kamal haasan: రామ్ చరణ్ సినిమా పూర్తయిన తర్వాతే ఇండియన్-2 మొదలు...
మూడేళ్ల క్రితం కమల్హాసన్, దర్శకుడు శంకర్ కలయికలో భారీ అంచనాలతో ఇండియన్ 2 షూటింగ్ మొదలైంది. ఈ సినిమా సెట్స్లో ప్రమాదం జరగడం, నిర్మాతలతో శంకర్ కు విభేదాలు తలెత్తడంతో షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయింది. ఇండియన్ 2 చిత్రీకరణను తిరిగి ప్రారంభించేందుకు కమల్ హాసన్ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. శుక్రవారం జరిగిన విక్రమ్ సక్సెస్ మీట్ లో ఇండియన్ 2 షూటింగ్ ఎప్పుడు మొదలుపెట్టేది కమల్ వెల్లడించారు.
దక్షిణాది ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేకెత్తించిన సీక్వెల్స్లో ఇండియన్ -2 ఒకటి. 1996లో కమల్హాసన్, దర్శకుడు శంకర్ కలయికలో వచ్చిన ఇండియన్ చిత్రానికి కొనసాగింపుగా ఈ సీక్వెల్ను మొదలుపెట్టారు. సేనాపతి పాత్రలో మరోసారి కమల్హాసన్ నటించనుండటం, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్తో పాటు పలువురు అగ్రనాయకానాయికలు ఈ సినిమాలో భాగం కావడంతో సీక్వెల్ వార్తల్లో నిలిచింది.
సేనాపతి గెటప్లో కమల్హాసన్ పోస్టర్స్ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. 2019లో లాంఛనంగా ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. 2020 ఫిబ్రవరిలో సెట్స్లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు యూనిట్ సిబ్బంది మరణించడంతో ఇండియన్ 2 షూటింగ్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఆ తర్వాత దర్శకుడు శంకర్, నిర్మాణ సంస్థ లైకాకు మధ్య మనస్పర్థలు తలెత్తాయి.
శంకర్కు వ్యతిరేకంగా నిర్మాత కోర్టును ఆశ్రయించడంతో ఈసినిమా ఆగిపోయినట్లుగా ప్రచారం జరిగింది. షూటింగ్ను తిరిగి మొదలుపెట్టేందుకు కమల్హాసన్ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా విక్రమ్ తో సుదీర్ఘ విరామం తర్వాత భారీ సక్సెస్ను అందుకున్నారు కమల్హాసన్. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇండియన్ 2పై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం జరిగిన సక్సెస్ మీట్లో ఇండియన్ 2 షూటింగ్ను తిరిగి ప్రారంభించేందుకు తనతో పాటు దర్శకుడు శంకర్ కూడా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని కమల్హాసన్ పేర్కొన్నారు. అతడు ఈ సినిమా పూర్తి చేయాలనే ఆలోచనలోనే ఉన్నట్లు చెప్పాడు. తప్పకుండా ఈసినిమాను సెట్స్పైకితీసుకొస్తామని కమల్ హాసన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం రామ్చరణ్తో శంకర్ ఓ సినిమా చేస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాతే ఇండియన్ 2 షూటింగ్ తిరిగి మొదలుకానుందని కమల్హాసన్ ఇన్డైరెక్ట్గా ఈ వేడుకలో పేర్కొన్నాడు.
కమల్హాసన్ మాటలను బట్టి చూస్తే వచ్చే ఏడాది ఇండియన్ 2 చిత్రీకరణ పునఃప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. రామ్చరణ్, శంకర్ కలయికలో రూపొందుతున్న చిత్రాన్ని దిల్రాజు నిర్మిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో కియారా అద్వాణీ కథానాయికగా నటిస్తోంది.
సంబంధిత కథనం