Salman Tiger 3 Update: సల్మాన్-షారుఖ్ ఫైట్ కోసం భారీ సెట్.. ఎన్ని కోట్లో తెలుస్తే షాక్ అవుతారు?-huge set for salman and shah rukh action sequence in tiger 3 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Huge Set For Salman And Shah Rukh Action Sequence In Tiger 3

Salman Tiger 3 Update: సల్మాన్-షారుఖ్ ఫైట్ కోసం భారీ సెట్.. ఎన్ని కోట్లో తెలుస్తే షాక్ అవుతారు?

Maragani Govardhan HT Telugu
May 05, 2023 02:15 PM IST

Salman Tiger 3 Update: సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న టైగర్-3లో ఓ యాక్షన్ సీక్వెన్స్‌ భారీ ఖర్చుతో ఓ సెట్‌ను నిర్మిస్తున్నారట. షారుఖ్ కూడా పాల్గొనే ఈ సీక్వెన్స్ కోసం రూ.35 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.

సల్మాన్-షారుఖ్
సల్మాన్-షారుఖ్

Salman Tiger 3 Update: ప్రస్తుతం సౌత్ సినిమాల ఆధిపత్యం కనిపిస్తోంది. మన సినిమాల నార్త్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత బాలీవుడ్ మూవీస్ వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్న తరుణంలో షారుఖ్ ఖాన్ పఠాన్ ఆశలు చిగురించినప్పటికీ అది ఆ ఒక్క సినిమాకే పరిమితమైంది. పఠాన్ తర్వాత విడుదలైన ఏ బాలీవుడ్ మూవీ కూడా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇటీవల విడుదలైన సల్మాన్ కిసీ కా భాయ్ కిసీ కా జాన్ మూవీ కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో.. ఇక ఆశలన్నీ టైగర్-3పైనే పెట్టుకున్నారు. ఇందులో షారుఖ్ కూడా గెస్ట్ రోల్ పోషించనుండటంతో సినిమాపై బజ్ ఏర్పడింది. తాజాగా టైగర్-3 నుంచి ఆసక్తికర విషయం బయటకొచ్చింది.

టైగర్-3ని భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే బడ్జెట్ విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా ఖర్చు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా రూ.35 కోట్లు వెచ్చిచ్చిస్తున్నారట. ఇందుకోసం ఓ భారీ సెట్‌ను రూపొందిస్తున్నారట. జైల్ హౌస్ సీక్వెన్స్‌ కోసం ఈ సెట్‌ను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. సల్మాన్-షారుఖ్ ఇద్దరూ ఇందులో భాగమవుతారట. మే 8 నుంచి ఈ సీక్వెన్స్ చిత్రీకరించనున్నారని బాలీవుడ్ ఫిల్మ్ వర్గాల సమాచారం.

షారుఖ్-సల్మాన్ ఒకే చిత్రంలో నటిస్తున్నారంట విపరీతంగా బజ్ ఏర్పడుతుందని, వారి స్టార్‌డమ్‌ను దృష్టిలో పెట్టుకొని అదిరిపోయే సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఏకంగా రూ. 35 కోట్లు ఖర్చు చేస్తున్నారట. ఇంతకుముందెన్నడూ చూడని రీతిలో ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతుందని సమాచారం.

సల్మాన్ ఖాన్ సరసన కత్రినా కైఫ్ మరోసారి సందడి చేయనుంది. టైగర్ ప్రియురాలు జోయ పాత్రలో కనువిందు చేయనుంది. ఇక టైగర్ శత్రువుగా ఇమ్రాన్ హష్మి ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఈ సినమాకు. యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ పతాకంపై మనీష్ శర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది నవంబరు 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.

ఇప్పటికే వరుసగా పరాజయాలు అందుకుంటున్న సల్మాన్ ఈ మూవీతోనైనా హిట్ అందుకుంటాడేమో చూడాలి. ఈ ఏడాది షారుఖ్ నటించిన పఠాన్ చిత్రంలో సల్మాన్ గెస్ట్ రోల్ చేసి ఫ్యాన్స్‌ను అలరించారు. ఇప్పుడు టైగర్ కోసం పఠాన్ అతిథి పాత్రలో మెరవనుండటంతో సినిమాపై బజ్ ఏర్పడింది.

IPL_Entry_Point