Identity OTT: ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్.. బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలోకి వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మిస్ కావద్దు-identity ott release date trisha tovino thomas action thriller movie to stream on zee5 ott from 31st january ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Identity Ott: ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్.. బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలోకి వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మిస్ కావద్దు

Identity OTT: ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్.. బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలోకి వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మిస్ కావద్దు

Hari Prasad S HT Telugu

Identity OTT Release Date: ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్ ఉన్న ఓ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెలుగులోనూ ఓటీటీలోకి రాబోతోంది. ఈ వారమే స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమాను అస్సలు మిస్ కావద్దు.

ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్.. బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలోకి వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మిస్ కావద్దు

Identity OTT Release Date: మలయాళంలో ఈ ఏడాది తొలి రిలీజ్ అయిన ఐడెంటిటీ మూవీ నెల రోజుల్లోపే ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ఈ వారమే ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. త్రిష, టొవినో థామస్ నటించిన ఈ మూవీకి ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్ ఉన్నా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం దారుణంగా బోల్తా పడింది. తెలుగులోనూ గత శుక్రవారం (జనవరి 24) థియేటర్లలో రిలీజైంది.

ఐడెంటిటీ ఓటీటీ రిలీజ్ డేట్

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్, త్రిష నటించిన మూవీ ఐడెంటిటీ (Identity). ఈ ఏడాది జనవరి 2న థియేటర్లలో రిలీజైంది. మలయాళంలో మొదటి నుంచీ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐఎండీబీలో అయితే ఏకంగా 9 రేటింగ్ వచ్చింది. అయితే బాక్సాఫీస్ దగ్గర మాత్రం మూవీ బోల్తా పడింది. ఐడెంటిటీ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ.17 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది.

అయితే ఈ సినిమా ఇప్పుడు నెల రోజుల్లోపే అంటే వచ్చే శుక్రవారం (జనవరి 31) నుంచే జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ మూవీ స్ట్రీమింగ్ కానుంది. బాక్సాఫీస్ వసూళ్లను పక్కన పెడితే ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మాత్రం ఓటీటీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని ట్రైలర్ చూస్తేనే స్పష్టమవుతోంది.

ఐడెంటిటీ మూవీ గురించి..

ఈ ఐడెంటిటీ మూవీ ఓ కిల్లర్ ను పట్టుకునేందుకు ఓ స్కెచ్ ఆర్టిస్ట్, ఓ పోలీస్ ఆఫీసర్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తారన్నదాని చుట్టూ తిరుగుతంది. మూవీ మొత్తం ప్రధానంగా మూడు పాత్రలే ఉంటాయి. అలెన్ (వినయ్ రాయ్) అనే పోలీస్ ఆఫీసర్, అలీషా (త్రిష) అనే జర్నలిస్ట్, హరన్ (టొవినో థామస్) అనే స్కెచ్ ఆర్టిస్ట్ చుట్టూ తిరిగే కథ ఇది.

ఓ కిల్లర్ ను పట్టుకునేందుకు అలెన్, అలీషా ప్రయత్నిస్తుండగా.. వారికి సాయం చేయడానికి హరన్ రంగంలోకి దిగుతాడు. అయితే పలు మానసిక సమస్యలతో బాధపడే అలీషా.. ఆ కిల్లర్ ను ముఖ కవళికల ఆధారంగా గుర్తు పెట్టుకుంటుంది.

అయితే ఈ కేసు ముందుకు సాగుతున్న కొద్దీ ఈ ముగ్గురూ ఒకరిపై ఒకరు అనుమానం వ్యక్తం చేసుకుంటారు. తర్వాత ఏం జరిగిందన్నది ఈ మూవీలో చూడొచ్చు.

ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ థియేటర్లలో ప్రేక్షకులకు మంచి థ్రిల్ అందించింది. ముఖ్యంగా టొవినో థామస్, వినయ్ రాయ్ నటన సినిమాకు హైలైట్ గా నిలిచింది. థ్రిల్లింగ్ కారు చేజులతోపాటు విమానంలో చేసే స్టంట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

సంబంధిత కథనం