కార్తీక దీపం 2 టుడే అక్టోబర్ 8 ఎపిసోడ్ లో ఈ ప్రశ్నకు సమాధానం కోసం మేం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు మా అన్నయ్య కూతురి కోసం అంటున్నానని కార్తీక్ తో కాంచన అంటుంది. ఎవరినో బాగు చేయాలని మనం అవమానపడటం ఎందుకు? అని కాంచన కోప్పడుతుంది. దాని బుద్ధి సరిగ్గా ఉండదు. ఆలోచనలు సరిగ్గా ఉండదు. దాని కోసం వీళ్ల తాపత్రాయం ఎందుకు? అని జ్యోత్స్న గురించి అంటుంది కాంచన.
అయితే వదిలేయమంటావా? కొందరికి మంచి జరుగుతుందంటే మన విలువలను కొంచెం కోల్పోవడంలో కూడా ఆనందం ఉంటుందమ్మా. ఏదీ ఎక్కువ కాలం ఉండదని కార్తీక్ అంటాడు. కార్తీక్ బాబు నీ కొడుకు. నీ బిడ్డపై ఎంత ప్రేమ ఉంటుందో అంతే నమ్మకం ఉంటుంది చెల్లెమ్మ. ఏదో ఒక రోజు కార్తీక్, దీప కలిసి అన్ని కుటుంబాలను ఒకటి చేస్తారని అనసూయ అంటుంది.
సైకిల్ కావాలని శౌర్య అలుగుతుంది. దీపావళికి కొట్టానని కార్తీక్ అంటాడు. అయితే ఈ రోజే దీపావళి అని శౌర్య అంటుంది. దీపావళికి నీకు ఏదో ఒకటి కొట్టాలేనని దీపతో అంటాడు కార్తీక్. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవడం నీకు బాగా అలవాటైంది బావ. ఏదో ఒక రోజు నిజం అందరికీ చెప్పేలా ఉన్నావని దీప అంటుంది. నువ్వు కూడా ఇలా ఉండకు. జ్యోత్స్న, పారును ఉతికేయ్ అని కార్తీక్ చెప్తాడు. ఈ నిజాన్ని జ్యోత్స్న, పారుతో చెప్పేలా చేయాలని అంటాడు కార్తీక్.
ఏంటీ హుషారుగా ఉన్నావని జ్యోత్స్న అడిగితే, మనిషి అన్నాక ఇలాగే ఉండాలని దీప కౌంటర్ ఇస్తుంది. నువ్వు ఉన్నన్ని రోజులు బావ డ్రైవర్ గానే ఉంటాడని జ్యోత్స్న అంటుంది. నా కోసం బావ ఎందుకు ఇంట్లో ఉంటున్నాడని జ్యో అడుగుతుంది. అమ్మాయి వల్లే ఇక్కడ ఉంటున్నాడు. అమ్మాయి కోసం కాదని దీప అంటుంది. అత్త కూతురు ఎవరు? మళ్లీ మళ్లీ చెప్పండని పారును అడుగుతుంది దీప.
నిజంగా అమ్మాయి గారేనా? అని దీప అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. సుమిత్రత్త అమ్మాయి కోసమని అన్నాడు కదా అని పారు అంటే, జ్యోత్స్న కోసమని అనలేదు కదా అని దీప అడుగుతుంది. సుమిత్ర కూతురు జ్యోత్స్నే కదా అని పారు అంటే, కానీ బావ అలా చెప్పలేదు కదా అని వెళ్లిపోతుంది దీప. ఈ ఇంటి కూతురిని కాదు అని చాలా క్లారిటీగా చెప్పిందని జ్యో అంటుంది. మనల్ని ఇరికించడమే కార్తీక్ పని అని పారు చెప్తుంది.
ముందు నువ్వు నన్ను నాన్న అని పిలవడం మానేసేయ్. నేను లేనప్పుడు ఎలా పిలుస్తావో తెలుసు. నీ ప్రేమ నీకున్న అవసరం మీద ఆధారపడి ఉంటుంది జ్యోత్స్న అని దాసు అంటాడు. అమ్మ మీద ఒట్టు నీ మీద ప్రేమ ఉంది నాన్న అని జ్యో అంటే, అందుకేనా మీ అమ్మ దగ్గరికి పంపించాలనుకున్నావని దాసు అంటాడు. తప్పు సరిదిద్దుకున్నా కదా అని అంటుంది జ్యోత్స్న.
దీపకు తను ఎవరి కూతురో చెప్పావా? అని జ్యోత్స్న అడుగుతుంది. నిజం తెలిస్తేనే దీప అలా మాట్లాడుతుందని అంటుంది. నేను దీపకు నువ్వే సుమిత్ర, దశరథల అసలైన కూతురివి అని చెప్పడానికి క్షణం పట్టదు. ఈ నిజం తెలిసినవాడ్ని నేను ఒక్కడినే ఉన్నానా? అసలు నేను చెప్పేంత వరకూ ఈ ఇంటి వారసురాలు బతికుందని మీకు తెలియదు. నా లాగే ఇంకెవరైనా చూసి ఉండొచ్చు కదా అని దాసు అంటాడు.
మా అమ్మ చంపించిన సైదులు బతికే ఉన్నాడేమో. వచ్చి దీపకు నిజం చెప్పాడేమోనని దాసు అంటాడు. ఇక చాలు ఆపు నాన్న. ఎందుకు ఇంత జాలి లేకుండా మాట్లాడుతున్నావని జ్యో అంటుంది. మేడ పై నుంచి ఇదంతా చూస్తాడు కాశీ. నా జీవితం గ్రానీ నిర్ణయమని జ్యో అంటుంది. జ్యోత్స్నక్క మా నాన్నను పర్సనల్ గా కలవడం ఏంటీ? చేతులు పట్టుకుని మాట్లాడుకోవడం ఏంటీ? అని అనుకుంటాడు కాశీ.
దశరథకు కాఫీ ఇచ్చి సుమిత్రమ్మ అని పిలుస్తుంది దీప. ఈ రోజు చాలా విశేషం ఉందంటా. భార్యభర్తలు గుడికి వెళ్తే మంచిదని అంటుంది దీప. నేను ఎక్కడికీ వెళ్లడం లేదు. మంచి అనేది మనలో ఉండాలి. అది లేకుండా వెళ్లి దేవుడికి నమస్కారం పెట్టి నవ్వుతూ కొబ్బరికాయ కొట్టినంత మాత్రాన మనం కోరుకున్న ఫలితం రాదు దీప. నేనైతే వెళ్లడం లేదని దశరథ చెప్తాడు. ఇంకెంత కాలం సుమిత్రమ్మతో మాట్లాడకుండా ఉంటారని దీప అడుగుతుంది.
ఎవరి సమస్య? ఎవరు బాధపడుతున్నారో బాధ పడేవాళ్లకు, బాధ పెట్టేవాళ్లకు తెలుసు. తప్పు చేసిన వాళ్లకు అంత మొండి పట్టుదల ఎందుకు? అని అంటాడు దశరథ. మీకు నా మీద కోపం ఉంటే నన్ను శిక్షించండి. ఏం చేస్తే సుమిత్రమ్మతో మాట్లాడుతారని దీప అడుగుతుంది.
ఈ కాఫీ కప్ నా భార్య మీద పెట్టుకున్న నమ్మకమని కింద పడేసి పగలకొడతాడు దశరథ. దాన్ని అతికించగలవా? ఇక్కడ నాకు కొన్నేళ్ల నమ్మకం పగిలిపోయింది. ఎలా అతుక్కుంటుంది? అని దశరథ వెళ్లిపోతాడు. మీరైనా అయ్యగారితో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు కదా అని సుమిత్రతో అంటుంది దీప. తప్పు చేశా, శిక్ష అనుభవించనివ్వు దీప. నీ మీద నాకున్న కోపాన్ని, ద్వేషాన్ని, నా భర్త విషయంలో నువ్వు చేసిన తప్పు గురించి మాట్లాడను. కానీ మర్చిపోనని సుమిత్ర అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం