Kangana Ranaut: కంగనాకు భారీ షాక్.. ఆ సినిమాతో రూ.78 కోట్ల నష్టం
బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్కు పెద్ద షాకే తగిలింది. తన రీసెంట్ మూవీ ధాకడ్ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడటంతో భారీ నష్టాలను చవిచూసింది.
బాలీవుడ్లో హీరోలకు సమానమైన క్రేజ్ కంగనా రనౌత్ సొంతం. ఫైర్బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఆమె.. ఈ మధ్య హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ ఎంచుకుంటోంది. తన పక్కన హీరోలుగా నటించడానికి కూడా చాలా మంది భయపడుతున్నారని ఆ మధ్య ఇంటర్వ్యూల్లో ఆమె చెప్పడం విశేషం. అయితే ఆమె లేటెస్ట్ మూవీ ధాకడ్ కంగనాకు పెద్ద షాకే ఇచ్చింది.
ఈ యాక్షన్ థ్రిల్లర్లో ఆమె ఏజెంట్ అగ్ని పాత్రలో కనిపించింది. రూ.85 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ.2.58 కోట్ల కలెక్షన్లు రాబట్టడం గమనార్హం. దీంతో ఈ మూవీ ప్రొడ్యూసర్లకు రూ.78 కోట్ల నష్టం వాటిల్లినట్లు బాలీవుడ్ హంగామా వెల్లడించింది. ఇప్పటి వరకూ ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులను కూడా వాళ్లు అమ్మలేదు.
ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర మూవీ దారుణంగా బోల్తా పడటంతో ఈ డిజిటల్, టీవీ హక్కులను మరీ తక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహా అయితే ఈ రెండూ కలిపి రూ.5 కోట్ల వరకూ రావచ్చని అంచనా వేస్తున్నారు. బాక్సాఫీస్ కలెక్షన్లు, ఈ హక్కులు కలుపుకున్నా.. నిర్మాతలకు రూ.78 కోట్ల నష్టం తప్పదు. ధాకడ్ మూవీకి కాస్త పాజిటివ్ రివ్యూలే వచ్చినా.. ఆ సినిమాకు కార్తీక్ ఆర్యన్ భూల్ భులయ్యా 2 నుంచి గట్టి పోటీ ఎదురైంది.
ఈ మూవీ ఫెయిల్యూర్పై కంగనా స్పందించింది. 2022 ఇంకా ముగియలేదని, లాకప్ రియాల్టీ షో రూపంలో తనకు పెద్ద సక్సెస్ దక్కినట్లు ఆమె చెప్పింది. 2019లో మణికర్ణిక మూవీకి రూ.160 కోట్లు వచ్చాయని, అది పెద్ద సక్సెసని చెప్పినా ఆమె.. గతేడాది తలైవీతో తన కెరీర్లోనే పెద్ద హిట్ అందుకున్నట్లు తెలిపింది. ఇక ఆమె ప్రస్తుతం ఎమర్జెన్సీ అనే మూవీలో నటిస్తోంది. ఇందులో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది.
సంబంధిత కథనం
టాపిక్