Joram OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?-joram ott streaming manoj bajpayee movie in amazon prime video from today 12th april ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Joram Ott Streaming: ఓటీటీలోకి వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?

Joram OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?

Hari Prasad S HT Telugu

Joram OTT Streaming: ఓటీటీలోకి మరో సర్వైవల్ థ్రిల్లర్ మూవీ వచ్చేసింది. గతేడాది డిసెంబర్ లో రిలీజైన జోరమ్ మూవీ ప్రైమ్ వీడియోలో ఉచితంగా అందుబాటులోకి వచ్చింది.

ఓటీటీలోకి వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?

Joram OTT Streaming: బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పాయీ నటించిన సర్వైవల్ థ్రిల్లర్ జోరమ్. ఈ సినిమా గతేడాది డిసెంబర్ 8న రిలీజైంది. అయితే ఇప్పుడు థియేటర్లలో రిలీజైన ఐదు నెలలకు ఓటీటీలో ఫ్రీగా అందుబాటులోకి వచ్చింది. ఇన్నాళ్లూ ప్రైమ్ వీడియోలోనే ఉన్నా.. రెంట్ విధానంలో మాత్రమే చూసే అవకాశం కల్పించారు.

ప్రైమ్ వీడియోలోకి జోరమ్

నిజానికి ఈ జోరమ్ మూవీ ప్రైమ్ వీడియోలో రెంట్ విధానంలో ఉండగానే యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులోకి వచ్చింది. ఇక ఇప్పుడు ఈ ఓటీటీ కూడా ఉచితంగా స్ట్రీమింగ్ చేస్తోంది. దేవశిష్ మకీజా డైరెక్ట్ చేసిన ఈ జోరమ్ మూవీ అంతర్జాతీయ స్థాయిలో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి.

ఈ సినిమా ఫ్రీగా ప్రైమ్ వీడియోలోకి వచ్చినట్లు శుక్రవారం (ఏప్రిల్ 12) సోషల్ మీడియా ద్వారా మనోజ్ బాజ్‌పాయీ అనౌన్స్ చేశాడు. సర్వైవల్ కోసం సాగే చేజ్ ప్రైమ్ వీడియోలో కొనసాగనుంది అనే క్యాప్షన్ తో జోరమ్ మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని అతడు వెల్లడించాడు.

అసలేంటీ జోరమ్ మూవీ?

తనను చంపాలని చూస్తున్న వారి నుంచి ఓ వ్యక్తి తన బిడ్డతో కలిసి పారిపోతాడు. జార్ఖండ్ నుంచి ముంబై వచ్చి భవన నిర్మాణ పనులు చేసుకునే దాస్రు కర్కెట్టా అలియాజ్ బాలా (మనోజ్ బాజ్‍పేయీ) భార్య హత్యకు గురవుతుంది. దాస్రు, అతడి మూడు నెలల కూతురు జోరమ్ ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతుంది.

దీంతో తమను మట్టుబెట్టాలని ప్రయత్నించే శక్తివంతమైన మనుషులు, వ్యవస్థ నుంచి దాస్రు తప్పించుకునేందుకు చాలా కష్టాలను ఎదుర్కొంటాడు. అతడికి హింసాత్మక గతం కూడా ఉంటుంది. చంపాలనుకునే వారి నుంచి తనను, తన బిడ్డను దాస్రు ఎలా కాపాడుకున్నాడు.. ఈ ప్రయత్నంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడన్నదే జోరమ్ చిత్రం ప్రధాన అంశాలుగా ఉన్నాయి.

ఈ సినిమాలో మనోజ్ బాజ్‌పాయీతోపాటు జీషాన్ అయుబ్, స్మితా తాంబే నటించారు. ఈ సినిమా గతేడాది డిసెంబర్ 8న థియేటర్లలోకి వచ్చినా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. అదే సమయంలో యానిమల్, సామ్ బహదూర్ లాంటి సినిమాలు ఉండటంతో జోరమ్ ను ప్రేక్షకులు పట్టించుకోలేదు.

జోరమ్ చిత్రం 2023లో రెటెర్‌డామ్‍ (నెదర్లాండ్స్)లో ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ ఫెస్టివల్‍లో ప్రదర్శితమైంది. 70వ సిడ్నీ ఫిల్మ్స్ ఫెస్టివల్, డర్బన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, 28వ బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ ఫెస్టివల్, 59వ చికాగో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‍లో ప్రదర్శితమైంది. ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి స్టాండిగ్ ఓవియేషన్ దక్కింది. ఆస్కార్ లైబ్రరీలోనూ పర్మినెంట్ కోర్ కలెక్షన్లలో ఈ చిత్రం చోటు దక్కించుకుంది.