కన్నడ పొలిటికల్ థ్రిల్లర్ చిత్రం ‘బయలుసీమే’ 2023 ఆగస్టులో థియేటర్లలో రిలీజైంది. వరుణ్ కట్టిమణి, టీఎస్ నాగాభరణ, రవిశంకర్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. లీడ్ రోల్ చేసిన వరుణ్ కట్టిమణినే ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ఓటీటీలోకి చాలా ఆలస్యమైంది. ఎట్టకేలకు చాలా లేట్గా ఇప్పుడు స్ట్రీమింగ్కు వచ్చింది.
బయలుసీమే చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది. అయితే, రెంటల్ విధానంగా ఈ మూవీ స్ట్రీమింగ్కు అడుగుపెట్టింది. ప్రైమ్ వీడియోలో రూ.99 రెంట్ చెల్లించి ఈ చిత్రాన్ని చూడొచ్చు.
థియేటర్లలో రిలీజైన 21 నెలలకు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి బయలుసీమే మూవీ వచ్చింది. ఓటీటీ డీల్ జరగపోవటం కారణంగా ఇంత కాలం స్ట్రీమింగ్కు రాలేదు. ఇప్పుడు కూడా రెంటల్ విధానంలో ప్రైమ్ వీడియోలో ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది.
ఉత్తర కర్ణాటకలోని గజేంద్రఘడ్ ప్రాంతంలో బయలుసీమే స్టోరీ సాగుతుంది. నిజాయితీపరుడైన రాజకీయ నేత బాబురావ్ షిండే (టీఎస్ నాగాభరణ)కు మద్దతుదారుడిగా ఉండే రాము (వరుణ్ కట్టిమణి) చుట్టూ కథ ఉంటుంది. వితంతువైన అక్కమ్మ (సుంయుక్త హొరడు)ను రాము ప్రేమిస్తాడు. వీరి పెళ్లికి షిండే ఏర్పాట్లు చేస్తాడు. అయితే, ఓ డ్రగ్ డీలర్ శంకర్ (రవి శంకర్) రాకతో పరిస్థితులు మారిపోతాయి. ఎమ్మెల్యే సీట్ కోసం అతడు ప్రయత్నిస్తాడు. హులియప్ప (యశ్ శెట్టి) కూడా రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో షిండే వర్గం వారిని నిలువరించాల్సి వస్తుంది. రాముకు చాలా సవాళ్లు ఎదురవుతాయి. రాజకీయ కుట్రలు జరుగుతాయి. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ సినిమాలో ఉంటాయి.
బయలుసీమే మూవీని లక్ష్మణ్ సా సింగ్రి ప్రొడ్యూజ్ చేయగా.. మానసా హొల్ల సంగీతం అందించారు. తక్కువ బడ్జెట్లో రూపొందిన ఈ మూవీ నేటివిటీకి తగ్గట్టుగా ఉందనే టాక్ వచ్చింది.
తమన్నా భాటియా లీడ్ రోల్ చేసిన తెలుగు మూవీ ఓదెల 2.. ఈ వారంలోనే మే 8వ తేదీన స్ట్రీమింగ్కు వచ్చింది. ఏప్రిల్ 17వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ పెద్దగా కలెక్షన్లను దక్కించుకోలేకపోయింది. ఈ సినిమా సంపత్ నంది కథ, స్క్రీన్ప్లే అందించగా.. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు హిందీ, తమిళంలో ఓదెల 2 స్ట్రీమ్ అవుతోంది.
సంబంధిత కథనం