ఓటీటీలోకి సూపర్ హిట్ కన్నడ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 8.6 రేటింగ్-kannada murder mystery thriller movie agnyathavasi ott release date zee5 ott to stream movie from 16th may ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలోకి సూపర్ హిట్ కన్నడ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 8.6 రేటింగ్

ఓటీటీలోకి సూపర్ హిట్ కన్నడ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 8.6 రేటింగ్

Hari Prasad S HT Telugu

ఓటీటీలోకి ఓ సూపర్ హిట్ కన్నడ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ వస్తోంది. ఈ సినిమాకు ఐఎండీబీలో ఏకంగా 8.6 రేటింగ్ ఉండటం విశేషం. ఈ నెల 11న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ వచ్చే నెలలో డిజిటల్ ప్రీమియర్ కానుంది. మరి ఈ సినిమా విశేషాలేంటో చూడండి.

ఓటీటీలోకి సూపర్ హిట్ కన్నడ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 8.6 రేటింగ్

ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ వస్తోంది. ఈ సినిమా పేరు అజ్ఞాతవాసి (Agnyathavasi). ఈ కన్నడ మూవీ ఈ నెల 11నే థియేటర్లలో రిలీజైంది. మిక్స్‌డ్ నుంచి పాజిటివ్ రివ్యూలు సొంతం చేసుకున్న ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. మరి ఈ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు? అసలు సినిమా కథేంటన్న వివరాలు చూద్దాం.

అజ్ఞాతవాసి ఓటీటీ రిలీజ్ డేట్

జనార్దన్ చిక్కన్న డైరెక్ట్ చేసిన సినిమా ఈ అజ్ఞాతవాసి. ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా ఓటీటీ, శాటిలైట్ హక్కులను జీ నెట్‌వర్క్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని కూడా అనౌన్స్ చేశారు. మే 16 నుంచి జీ5లోకి ఈ సినిమా రానుంది. అయితే ఈ మధ్యకాలంలో జీ నెట్‌వర్క్ సొంతం చేసుకున్న సినిమాలు ఒకేసారి ఇటు ఓటీటీ, అటు టీవీలోకి వస్తున్నాయి.

కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ మ్యాక్స్, వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఇలాగే వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ అజ్ఞాతవాసిని కూడా ఇలాగే తీసుకొస్తారా లేదా అన్నది చూడాలి. అంతేకాదు ఈ కన్నడ మూవీ తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుందా అన్నదానిపైనా ఎలాంటి స్పష్టత లేదు.

అజ్ఞాతవాసి స్టోరీ ఏంటంటే?

కన్నడ మూవీ అజ్ఞాతవాసి ఓ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. ఈ సినిమాను హేమంత్ రావ్ తన దాక్షాయిని టాకీస్ బ్యానర్లో నిర్మించారు. ఇందులో రంగాయన రఘు, రవిశంకర్ గౌడ, శరత్ లోహితశ్వ, సిద్దు మూలిమాని, పావన గౌడలాంటి వాళ్లు నటించారు. ఇది 1990ల నేపథ్యంలో సాగే కథ. కర్ణాటకలోని మల్నాడ్ అనే ఊళ్లో జరుగుతుంది. అక్కడ ఓ భూస్వామి అనుమానాస్పద స్థితిలో కన్నుమూస్తాడు. అయితే స్థానిక సీఐ మాత్రం అది హత్యగా భావిస్తాడు.

అసలు అతనికి అది హత్య అని ఎందుకు అనిపించింది? దీనిని అతడు నిరూపించగలడా? చివరికి ఏం జరిగింది అన్నది ఈ సినిమాలో చూడొచ్చు. 25 ఏళ్లుగా ఎలాంటి నేరం లేని ఆ ఊళ్లో సడెన్ గా జరిగిన ఈ ఘటన ఆ ఊళ్లో వాళ్లపై ఎలాంటి ప్రభావం చూపిందన్నది కూడా ఈ మూవీలో ఇంట్రెస్టింగ్ పాయింట్. ఐఎండీబీలో 8.6 రేటింగ్ తోపాటు పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకున్న ఈ అజ్ఞాతవాసి మూవీ జీ5 ఓటీటీలో మే 16 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం