బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహాం ప్రధాన పాత్ర పోషించిన ‘ది డిప్లమాట్’ చిత్రం ఈ ఏడాది మార్చి 14వ తేదీన విడుదలైంది. ఈ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా మూవీకి శివమ్ నాయర్ దర్శకత్వం వహించారు. భారత దౌత్యవేత్త జేపీ సింగ్ నిజ జీవితంలో జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ది డిప్లమాట్ సినిమా ఇప్పుడు ఓటీటీ ఎంట్రీ సిద్ధమవుతోంది.
ది డిప్లమాట్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు నెట్ఫ్లిక్స్ ఓటీటీ దగ్గర ఉన్నాయి. ఈ మూవీని మే 9వ తేదీన స్ట్రీమింగ్కు తెచ్చేందుకు నెట్ఫ్లిక్స్ ప్లాన్ చేసుకుందని సమాచారం బయటికి అయింది. అయితే, ఈ డేట్పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
బాలీవుడ్ చిత్రాలు సాధారణంగా థియేటర్లలో రిలీజైన 8 వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుంటాయి. దీంతో ది డిప్లమాట్ కూడా మే 9న ఓటీటీలోకి వస్తుందని అంచనాలు ఉన్నాయి. త్వరలోనే నెట్ఫ్లిక్స్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. మరి అదే రోజున వస్తుందేమో చూడాలి.
పాకిస్థాన్లో చిక్కుకున్న భారత మహిళను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత దౌత్యవేత్త జేపీ సింగ్ చేసిన ప్రయత్నాలు, ఎదురైన సవాళ్ల చుట్టూ ది డిప్లమాట్ చిత్రం సాగుతుంది. నిజజీవిత ఘటనలో ఈ మూవీ రూపొందింది జేపీ సింగ్ పాత్రను జాన్ అబ్రహాం పోషించారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ చిత్రాన్ని గ్రిప్పింగ్గా తెరకెక్కించారు డైరెక్టర్ శివమ్ నాయర్.
ది డిప్లమాట్ చిత్రంలో జాన్ అబ్రహాంతో పాటు షాహిదా ఖతీబ్, కుముద్ మిశ్రా, షరీబ్ హష్మి, రేవతి, అశ్వత్ భట్, బెంజిమన్ గిలానీ, జగ్జీత్ సంధు కీరోల్స్ చేశారు. టీ సిరీస్ ఫిల్మ్స్, జేఏ ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ పిక్చర్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశాయి. మనన్ భరద్వాజ్, అనురాగ్ సైకియా, ఇషాన్ ఛాబ్రా మ్యూజిక్ డైరెక్టర్లుగా పని చేశారు.
ది డిప్లమాట్ చిత్రం సుమారు రూ.20కోట్ల మోస్తరు బడ్జెట్తో రూపొందినట్టు సమాచారం. ఈ సినిమా దాదాపు రూ.53కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద హిట్ అయింది. ఆరంభం నుంచే ఈ మూవీ మంచి టాక్ దక్కించుకుంది. అందుకు తగ్గట్టే మంచి కలెక్షన్లే వచ్చాయి.
తాను భారతీయురాలిని అంటూ పాకిస్థాన్లోని దౌత్య కార్యాలయానికి వస్తుంది ఉజ్మా అహ్మద్ (సాదియా ఖతీబ్) అనే మహిళ. తనను ఓ పాకిస్థానీ వ్యక్తి బలవంతంగా పెళ్లి చేసుకొని తీసుకొచ్చాడని చెబుతుంది. ఈ విషయాన్ని భారత దౌత్యవేత్త జేపీ సింగ్ (జాన్ అబ్రహాం) చేపడతారు. ఆమెను తిరిగి ఇండియాకు పంపేందుకు చాలా సవాళ్లు ఎదురవుతాయి. పాకిస్థాన్ న్యాయ వ్యవస్థ, అంతర్జాతీయ దౌత్యం విషయాల్లో సంక్లిష్టలను ఎదుర్కోవాల్సి వస్తుంది. భారత్కు ఉజ్మా వచ్చేలా జేపీ సింగ్ తీసుకున్న చర్యలు ఏంటి? ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? అనే విషయాలు ఈ చిత్రంలో ఉంటాయి. ఈ మూవీ గ్రిప్పింగ్గా, థ్రిల్లింగ్గా సాగుతుంది. జాన్ అబ్రహాం యాక్టింగ్ మెప్పిస్తుంది.
సంబంధిత కథనం