KOKO Teaser: భారత్‌లో మొదటి సైంటిఫిక్ థ్రిల్లర్ కోకో టీజర్ విడుదల.. హాలీవుడ్‌ను తలదన్నేలా ఉంది..!-indias first authentic scientific thriller koko glimpse released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  India's First Authentic Scientific Thriller Koko Glimpse Released

KOKO Teaser: భారత్‌లో మొదటి సైంటిఫిక్ థ్రిల్లర్ కోకో టీజర్ విడుదల.. హాలీవుడ్‌ను తలదన్నేలా ఉంది..!

Maragani Govardhan HT Telugu
May 14, 2023 01:58 PM IST

KOKO Teaser: భారత్‌లో మొట్టమొదటి ప్రామాణికమైన సైంటిఫిక్ థ్రిల్లర్‌ కోకో చిత్రం టీజర్ విడుదలైంది. ఈ సినిమాలోని విజువల్స్ హాలీవుడ్ చిత్రాలను తలదన్నేలా ఉన్నాయి. జూన్ 3వ వారం నుంచి సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది.

కోకో టీజర్ విడుదల
కోకో టీజర్ విడుదల

KOKO Teaser: సైంటిఫిక్ థ్రిల్లర్లంటే హాలీవుడ్ సినిమాలే గుర్తుకొస్తాయి. మనదేశంలో అడపా దడపా సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో కొన్ని సినిమాలు తెరకెక్కినప్పటికీ పూర్తి స్థాయిలో ప్రామాణికమైన మూవీస్ రాలేదనే చెప్పాలి. తాజాగా ఇండియాలోనే మొట్టమొదటి ప్రామాణికమైన సైంటిఫిక్ థ్రిల్లర్ రాబోతుంది. అదే 'కోకో'(KOKO) మూవీ. జై కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సందీప్ రెడ్డి వాసా నిర్మిస్తున్నారు. తాజాగా కోకో వరల్డ్‌ను పరిచయం చేస్తూ చిత్రబృందం ఓ వీడియోను విడుదల చేసింది.

ఈ వీడియోను చూస్తే ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. చిన్నపాటి వీడియోతోనే భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా విస్తరిస్తుందో చూపించారు. ఈ వీడియో AI ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తుంది. అంతేకాకుండా సినీ అభిమానులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది. టెక్నికల్ స్టాండార్డ్స్ వరల్డ్ క్లాస్‌లో ఉంటాయని ఈ టీజర్ చూస్తేనే తెలుస్తోంది. ఫలితంగా మూవీపై క్యూరియాసిటీని పెంచుతోంది.

కోకో అనేది స్వీయ నిర్మిత కృత్రిమ మేధస్సు. అంటే తనంతట తానే నిర్మితమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓ బ్లాక్ హ్యాట్ హ్యాకర్ తన కుటుంబానికి జరిగిన నష్టానికి ప్రతీకారం తీర్చుకోడాని, తన తండ్రి కోరికను అమలు చేయడానికి దీన్ని ఉపయోగిస్తుంది. జూన్ మూడో వారం నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది వేసవికి సినిమాను రిలీజ్ చేయనున్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రం గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. అందులోని విజువల్స్, టాప్ నాడ్జ్ టెక్నికల్‌తో థ్రిల్లింగ్ అనుభూతిని కలిగిస్తాయి.

ఈ చిత్రం మన భారతీయ భాషలతో పాటు వియత్నామీస్, తైవాన్‌ల కూడా విడుదల కానుంది. నిజానికి ఈ దేశాల్లో నేరుగా విడుదల కానున్న తొలి ఇండియన్ మూవీ ఇదే అవుతుంది. ఈ సినిమాలో ప్రపంచ వ్యాప్తంగా పలువురు నటీనటులు నటించనున్నారు. ప్రధాన తారాగణం త్వరలో ప్రకటించనున్నారు. జై కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సందీప్ రెడ్డి వాసా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్