Bimbisara Sequel Update: కల్యాణ్ రామ్ బింబిసార సీక్వెల్ ఎప్పుడొస్తుందో తెలుసా?-kalyan ram new movie bimbisara may start on next year ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Kalyan Ram New Movie Bimbisara May Start On Next Year

Bimbisara Sequel Update: కల్యాణ్ రామ్ బింబిసార సీక్వెల్ ఎప్పుడొస్తుందో తెలుసా?

Maragani Govardhan HT Telugu
Aug 30, 2022 06:42 AM IST

Bimbisara Sequel Update: నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం బింబిసార. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో చిత్రానికి సీక్వెల్ కూడా తీయబోతున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ బింబిసార 2 ఇప్పుడప్పుడే ప్రారంభమయ్యేలా కనిపించడం లేదు.

బింబిసార 2
బింబిసార 2 (Twitter)

Bimbisara Sequel Update: నందమూరి హీరో కల్యాణ్ రామ్‌కు చాలా రోజుల తర్వాత అదిరిపోయే హిట్ బింబిసార రూపంలో వచ్చింది. వెల వెలబోతున్న తెలుగు సినిమా థియేటర్లకు నూతనోత్తేజాన్ని కలిగించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కల్యాణ్ రామ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఓ పక్క సీతా రామం, కార్తికేయ 2 లాంటి చిత్రాలు వసూళ్లను భారీగా రాబట్టినప్పటికీ.. బింబిసార మాత్రం ఓ రేంజ్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికీ ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన టీమ్.. ఆ చిత్ర స్క్రిప్ట్ వర్క్ పనిలో పడ్డారు.

ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం బింబిసార 2 సినిమా ఇప్పుడప్పుడే పట్టాలెక్కేలా కనిపించడం లేదు. ఈ చిత్ర దర్శకుడు ప్రస్తుతం బింబిసార సక్సెస్ కావడంతో హాలీడేలో భాగంగా అనేక దేవాలయాలను సందర్శిస్తున్నారు. ఈ పర్యటన అయిపోయిన తర్వాతే బింబిసార సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

మరోపక్క కల్యాణ్ రామ్‌కు మూడు కమ్మిట్మెంట్లు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, దిల్ రాజు, అభిషేక్ నామా ఇలా ముగ్గురు బడా నిర్మాతలతో కలిసి పని చేయనున్నారు. వీటితో పాటు ఎన్టీఆర్-కొరటాల కాంబోలో రానున్న NTR30 చిత్రానికీ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి బింబిసార సీక్వెల్‌ పరట్టాలెక్కించడానికి కనీసం ఓ ఏడాది సమయం పట్టేలా ఉంది. వచ్చే ఏడాది చివర్లో కానీ లేదా 2024 ప్రారంభంలో కానీ సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సోషియో ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో కేథరిన్ థెరిసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా చేశారు. చింతరామన్ భట్ ఈ చిత్రానికి పాటలు అందించగా.. ఎంఎం కీరవాణి నేపథ్య సంగీతాన్ని సమకూర్చారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తూ నటించారు. మల్లిడి వశిష్ట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వరినా హుస్సేన్, వెన్నెల కిశోర్, శ్రీనివాస్ రెడ్డి, ప్రకాశ్ రాజ్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. చోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా చేశారు. తమ్మి రాజు ఎడిటింగ్ చేశారు. ఆగస్టు 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్