Kalki 2898 AD Movie: సినీ ప్రపంచమంతా ఎదురుచూస్తున్న కల్కి 2898 ఏడీ సినిమా మరో రెండు వారాల్లో రిలీజ్ కానుంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ మూవీపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. గ్లోబల్ రేంజ్లో సత్తాచాటుతుందనే హైప్ ఉంది. జూన్ 27వ తేదీన కల్కి చిత్రం రిలీజ్ కానుంది. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా ప్రమోషన్ల కోసం మూవీ టీమ్ ఓ కొత్త వ్యూహాన్ని పాటిస్తోంది.
ఎల్ఈడీ స్క్రీన్లతో పదుల సంఖ్యలో వాహనాలను కల్కి 2898 ఏడీ మూవీ టీమ్ రెడీ చేసింది. వీటి ద్వారా దేశవ్యాప్తంగా ప్రమోషన్లను చేయాలనే స్ట్రాటజీ పాటిస్తోంది. ఈ వాహనాల ద్వారా ప్రజల్లోకి ఈ మూవీని తీసుకెళ్లేలా ప్లాన్ చేసింది. ఎల్ఈడీ స్క్రీన్లతో సిద్ధమైన జీప్లతో ఓ వీడియోను నేడు (జూన్ 14) సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
దేశవ్యాప్తంగా కాంతిని విస్తరించేందుకు రైడ్ మొదలైంది అంటూ వైజయంతీ మూవీస్ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ వాహనాలకు ఉన్న ఎల్ఈడీ స్క్రీన్లలో ట్రైలర్ సహా ప్రమోషన్ మెటీరియల్ను ప్రదర్శించనుంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు ఈ వాహనాలు వెళ్లనున్నాయి. ఇలా.. ప్రమోషన్లలో కొత్త స్ట్రాటజీని తీసుకొచ్చింది కల్కి 2898 ఏడీ మూవీ టీమ్.
కల్కి 2898 ఏడీ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ఓ కీలకపాత్ర చేస్తున్నారు. నేడు ఆమె పుట్టిన రోజు కావటంతో లుక్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఈ చిత్రంలో దిశా పటానీ పేరు రోక్సీ అని వెల్లడించింది. స్టైలిష్ లుక్తో దిశా ఉన్న పోస్టర్ తీసుకొచ్చింది.
కల్కి 2898 ఏడీ సినిమా అప్పుడే కలెక్షన్లలో ఓ రికార్డు సృష్టించింది. అమెరికా ప్రీమియర్ల టికెట్ల ప్రీ-సేల్లో అప్పుడే మిలియన్ డాలర్ మార్క్ దాటేసింది. దీంతో అత్యంత వేగంగా అమెరికా ప్రీమియర్లలో మిలియన్ డాలర్ మార్క్ దాటిన భారతీయ మూవీగా రికార్డు సృష్టించింది. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని కూడా అధిగమించింది. రిలీజ్కు ముందు ఒకరోజు జూన్ 26నే నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోలు పడనున్నాయి.
కల్కి 2898 ఏడీ సినిమా ట్రైలర్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీంతో అంచనాలు మరింత భారీగా పెరిగాయి. సినిమాలో ఊహించని చాలా ట్విస్టులు ఉంటాయని అర్థమవుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దిశా పటానీ, సస్వతా ఛటర్జీ, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం కీలకపాత్రలు పోషించారు. ఫ్యుచరిస్టిక్ కారు ‘బుజ్జి’ కూడా మరో హైలైట్గా ఉంది.
కల్కి 2898 ఏడీ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసేందుకు కూడా టీమ్ ప్లాన్ చేస్తోంది. తొలి పాట గురించి త్వరలోనే అప్డేట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సుమారు రూ.600కోట్ల భారీ బడ్జెట్తో ఈ మూవీ రూపొందింది. భారీ స్థాయిలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు కూడా యూనిట్ ప్రణాళికలు రచిస్తోంది.