రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇండియన్ ఐడల్ విన్నర్.. ఫొటోలు, వీడియోలు వైరల్-indian idol 12 winner pawandeep rajan injured seriously in an road accident ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇండియన్ ఐడల్ విన్నర్.. ఫొటోలు, వీడియోలు వైరల్

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇండియన్ ఐడల్ విన్నర్.. ఫొటోలు, వీడియోలు వైరల్

Hari Prasad S HT Telugu

ఇండియన్ ఐడల్ 12 విజేత పవన్‌దీప్ రాజన్ ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోమవారం (మే 5) తెల్లవారుఝామున ఈ ప్రమాదం జరిగింది.

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇండియన్ ఐడల్ విన్నర్.. ఫొటోలు, వీడియోలు వైరల్

మూడేళ్ల కిందట తన మధురమైన వాయిస్ తో ఇండియన్ ఐడల్ 12 సీజన్ విజేతగా నిలిచిన సింగర్ పవన్‌దీప్ రాజన్. ఉత్తరాఖండ్ కు చెందిన ఈ సింగర్ సోమవారం (మే 5) తెల్లవారుఝామున 3.40 గంటలకు జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం తర్వాత అతడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

పవన్‌దీప్‌కు ప్రమాదం

ఇండియన్ ఐడల్ సింగింగ్ షో ద్వారా పాపులర్ అయిన సింగర్ పవన్‌దీప్ రాజన్ ప్రస్తుతం నోయిడాలోని ఫోర్టిస్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. కారు ప్రమాదంలో అతనికి ఒకటికి మంచి ఫ్రాక్చర్లు అయినట్లు గుర్తించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అతన్ని స్థానిక హాస్పిటల్ కు తీసుకెళ్లినా.. తర్వాత గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో నోయిడాకు తరలించారు. నేషనల్ హైవే 9పై ఈ ప్రమాదం జరిగింది.

అతడు ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పవన్‌దీప్ కారు నుజ్జునుజ్జయింది. ప్రమాదం తర్వాత అతడు హాస్పిటల్లో అపస్మారక స్థితిలో ఉన్న వీడియోను ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. అతని కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలైనట్లు ఈ ఫొటోలు, వీడియోలు చూస్తే స్పష్టమవుతోంది. అసలు ప్రమాదానికి కారణమేంటన్నది మాత్రం తెలియలేదు. పవన్‌దీప్‌కు ప్రమాదం విషయం తెలియగానే అతని అభిమానులు.. సోషల్ మీడియాలో గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్స్ చేశారు.

ఎవరీ పవన్‌దీప్ రాజన్?

ఉత్తరాఖండ్ లోని కుమవోనీ తెగకు చెందిన కుటుంబం నుంచి వచ్చిన సింగర్ పవన్‌దీప్. అక్కడి జానపద కళాకారుడిగా మొదట పేరు సంపాదించాడు. అతని తండ్రి సురేష్ రాజన్, తల్లి సరోజ్ రాజన్, సోదరి జ్యోతిదీప్ రాజన్ కూడా ఆ జానపద కళాకారులే. మొదట 2015లో ది వాయిస్ ఆఫ్ ఇండియా రియాల్టీ షో ద్వారా వెలుగులోకి వచ్చాడు.

ఆ తర్వాత ఇండియన్ ఐడల్ 12 విజేతగా నిలిచి దేశవ్యాప్తంగా పేరు సంపాదించాడు. అరుణిత కాంజీలాల్, మహ్మద్ డానిష్, సాయ్లీ కాంబ్లే, నిహాల్ తౌరోలాంటి వాళ్లను వెనక్కి నెట్టి అతడు ట్రోఫీ అందుకున్నాడు. ఆ తర్వాత సూపర్ స్టార్ సింగర్ 2వ సీజన్లో మెంటార్ గా మారాడు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం