OTT Malayalam Action Thriller: తెలుగులో రిలీజైన వారం రోజుల్లోనే ఓటీటీలోకి వస్తున్న త్రిష మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ-identity ott release date trisha tovino thomas malayalam action thriller to stream on zee5 ott on 31st january ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Malayalam Action Thriller: తెలుగులో రిలీజైన వారం రోజుల్లోనే ఓటీటీలోకి వస్తున్న త్రిష మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ

OTT Malayalam Action Thriller: తెలుగులో రిలీజైన వారం రోజుల్లోనే ఓటీటీలోకి వస్తున్న త్రిష మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ

Hari Prasad S HT Telugu
Jan 24, 2025 04:34 PM IST

OTT Malayalam Action Thriller: ఓ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెలుగులో రిలీజైన వారం రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. త్రిష, టొవినో థామస్ నటించిన ఈ మూవీ ఈ శుక్రవారమే (జనవరి 24) తెలుగులో రిలీజ్ అవడం విశేషం.

తెలుగులో రిలీజైన వారం రోజుల్లోనే ఓటీటీలోకి వస్తున్న త్రిష మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ
తెలుగులో రిలీజైన వారం రోజుల్లోనే ఓటీటీలోకి వస్తున్న త్రిష మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ

OTT Malayalam Action Thriller: ఈ ఏడాది మలయాళంలో రిలీజైన తొలి సినిమా నెల రోజుల్లోపే ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. త్రిష, టొవినో థామస్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఐడెంటిటీ జనవరి 2న థియేటర్లలో రిలీజైంది. ఇక తెలుగులోనూ వచ్చిన ఈ సినిమా ఈరోజే (జనవరి 24) రిలీజ్ కాగా.. వారం రోజుల్లోనే ఓటీటీలోకి అడుగుపెడుతుండటం విశేషం.

yearly horoscope entry point

ఐడెంటిటీ ఓటీటీ రిలీజ్ డేట్

మలయాళం స్టార్ హీరో టొవినో థామస్, త్రిష నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఐడెంటిటీ. ఈ సినిమా జనవరి 31 నుంచి జీ5 (Zee5) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. గతంలో వచ్చిన హిట్ మూవీ ఫోరెన్సిక్ ను డైరెక్ట్ చేసిన అనస్ ఖాన్, అఖిల్ పాల్ ఈ ఐడెంటిటీని దర్శకత్వం వహించారు. జనవరి 2న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా నెల రోజుల్లోపే స్ట్రీమింగ్ కు వస్తోంది.

ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని తెలుగులోనూ శుక్రవారం (జనవరి 24) థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఓటీటీలోకి ఒకేసారి మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. రూ.12 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.18 కోట్లు వసూలు చేసింది.

ఐడెంటిటీ మూవీ గురించి..

ఈ ఐడెంటిటీ మూవీ ప్రధానంగా ముగ్గురి చుట్టూ తిరుగుతుంది. అలెన్ (వినయ్ రాయ్) అనే పోలీస్ ఆఫీసర్, అలీషా (త్రిష), హరన్ (టొవినో థామస్) అనే జర్నలిస్టుల చుట్టూ తిరిగే కథ ఇది. ఓ కిల్లర్ ను పట్టుకునేందుకు అలెన్, అలీషా ప్రయత్నిస్తుండగా.. వారికి సాయం చేయడానికి హరన్ రంగంలోకి దిగుతాడు. అయితే పలు మానసిక సమస్యలతో బాధపడే అలీషా.. ఆ కిల్లర్ ను ముఖ కవళికల ఆధారంగా గుర్తు పెట్టుకుంటుంది.

అయితే ఈ కేసు ముందుకు సాగుతున్న కొద్దీ ఈ ముగ్గురూ ఒకరిపై ఒకరు అనుమానం వ్యక్తం చేసుకుంటారు. తర్వాత ఏం జరిగిందన్నది ఈ మూవీలో చూడొచ్చు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ థియేటర్లలో ప్రేక్షకులకు మంచి థ్రిల్ అందించింది. ముఖ్యంగా టొవినో థామస్, వినయ్ రాయ్ నటన సినిమాకు హైలైట్ గా నిలిచింది. థ్రిల్లింగ్ కారు చేజులతోపాటు విమానంలో చేసే స్టంట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

Whats_app_banner

సంబంధిత కథనం