ఓటీటీలోకి మరో కన్నడ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ వస్తోంది. ఈ సినిమా పేరు అజ్ఞాతవాసి. గత నెలలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. సుమారు 50 రోజుల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కాబోతోంది. జనార్దన్ చిక్కన్న డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రంగాయన రఘు లీడ్ రోల్లో నటించాడు. మరి ఈ మూవీ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుంది? ఎందుకు చూడాలో తెలుసుకోండి.
కన్నడలో సప్త సాగరాలు దాటి మూవీని నిర్మించిన హేమంత్ రావ్ ప్రొడ్యూస్ చేసిన సినిమా ఈ అజ్ఞాతవాసి. నిజానికి కొవిడ్ సమయంలోనే షూటింగ్ పూర్తి చేసుకున్నా.. థియేటర్లు మూతపడటంతో రిలీజ్ వాయిదా వేశారు. మొత్తానికి ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా బుధవారం (మే 28) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
థియేటర్లలో మూవీకి మంచి రెస్పాన్స్ రావడంతో ఓటీటీలో మరింత మెరుగ్గా రాణిస్తుందని భావిస్తున్నారు. సైనైడ్ మూవీ ఫేమ్ రంగాయన రఘు లీడ్ రోల్లో ఈ సినిమా రూపొందింది. 1990ల నేపథ్యంలో ఓ హత్య చుట్టూ తిరిగే మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఇది. ఇందులో రఘుతోపాటు శరత్ లోహితశ్వ, అరవింద్ కుప్లికర్, పావన గౌడ, రవిశంకర్ గౌడలాంటి వాళ్లు నటించారు.
అజ్ఞాతవాసి మూవీ 25 ఏళ్లుగా అసలు ఎలాంటి నేరం జరగని మల్నాడ్ ప్రాంతంలోని ఓ ఊళ్లో జరిగే స్టోరీ. 1990ల నేపథ్యంలో సాగే సినిమా. అయితే స్థానిక భూస్వామి శ్రీనివాసయ్య హత్యతో ఒక్కసారిగా ఆ గ్రామం ఉలిక్కిపడుతుంది. మొదట్లో అతనిది సహజ మరణమని భావించినా.. తర్వాత అది హత్య అని తేలుతుంది.
ఎవరు, ఎందుకు చేశారన్నదే పోలీసులు కనిపెట్టాల్సిన విషయం. ప్రతి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలో ఉండే ఉత్కంఠే ఈ అజ్ఞాతవాసిలోనూ కనిపిస్తుంది. ఈ మధ్యే శాఖాహారిలాంటి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రంగాయన రఘు ఈ అజ్ఞాతవాసిలోనూ అదరగొట్టాడు. అతనితోపాటు మూవీలో కీలకపాత్రలు పోషించిన వాళ్లందరి నటన చాలా బాగుంటుంది.
అజ్ఞాతవాసి మూవీలో భూస్వామి మరణం అందరికీ సహజంగానే అనిపించినా.. ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ కు మాత్రం ఎందుకు హత్యలాగా కనిపించిందన్నదే ఆసక్తిరేపే ప్రశ్న. దీనికి సమాధానం దొరకాలంటే ఈ మూవీ చూడాల్సిందే. అజ్ఞాతవాసి జీ5 ఓటీటీలో మే 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సంబంధిత కథనం