ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమాపై బిగ్‍ అప్‍డేట్.. రిలీజ్ డేట్‍ ఫిక్స్.. స్పెషల్ డే రోజు గ్లింప్స్-jr ntr prashanth neel action movie release date announced officially rumoured title dragon glimpse ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమాపై బిగ్‍ అప్‍డేట్.. రిలీజ్ డేట్‍ ఫిక్స్.. స్పెషల్ డే రోజు గ్లింప్స్

ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమాపై బిగ్‍ అప్‍డేట్.. రిలీజ్ డేట్‍ ఫిక్స్.. స్పెషల్ డే రోజు గ్లింప్స్

జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‍లో తెరకెక్కుతున్న సినిమాపై బిగ్ అప్‍డేట్ వచ్చేసింది. ఈ చిత్రం విడుదల తేదీని మూవీ టీమ్ నేడు అధికారికంగా వెల్లడించింది. గ్లింప్స్ రిలీజ్ గురించి కూడా ప్రకటించింది.

ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమాపై బిగ్‍ అప్‍డేట్.. రిలీజ్ డేట్‍ ఫిక్స్.. స్పెషల్ డే రోజు గ్లింప్స్

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమాపై హైప్ విపరీతంగా ఉంది. హైవోల్టేజ్ యాక్షన్ మూవీగా రానున్న ఈ చిత్రంపై మొదటి నుంచి అంచనాలు భారీగా నెలకొన్నాయి. దేవరతో గతేడాది సూపర్ హిట్ కొట్టారు ఎన్టీఆర్. కేజీఎఫ్ 1,2, సలార్ చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్‍లో ప్రశాంత్‍కు క్రేజ్ ఉంది. దీంతో ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్‌పై చాలా క్రేజ్ మరింత ఎక్కువ ఉంది. ఈ తరుణంలో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఓ భారీ అప్‍డేట్‍ను మూవీ టీమ్ నేడు (ఏప్రిల్ 29) వెల్లడించింది.

రిలీజ్ డేట్ ఇదే

ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమా వచ్చే ఏడాది 2026 జూన్ 25వ తేదీన విడుదల కానుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు అధికారికంగా వెల్లడించింది. సోషల్ మీడియా ద్వారా మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ డేట్‍ను ప్రకటించాయి. వచ్చే ఏడాది జూన్ 25న ఎన్టీఆర్ నీల్ ద్వయం యాక్షన్ విధ్వంసం వెండితెరపై ప్రేక్షకుల ముందుకు రానుంది.

గ్లింప్స్ ఎప్పుడంటే..

ఈ మూవీ నుంచి గ్లింప్స్ వచ్చేస్తోంది. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గ్లింప్స్ తీసుకొస్తామని మూవీ టీమ్ వెల్లడించింది. దీంతో ఎన్టీఆర్ పుట్టిన రోజైన మే 20న గ్లింప్స్ రానుందని అర్థమైపోయింది. గ్లింప్స్ ద్వారా టైటిల్ కూడా వెల్లడించే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకు డ్రాగన్ అనే పేరు ఖరారైందని చాలా కాలం రూమర్లు ఉన్నాయి.

కర్ణాటకలో షూటింగ్

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలో జరుగుతోంది. ఇటీవలే ఎన్టీఆర్ ఈ మూవీ షూటింగ్ మొదలుపెట్టారు. ప్రస్తుతం ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ముందు వచ్చే ఏడాది సంక్రాంతికే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. అయితే, అప్పటికల్లా సాధ్యం కాదని భావించారు. దీంతో 2026 జూన్ 25ను విడుదలకు ఫిక్స్ చేశారు.

ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‍గా నటిస్తారని తెలుస్తోంది. ప్రకాశ్ రాజ్ కీలకపాత్ర పోషించనున్నారు. ఈ మూవీలో చేసే ఇతర నటీనటుల వివరాలు క్రమంగా బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు నిర్మిస్తున్న ఈ మూవీని.. టీ సిరీస్ ఫిల్మ్స్ సమర్పించనుంది. భారీ బడ్జెట్‍తో ఈ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం