీప రికార్డ్ చేసి ఉంటుంది. అది వింటూ అలాగే అంటుంది శౌర్య. అమ్మ నీకోసం తొందరలోనే వస్తుంది అని దీప చెప్పి ఉంటుంది. అమ్మ మాట్లాడడం లేదు.. ఆగిపోయింది అని శౌర్య అంటుంది. ఇది వాయిస్ రికార్డింగ్ అని కార్తీక్ అంటాడు. అమ్మ వచ్చే వరకు బాధపడకూడదని చెబుతాడు. అమ్మ మాటలు వినిపించినందుకు థ్యాంక్స్ అని కార్తీక్‍ను హత్తుకుంటుంది శౌర్య.

కార్తీక్ వద్దకు జ్యోత్స్న.. చాటుగా చూసిన శౌర్య

అమ్మ ఎప్పుడు వస్తుందని శౌర్య అడుగుతుంది. ఇంటి ముందు కారు వచ్చి ఆగితే అమ్మ వచ్చిందా అని చూస్తుంది. కారు నుంచి జ్యోత్స్న దిగుతుంది. నువ్వు లోపలికి వెళ్లు అని శౌర్యతో కార్తీక్ అంటాడు. దీపే కాల్చిందని దశరథ్ వాగ్మూలం ఇచ్చిన విషయాన్ని చెప్పేందుకు కార్తీక్ ఇంటికి జ్యోత్స్న వచ్చి ఉంటుంది. ఎందుకు వచ్చావ్ అని జ్యోత్స్నను కార్తీక్ ప్రశ్నిస్తాడు. తలుపు చాటున ఉంటూ శౌర్య చూస్తుంది. దీంతో కార్తీక దీపం 2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్ ముగిసింది. మరి దీప జైలులో ఉందని జ్యోత్స్న మాటలతో శౌర్యకు తెలుస్తుందా అనేది తదుపరి ఎపిసోడ్‍లో చూడాలి.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం