Trisha: కమల్ హాసన్, త్రిష ప్రస్తుతం తమ నెక్ట్స్ మూవీ థగ్ లైఫ్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. మణిరత్నం డైరెక్ట్ చేస్తున్న మూవీ ఇది. ఇందులో భాగంగా ఓ ఈవెంట్లో త్రిషపై కమల్ ఓ బూతు జోకు వేయడం గమనార్హం. ఓ వంటకం విషయంలో కమల్ నోరు జారాడు. దీనిపై ప్రస్తుతం నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మణిరత్నం డైరెక్షన్ లో కమల్ హాసన్, త్రిష, శింబు నటిస్తున్న మూవీ థగ్ లైఫ్. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ ముగ్గురూ ఓ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ఫేవరెట్ డిష్ గురించి త్రిష మాట్లాడింది. “నాకు అన్నీ ఇష్టమే. కానీ ఉడకబెట్టిన అరటి చాలా ఇష్టం. దాన్నేమంటారు?” అని త్రిష అడిగింది. అప్పుడు పక్కనే ఉన్న కమల్ స్పందిస్తూ.. పళం పూరి అని అన్నాడు. ఆ.. పళం పూరి అంటే నాకు చాలా ఇష్టం అని త్రిష చెప్పింది.
కమల్ అంతటితో ఆగకుండా.. “తనకు దాని పేరు తెలియదు కానీ.. నోట్లో పెట్టుకోవడం మాత్రం ఇష్టం” అని అంటూ పెద్దగా నవ్వాడు. అది విని త్రిషతోపాటు అక్కడున్న వాళ్లందరూ బిగ్గరగా నవ్వారు. ఆ తర్వాత త్రిష మోకాలిపై చేయి వేసి నిమిరాడు. ఆఫ్ ద కెమెరాలో కమల్ ఇంకెన్ని జోక్స్ వేస్తాడో అని యాంకర్ అనడం వినిపించింది. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.
ఈ వీడియో వైరల్ అవడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టాక్సిక్ కమల్ అంటూ ఓ అభిమాని ఈ వీడియోపై కామెంట్ చేశారు. గతంలో మన్సూర్ అలీ ఖాన్ పై ఫిర్యాదు చేసిన త్రిష.. ఇప్పుడు కమల్ విషయంలోనూ అలాగే చేస్తుందా అని మరో అభిమాని ప్రశ్నించారు. ఇదే కామెంట్ చిరంజీవిలాంటి ఓ తెలుగు హీరో చేస్తే ఎంత రచ్చ చేసేవారో అని మరొకరు కామెంట్ చేశారు.
అయితే కొందరు కమల్ అభిమానులు మాత్రం అతన్ని వెనకేసుకొస్తున్నారు. మన ఆలోచనను బట్టే ఇలాంటి అర్థాలు వస్తాయని ఒకరు కామెంట్ చేశారు. అందులో తప్పేముంది అని ఇంకొకరు ప్రశ్నించారు. ఇందులో డబుల్ మీనింగ్ ఏముంది? కమల్ జోకింగ్ గానే అలాంటి కామెంట్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది కదా అని మరో అభిమాని అన్నారు.
మణిరత్నం డైరెక్షన్ లో వస్తున్న థగ్ లైఫ్ మూవీ జూన్ 5న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇందులో కమల్ హాసన్, త్రిష, శింబుతోపాటు అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్, అభిరామి, నాజర్, సాన్యా మల్హోత్రాలాంటి వాళ్లు నటిస్తున్నారు. 1987లో వచ్చిన బ్లాక్ బస్టర్ నాయకుడు తర్వాత మణిరత్నం డైరెక్షన్ లో కమల్ నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.
సంబంధిత కథనం