Janhvi Kapoor Marriage: మీకు పిచ్చి పట్టింది: పెళ్లెప్పుడు అని అడిగితే జాన్వీ రియాక్షన్ ఇదీ-janhvi kapoor marriage actress says you have gone mad when asked about her wedding ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Janhvi Kapoor Marriage: మీకు పిచ్చి పట్టింది: పెళ్లెప్పుడు అని అడిగితే జాన్వీ రియాక్షన్ ఇదీ

Janhvi Kapoor Marriage: మీకు పిచ్చి పట్టింది: పెళ్లెప్పుడు అని అడిగితే జాన్వీ రియాక్షన్ ఇదీ

Hari Prasad S HT Telugu

Janhvi Kapoor Marriage: పెళ్లెప్పుడు అని జాన్వీ కపూర్ ని అడిగితే మీకు పిచ్చి పట్టింది అని ఆమె అనడం విశేషం. అంబానీల పెళ్లి వేడుకకు బాయ్‌ఫ్రెండ్ తో కలిసి వచ్చిన జాన్వీ.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

మీకు పిచ్చి పట్టింది: పెళ్లెప్పుడు అని అడిగితే జాన్వీ రియాక్షన్ ఇదీ

Janhvi Kapoor Marriage: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పెళ్లిపై చాలా రోజులుగా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఆమె కొన్నేళ్లుగా శిఖర్ పహారియాతో డేటింగ్ చేస్తుండటమే దీనికి కారణం. వీళ్ల రిలేషన్షిప్ ను ఆమె తండ్రి బోనీ కపూర్ కూడా అంగీకరించడంతో ఇక పెళ్లే తరువాయి అని వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని ఈ మధ్య అంబానీల పెళ్లి వేడుకలో కనిపించినప్పుడు అడిగితే.. మీకు పిచ్చి పట్టిందని ఆమె అనడం విశేషం.

పెళ్లిపై జాన్వీ రియాక్షన్ ఇదీ..

జాన్వీ కపూర్ కొన్నాళ్లుగా బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి పబ్లిక్ ఈవెంట్స్ కు వెళ్తోంది. ఆ మధ్య అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీవెడ్డింగ్ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. తాజాగా పెళ్లి వేడుకలోనూ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. అంతేకాదు మెడలో శిఖర్ పేరుతో ఉన్న లాకెట్ కూడా ఆమె వేసుకుంది. దీంతో ఈ పెళ్లి వేడుకలో కొందరు మీడియా వాళ్లు జాన్వీ పెళ్లి గురించి అడిగారు.

నిజానికి జాన్వీ సోమవారం (జులై 15) తన ఇన్‌స్టాగ్రామ్ లో మీ అందరికీ ఓ సీక్రెట్ చెబుతాను అని ఓ పోస్ట్ చేసింది. ఆ తర్వాత ఆమె తన నెక్ట్స్ మూవీ ఉలజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వెళ్లింది. ఆమె అక్కడికి రాగానే ఆ సీక్రెట్ పెళ్లి గురించేనా అని ఓ మీడియా ప్రతినిధి ఆమెను అడిగాడు. దీనిపై జాన్వీ స్పందిస్తూ.. మీకు పిచ్చి పట్టింది అని అనడం విశేషం. మరి ఆ సీక్రెట్ ఏంటని అడిగితే.. రేపటి వరకు ఆగండని బదులిచ్చింది.

అంబానీల పెళ్లిలో జాన్వీ, శిఖర్ హంగామా

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి జులై 12న జరిగిన విషయం తెలుసు కదా. ఈ వేడుకకు దేశ విదేశాల నుంచి ఎంతో మంది సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. వీళ్లలో జాన్వీ, శిఖర్ జోడీ మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. ఈ ఇద్దరూ కలిసి ఫొటోలకు పోజులిచ్చిన, కలిసి డ్యాన్స్ చేసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ నేపథ్యంలో వీళ్ల అనధికారికంగా తమ పెళ్లిని కన్ఫమ్ చేసినట్లే అని అభిమానులు ఫిక్సయ్యారు. అంతేకాదు ఆమె తిరుపతిలోనే శిఖర్ ను పెళ్లి చేసుకోబోతోందని కూడా గతంలో వార్తలు వచ్చాయి. అప్పుడు కూడా ఇందులో ఏమాత్రం నిజం లేదంటూ జాన్వీ స్పందించింది. తాను 16 ఏళ్ల వయసున్నప్పటి నుంచీ శిఖర్ తెలుసని, ప్రస్తుతం అతని కలలు తనవని, తన కలలు అతనివని, ఇద్దరం అంతలా కలిసిపోయామని మిర్చీ ప్లస్ ఇంటర్వ్యూలో జాన్వీ చెప్పింది.

ఇక జాన్వీ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి దేవర మూవీ చేస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూడా విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఇది కాకుండా స్పై థ్రిల్లర్ మూవీ ఉలజ్ లోనూ నటిస్తోంది.