Tripti Dimri Viral Video: యానిమల్ చిత్రంతో యంగ్ బ్యూటీ తృప్తి డిమ్రి జాతకం ఒక్కసారిగా మారిపోయింది. ఫుల్ పాపులర్ అయ్యారు. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ కాకపోయినా.. కనిపించింది కాసేపే అయినా తృప్తికి మాత్రం బాగా పేరొచ్చింది. హీరో రణ్బీర్ కపూర్తో తృప్తి డిమ్రి.. ఇంటిమేట్ సీన్లు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. తృప్తి అందం, నటన చాలా ప్రేక్షకులకు తెగనచ్చేసింది. దీంతో నేషనల్ క్రష్ అంటూ తృప్తికి పేరు పెట్టేశారు. అయితే, ఓ ఈవెంట్లో హీరో రణ్బీర్ కపూర్నే తృప్తి తదేకంగా అలాగే చూశారు. ఈ వీడియో వైరల్ అయింది. దీంతో, ఆ వీడియోపై తృప్తి తాజాగా స్పందించారు.
ఇటీవల యానిమల్ మూవీ స్క్రీనింగ్కు రణ్బీర్, తృప్తి డిమ్రి సహా మూవీ యూనిట్ సభ్యులు హాజరయ్యారు. అయితే, అప్పుడు ఫొటో షూట్ కోసం వేదిక దగ్గరికి వచ్చారు. అయితే, ఆ సమయంలోనే తన ముందు అటూ ఇటూ తిరిగిన రణ్బీర్నే చూశారు తృప్తి. అతడు ఎటు వెళితే అటే చూశారు. దీంతో రణ్బీర్ నుంచి తృప్తి చూపుతిప్పుకోలేకపోతున్నారని, ఆమె ప్రేమలో పడినట్టున్నారని చాలా మంది ఈ వీడియోపై కామెంట్స్ చేస్తున్నారు. ఏదో ఉందంటూ రాసుకొస్తున్నారు. ఈ వీడియో కొద్ది రోజులుగా వైరల్ అవుతోంది. దీంతో ఈ వీడియో గురించి తృప్తి డిమ్రి మాట్లాడారు.
ఎవరైనా మన ముందు ఉండి.. ఇతరులతో మాట్లాడుతుంటే ఆ వ్యక్తినే చూస్తాం కదా అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తృప్తి డిమ్రి చెప్పారు. మాములుగానే రణ్బీర్ను చూశానని చెప్పారు. ఆ రోజు తాను చాలా కంగారుగా ఉన్నానని కూడా తృప్తి తెలిపారు.
“మేం స్క్రీనింగ్ దగ్గర ఉన్నాం. నటీనటులందరినీ ఒక్కచోటికి తీసుకొచ్చి ఫొటోలు షూట్ చేయాలనుకున్నారు. అందరినీ ఒకచోటికి రమ్మన్నారు. అప్పుడు అక్కడి వారు మాట్లాడుతున్నారు. అతడు (రణ్బీర్ కపూర్) నా ముందే నిలబడి ఎవరితోనే మాట్లాడుతున్నారు. మన ముందు ఎవరైనా నిలబడి.. మరెవరితోనో మాట్లాడుతుంటే.. సాధారణంగా వారి వైపే చూస్తాం కదా” అని తృప్తి డిమ్రి చెప్పారు.
యానిమల్ సినిమా స్క్రీనింగ్ రోజు చాలా కంగారు పడ్డానని, అందుకే చేతిని కూడా చాలాసార్లు రుద్దుకున్నానని తృప్తి డిమ్రి చెప్పారు. ఆ ఫుటేజ్ చూసి ఎందుకు కంగారు పడ్డావని తన తండ్రి కూడా అడిగారని వెల్లడించారు. మొత్తంగా, రణ్బీర్ వైపు మామూలుగానే చూశానని క్లారిటీ ఇచ్చారు తృప్తి.
యానిమల్ సినిమా భారీ బ్లాక్బాస్టర్ దిశగా దూసుకుపోతోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ కాగా.. 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.700కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. ఇంకా జోరు చూపిస్తోంది. ఈ చిత్రంలో రణ్బీర్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా చేయగా.. బాబీ డియోల్, అనిల్ కపూర్, తృప్తి డిమ్రి కీలకపాత్రలు పోషించారు.
సంబంధిత కథనం