కడుపుబ్బా నవ్విస్తున్న జాతిరత్నాలు డైరెక్టర్ ఫంకీ మూవీ టీజర్.. విశ్వక్సేన్‌తో జత కట్టిన అనుదీప్-jathi ratnalu director anudeep kv next movie funky teaser released vishwak sen laughter riot ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  కడుపుబ్బా నవ్విస్తున్న జాతిరత్నాలు డైరెక్టర్ ఫంకీ మూవీ టీజర్.. విశ్వక్సేన్‌తో జత కట్టిన అనుదీప్

కడుపుబ్బా నవ్విస్తున్న జాతిరత్నాలు డైరెక్టర్ ఫంకీ మూవీ టీజర్.. విశ్వక్సేన్‌తో జత కట్టిన అనుదీప్

Hari Prasad S HT Telugu

జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కేవీ ఈసారి విశ్వక్సేన్ తో చేతులు కలిపాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఫంకీ మూవీ టీజర్ శుక్రవారం (అక్టోబర్ 10) రిలీజ్ కాగా.. ఇది తెగ నవ్విస్తోంది.

కడుపుబ్బా నవ్విస్తున్న జాతిరత్నాలు డైరెక్టర్ ఫంకీ మూవీ టీజర్.. విశ్వక్సేన్‌తో జత కట్టిన అనుదీప్

విశ్వక్సేన్ నెక్ట్స్ మూవీ ఫంకీ (Funky) టీజర్ వచ్చేసింది. జాతిరత్నాలు సినిమాతో తెగ నవ్వించిన అనుదీప్ కేవీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కూడా నవ్వులు పంచబోతున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. పైగా అనుదీప్, విశ్వక్సేన్ కాంబినేషనే ఎంతో ఆసక్తి రేపుతోంది. విశ్వక్ తో తన మార్క్ కామెడీని అనుదీప్ చూపించబోతున్నాడు.

ఫంకీ టీజర్ ఎలా ఉందంటే?

సింపుల్ గా, జనానికి సులువుగా అర్థమయ్యే కామెడీకి అనుదీప్ పెట్టింది పేరు. జోగిపేట అనే చిన్న ఊళ్లో జాతిరత్నాలు అనే సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ అతడు. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు విశ్వక్సేన్ తో ఫంకీ అనే సినిమా తీస్తున్నాడు. తాజాగా శుక్రవారం (అక్టోబర్ 10) ఈ మూవీ టీజర్ రిలీజైంది. ఈ టీజర్ మళ్ళీ అనుదీప్ మార్క్ కామెడీని తీసుకొచ్చింది.

మంచి పంచ్ లతో నిండిన ఈ టీజర్ మొత్తం సరదాగా సాగిపోయింది. ఈ కథ సినిమా నిర్మాణ ప్రపంచం నేపథ్యంలో సాగుతుంది. సినిమా పరిశ్రమను, అందులోని వ్యక్తులను సరదాగా ఆటపట్టిస్తుంది. దీనికి తనదైన కామెడీని జోడించి అనుదీప్ ఈ ఫంకీ సినిమాను తీసుకొస్తున్నాడు.

ఫంకీ మూవీ గురించి..

విశ్వక్ సేన్, కాయదు లోహర్ ఈ ఫంకీ సినిమాలో జంటగా నటించారు. వారి కెమిస్ట్రీ చాలా ఫ్రెష్‌గా కనిపిస్తోంది. ఈ టీజర్‌లో సీనియర్ నటులు నరేష్, మురళీధర్ గౌడ్ కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు. టీజర్ మొత్తం పదునైన వన్ లైనర్లు, సిచువేషనల్ కామెడీతో సాగిపోయింది. ముఖ్యంగా అనుదీప్ కామెడీని ఇష్టపడే వారికి ఈ ఫంకీ మూవీ టీజర్ బాగా నచ్చుతుంది.

'ఫంకీ' సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. ఈ సినిమా డిసెంబర్ 2025లో థియేటర్లలో విడుదల కానుంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం